Monday, April 27, 2020

The Cosmic Rebels

Since ancient times the sages have advised their students to know themselves and to ask, “Who am I?” Self-observation is possible for us because we are self-conscious beings. 
We know that we exist and we can reflect on our life. The self-consciousness differentiates us from the animal. Animals are in a dreamlike state. 

Some animal species that live in closer contact with humans can also develop mind. In minerals, plants and the majority of the animals, however, the mind, called Manas in Sanskrit, has not yet awakened. 

Through the awakening of Manas, man has grown from being guided by instinct to an individual. He slowly develops from an individual to a personality and from there to soul consciousness.

The unfoldment of the core of his being happens through the presence of high beings who have given to man the fire of mind. 

Since eons they are sending their light rays so that the blossom of human awareness unfolds. This blossom is also called the egoic lotus, the lotus of our soul.

There are different legends and allegorical narrations which explain the awakening of the mind. 

The story of the Fallen Angels contains in its esoteric meaning the key to the secrets of human consciousness in the same way as the eastern allegories of the Kumaras or Agnishvattas, the Solar Angels. 

It depends on our subtle understanding how far the teachings disclose themselves to us. 

Thus, the Greek legend of Prometheus, who brought man the fire from the gods, resembles the story of the awakening of self-consciousness through the Kumaras which we want to study here.

There are four Kumaras who were born out of the Creator at the beginning of creation. 

A fifth Kumara, Narada, later joined them as the teacher of the beings. The Kumaras are called the Sons of Mind, of the creative mind principle. They had been perfect beings already in the previous creation. 

The Kumaras came at the beginning of this creation, not to learn something more, but to help, especially the human beings. 

They are pure beings who are symbolically represented as five-year-old boys or as eternal youths of 16 years. 

The Puranas describe that Brahma, the Creator, asked them to co-create with him. 

But they refused, for they knew that they had another task. Brahma got angry and cursed them to descend to earth. Because of their disobedience they are also called the cosmic rebels.

Their disobedience had a purpose which Brahma did not know. They said, “The forms into which we are to move are not yet suited for us.” 

They refused to let their fire flow downwards and to stimulate beings for procreation. 

Therefore, they are also called Agnishvattas, those who have put off the procreative fire. Their flames are always directed upwards, to the origin. 

Thus, they are also described as innocent youths because impressions do not stick to their virginal pure mind. 

Though they were perfect beings of the most sublime worlds, they didn’t refuse to descend into the dense matter because this is precisely what they wanted.

గార్గి పండితురాలు

వేదవిద్యలో విదుషీమణి "గార్గి"
గార్గి పండితురాలు, బ్రహ్మజ్ఞాని. యాజ్ఞవల్క్యుడు అనే మహర్షితో వాద ప్రతివాదాలు చేసిన మహామనీషి ఆనాడూ, ఈనాడూ ఉపనయనం చేసుకోవటం పురుషులకే పరిమితం. అటువంటిది పురుషులతో పాటు సమంగా గార్గి కూడా ఉపనయనం చేసుకుంది. జందెం వేసుకుంది శాస్త్ర చర్చ చేసింది. మిధిలా నగర రాజైన జనకుని సభలో ఆస్థాన పండితురాలిగా ఎంతో పేరు తెచ్చుకుంది. సృష్టికి మూలమైన పరబ్రహ్మ గురించి మాట్లాడింది. యాజ్ఞవల్క్యుని ముప్పుతిప్పలు పెట్టింది. 

పురుషులకు స్త్రీలు ఎందులోనూ తీసిపోరని ఋజువు చేసింది. ఆది శంకరాచార్యులనూ ఇలాగే ఓ వనిత ఓడించింది. గార్గి కథ బృహదారణ్యక ఉపనిషత్తులో ఉంది. పూర్వం వాచక్ను అనే ఓ మహర్షి ఉండేవాడు. ఆయన కుమార్తె గార్గి అందానికీ, ఆత్మ స్థైర్యానికీ, పాండిత్యానికీ పెట్టింది పేరుగా ఉండేది. గార్గిని వాచక్ను మహర్షి గొప్ప పండితురాలిగా తీర్చిదిద్దాలనుకున్నాడు. తన ఆశ్రమానికి వచ్చే ఎందరెందరో పండితులతో ఆమెకు కావలసిన విద్యనంతటినీ నేర్చుకొనేలా చేశాడు. వేదాంత విద్యలో ఆమెను గొప్పగా తీర్చిదిద్దాడు. గార్గి విద్యా ప్రాభవం మెల్లమెల్లగా అందరికీ తెలిసింది. ఎక్కడన్నా గొప్ప గొప్ప వేదాంత సభలు జరిగినప్పుడుకూడా ఆమె వెళుతూ ఉండేది.
ఓ రోజున జనక మహారాజు ఓ గొప్ప సభ చేశాడు. ఆ సభకు ఎందరెందరో ప్రముఖులు వచ్చి వేదాంత చర్చలు జరిపారు. అదే సభకు గార్గి కూడా వెళ్ళింది. ఆ సభలో జనక మహారాజుకు ఓ ఆలోచన వచ్చింది. అంతమంది వేదాంత వేత్తల్లో బ్రహ్మవేత్త ఎవరో తెలుసుకోవాలనుకున్నారు. అలా బ్రహ్మవేత్త అయిన వ్యక్తికి బంగారు ఆభరణాలతో అలంకరించిన చక్కటి వేయి గోవులను బహూకరిస్తానని కూడా ప్రకటించాడు జనకుడు. ఆ ప్రకటన విని యాజ్ఞవల్క్య మహర్షి తానే బ్రహ్మవేత్తనని, ఆ గోవులను తనకే ఇమ్మని అన్నాడు. ఆ సభలో ఉన్న అశ్వలుడులాంటి రుషులు యాజ్ఞవల్క్యుడిని నీవు ఎలా బ్రహ్మవేత్తవో వివరించి చెప్పు అని అన్నారు. కానీ యాజ్ఞవల్క్యుడి ముందు ఎక్కువ సేపు నిలబడలేక పోయారు. అంతలో గార్గి లేచి ధైర్యంగా ప్రశ్నల వర్షం కురిపించింది. ఈ ప్రశ్నలడిగిన తీరు ఆమె వేదాంత పటిమకు గీటురాళ్ళయ్యాయి. దాంతో ఆ రోజు నుంచి గార్గి గొప్పతనం మరింతగా అందరికీ తెలిసింది.
గార్గి తన కడుపున పుట్టి అంత గొప్పదైనందుకు వాచక్ను మహర్షికి ఎంతో ఆనందం కలిగింది. అయితే ఆమె యవ్వన దశను దాటిపోతున్నా వివాహానికి మాత్రం సుముఖంగా లేకపోవటంతో ఎంతో బాధపడ్డాడు. తన కుమార్తె గొప్ప విద్యావతి అని పేరు తెచ్చుకోవాలనుకున్నాడు కానీ, పెళ్ళి లేకుండా బ్రహ్మచారిణిగా ఉండిపోవాలని అనుకోలేదు.
అలాంటి రోజుల్లో ఓ రోజున నారద మహర్షి ఆమె దగ్గర కొచ్చి స్త్రీ వివాహమాడాల్సిన అవసరాన్ని గురించి వివరించి చెప్పాడు. వివాహమైతే తప్ప ఆమె కావాలనుకుంటున్న ముక్తి సాధించటానికి అర్హత లభించదన్నాడు. అప్పుడు ఆలోచనలో పడింది గార్గి. తగిన వరుడి కోసం అన్వేషిస్తుంటే శృంగవంతుడు అనే ఒక ముని కనిపించాడు. అతడిని తనకు తగిన వరుడిగా భావించిన గార్గి వివాహానికైతే సమ్మతించింది కానీ, ఒక్క రోజుకు మించి తమ గృహస్థ జీవితం ఉండబోదని, రెండో రోజున సన్యాస దీక్షను తీసుకుని వెళ్లిపోతానని అంది. ఆమె అలా అనటం చూసిన కొందరు పెళ్ళి అయ్యాక ఈ ఆలోచన మానుకుంటుందిలే అనుకొన్నారు. పెళ్ళి అయింది. ఒక రోజు గడిచింది. ముందుగా అనుకొన్న మాట ప్రకారం తాను విడిపోబోతున్నానని గ్రహించి ఆమెకు నచ్చజెప్పటానికి ప్రయత్నం చేశాడు శృంగవంతుడు. కానీ ఆమె మనస్సు మార్చుకోలేదు. ఇహలోక సుఖాల కోసం పాకులాడక, ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోక తాను పొందాలనుకున్న ముక్తిమార్గం వైపు నడిచింది. వేదాంతసారం తెలిసిన మహోన్నత మనిషిగా చరిత్రలో నిలిచిపోయింది.

Sunday, April 26, 2020

Gautama Buddha

గౌతమ బుద్ధుడు పుట్టినప్పుడు ఆయన తండ్రి ఆస్థాన పురోహితులతో ఆయన జాతకం చూడమని అడిగితే...
వాళ్లు చెప్పడానికి మొదట భయపడ్డారు.
తర్వాత ఇలా చెప్పారు.

గౌతమ బుద్ధుడు అయితే లోకానికి అంతటికీ రాజవుతాడు లేకపోతే బిచ్చగాడు అవుతాడు అని...
కానీ ఒక సలహా ఇచ్చారు...
అతను బిచ్చగాడు కాకుండా ఉండాలి అంటే...
అతనిని బయటకు రాకుండా...
ఎలాంటి కష్టాలూ అతని కంట పడకుండా చూసుకోవాలని...
అతని తలరాతను మార్చడానికి ప్రయత్నించారు.
అలాంటి భవిష్యత్ గురించి తెలిసే గొప్ప మేధావులు కూడా తలరాతను మార్చడానికి ప్రయత్నిస్తుంటారు ఒక్కొక్కసారి...
కానీ వాళ్లకు కూడా తెలుసు అది ప్రయత్నం మాత్రమే అని...
మనిషి ఆశావాది...
తలరాతని కూడా మార్చడానికి ప్రయత్నిస్తుంటాడు...
కానీ విధి రాతే తధ్యమని చివరికి ఒప్పుకుంటాడు...
ఎన్ని విధాల రాజభవనంలో పెట్టి గౌతముని బయటకు కనబడకుండా పెంచినా కూడా...
ఎలాంటి కష్టం తెలియకుండా పెంచినా...
ఆయన తండ్రి పోయిన తర్వాత బయటకు రాక తప్పలేదు...
సమయం వచ్చినప్పుడు ఎలాంటి వారైనా బయటకు రావాల్సిందే...
అదే విధి లీల...
ఏదైనా గుప్పెట్లో ఉన్నంతవరకే...
గుప్పెట తెరిస్తే ఏదీ ఉండదు...
అదే సత్యం...
ఎప్పుడైతే ఆ సత్యాన్ని చూశాడో...
వెంటనే అన్నీ వదిలేసుకున్నాడు...
ఎవరైనా కూడా అంతే సత్యాన్ని తెలుసుకోవాలి...
ప్రతీ విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి...
ఎప్పుడైతే అలా ప్రయత్నిస్తామో మనకు తెలియకుండానే సత్యాన్ని తెలుసుకుంటాం...
అందులో ప్రధాన మార్గం ధ్యానం...
ఎప్పుడైతే ధ్యానం చేయడం మొదలు పెట్టామో...
మనం ప్రశాంతతను పొందుతాం...
అప్పుడు మన అసలైన కర్తవ్యం ఏంటన్నది తెలుస్తుంది...
కనీసం కొద్ది సేపైయనా రోజూ ధ్యానం చేయడం అలవాటు చేసుకోవాలి...
సర్వేజనా సుఖినోభవంతుః...

శ్రీ మహాభారతం

 శ్రీ మహాభారతంలో కథలు - తారకాసురుడి కొడుకులు
తారకాసురుడి కొడుకులు విద్యున్మాలి, తారకాక్షుడు, కమలాక్షుడు, అనే వాళ్ళు బ్రహ్మదేవుణ్ణి గురించి తపస్సు చేశారు. ఆయన ప్రత్యక్షమయ్యకా, తమకు ఎన్నడూ చావు లేకుండా వరమిమ్మని కోరారు. అది అసాధ్యమన్నాడాయన. మరేదైనా వరం కోరుకొమ్మన్నాడు.
"అయితే సకల సౌకర్యాలూ కలిగి కామగమనం గల మూడు పట్టణాలు మా ముగ్గిరికీ ఇవ్వు. అవి దేవదానవాదులెవరూ భేదించరానివిగా ఉండాలి. అలా అయితే మేము సుఖంగా వుంటాం" అన్నారు వాళ్ళు.
"సరే ! అలాగే ఇస్తాను. కాని ఆ మూడు పట్టణాలూ ఒక్కచోటికి రాకూడదు. తీరా వచ్చాకా బలవంతుడెవడైనా అది చూసి బాణం వేస్తే మాత్రం అవి నాశనమవుతాయి. అలా రాకుండా జాగ్రత్తపడండి" అన్నాడు బ్రహ్మ దేవుడు.
"అలాగే" అని ఆ వరం పొందారు వాళ్ళు.

తరువాత మయుణ్ణి పిలిచి పురాలు నిర్మించవలసిందన్నారు. అతడు తన తపస్సంతా ధారపోసి, నాలుగుదిక్కులూ నూరేసి యోజనాలుండేట్టుగా ముగ్గురికీ మూడు పట్టణాలు నిర్మించాడు. ఒకటి బంగారుది, రెండవది వెండిది, మూడోది ఇనుముతో చేసినది. తారకాక్షుడికి బంగారు పట్టణం ఇచ్చాడు. అది స్వర్గంలో సంచరిస్తుంది. కమలాక్షుడికి వెండి పట్టణం ఇచ్చాడు. అది అంతరిక్షంలో తిరుగుతుంది. ఇనుపనగరును విద్యున్మాలికిచ్చాడు. అది భూమిమీద తిరుగాడుతుంది. అలా ఆ రాక్షసులు ముగ్గురూ సకల భోగాలు అనుభవిస్తూ అంతటితో తృప్తి పడక ముల్లోకాలనూ స్వాధీనపర్చుకున్నారు. మయుడు తన మాయాజాలంతో వాళ్ళకు కావలసినవన్నీ సమకూరుస్తుండేవాడు. ఇలా చాలా ఏళ్ళు గడిచిపోయాయి. తారకాక్షుడికి 'హరి' అనే కొడుకు పుట్టాడు. అతడు కూడా బ్రహ్మదేవుణ్ణి గురించి తపస్సు చేసి , ' త్రిపురాల్లో వున్న రక్కసులు ఒకవేళ ఆయుధాల వల్ల చనిపోతే వాళ్ళను నీళ్ళలో పడేసిన వెంటనే ఒక్కడు పదిమందై అమిత బలంతో లేచి రావాలి. అలాంటి బావులు ఆ మూడు పట్టణాల్లోనూ వుండేటట్టు వరమివ్వు. వాటిలో నీళ్ళు నిరంతరం వుండలి ' అని వరమడిగాడు. బ్రహ్మ సరేనని వరమిచ్చాడు.

అంతటితో వాళ్ళ ఆగడాలు పెచ్చుమీరాయి. ముల్లోకాలనూ వేధించడం మొదలు పెట్టారు. దేవేంద్రుడు తట్టుకోలేక బ్రహ్మ దగ్గరకు వెళ్ళాడు. బ్రహ్మ పరమేశ్వర సన్నిదికి చేరాడు. అంతా విని పరమేశ్వరుడు " ఆ రాక్షసులు చాలా బలవంతులు. నా ఒక్కడి చేత చెడరు. అందుచేత నా తేజోబలాల్లో సగం తీసుకుని మీరందరూ కలిసి వాళ్ళను సంహరించండి" అన్నాడు.
"మహాత్మా! అది మా వల్ల కానిపని. నీ తేజస్సును మేము భరించలేం, అందుచేత మా అందరి తేజోబలాల్లో సగం సగం నీకే ఇస్తాం. నువ్వే ఆ శత్రువుల్ని సంహరించు' అని దేవతలు ప్రార్థించారు.

"సరే! అలాగే కానివ్వండి. నేను వాళ్ళను సంహరిస్తాను. కాని ఒక్క విషయం గుర్తుంచుకోండి. లోకాలన్నిటికీ పశుత్వం సహజం - నాకు పశుపతిత్వం కలగాలి. అలా అయితే పశువుల్ని చంపినా పాపం వుండదు. దివ్య రథం తయారుచేయండి. దానికి తగిన సారధినీ, విల్లమ్ములనూ తీసుకురండి" అన్నాడు శివుడు. తమకందరికీ పశుత్వం కలగడాన్ని గురించి దేవతలు విచారిస్తుంటే వాళ్ళ మనస్సు గ్రహించి "భయపడకండి! పాశుపతవ్రతం చేస్తే పశుత్వం పోతుంది" అని అభయమిచ్చాడు శివుడు. అప్పుడు దేవతలంతా తృప్తి పడి పరమేశ్వరుణ్ణి 'పశుపతి' అని స్తుతించారు. తమ తమ తేజోబలాలు సగం ధారపోసి ఆయనకు అభిషేకం చాశారు. విశ్వకర్మ దివ్య రథం తయారు చేశాడు.
"నా రథానికి సారథి ఎవరు?" అని అడిగాడు భవుడు.
"మీ ఇష్టం" అన్నారు దేవతలు.
"అలా కాదు. నాకంటే గొప్పవాణ్ణి సారథిగా మీరే నిర్ణయించండి" అని ముక్కంటి అనగానే దేవతలూ, మునులూ బ్రహ్మ దేవుడి వైపు తిరిగి సాష్టాంగ నమస్కారం చేశారు.
"శక్తి , చాతుర్యం కలిగిన సారథి రథికుణ్ణి తప్పకుండా గెలిపిస్తాడు. ఇంతగొప్ప రథానికి నీవంటి వాడు తప్ప మరొకడు సారథ్యం చెయ్యలేడు. ఇందుకు నువ్వు అంగీకరించాలి" అన్నాడు శివుడు బ్రహ్మదేవుడితో.

చేతిలో వున్న కమండలం పక్కన పెట్టి, జడ ముడి బిగించి, ఓంకారాన్ని ములుకోలగా చేసుకుని రథమెక్కాడు బ్రహ్మ. శివుడు రుద్రుడై నారి సారించి, పాశుపతాస్త్రంతో సహా నారాయణాస్రాన్ని సంధించి ఆ మూడు పట్టణాల్నీ మనస్సులో నిలిపాడు. మరుక్షణం ఆ మూడూ ఒక్కచోటుకు చేరాయి. ఈశ్వరుడు బాణం విడవడం, ఆ మూడు పట్టణాలూ బూడిదై పశ్చిమ సముద్రంలో కలవడం కన్ను మూసి తెరిచేలోగా జరిగిపోయాయి. అప్పుడు సకల లోకాలూ సంతోషంతో మహాదేవుణ్ణి స్తుతించాయి.

మహాభారత యుద్ధంలో తనంతటి వాడు కర్ణుడికి సారథిగా వుండటమేమిటని శల్యుడు భీష్మించిన సందర్భంలో యీ కథ చెబుతూ కౌరవాగ్రజుడు, "మహాత్మా! విన్నావా! లోకహితం కోరి పరమేష్టి అంతటివాడు శివుడికి సారథ్యం చేశాడు. అలాగే ఇప్పుడు నాకోసం నువ్వు కర్ణుడికి సారథ్యం వహించు. నా గౌరవం కాపాడు. నన్ను రక్షించు. సారథి రథికుడి కంటే గొప్పవాడు కావాలనే నీతి నీ దయవల్ల నాకు సిద్ధింపచెయ్యి" అని శల్యుణ్ణి ప్రార్థించి ఒప్పించాడు. 

 గీతా మాహాత్మ్యము -,

ధ్యానేనాత్మని పశ్యంతి
కేచిదాత్మాన మాత్మనా,
అన్యే సాంఖ్యేన యోగేన
కర్మయోగేన చాపరే.

ఆత్మను (ప్రత్యగాత్మను లేక పరమాత్మను) కొందఱు శుద్ధమగు మనస్సుచే ధ్యానయోగముద్వారా తమయందు గాంచుచున్నారు. సాక్షాత్కరించుకొనుచున్నారు.

Thursday, April 23, 2020

పంచ కేదారాలు - Panch Kedar

కురుక్షేత్ర యుద్ధం ముగుసిసిన తరవాత పాడవులు బ్రహ్మహత్యా పాతకం, దాయాదులను చంపిన పాపం పోగొట్టు కోవడానికి శివ దర్శననానికి వెళ్ళారు వారికి దర్శనం ఇవ్వడానికి ఇష్ట పడని ఈశ్వరుడు కాశీ విడిచి నంది రూపం ధరించి ఉత్తర దిశగా పయన మయ్యాడు. 


పాండవులు పట్టు వదలక వెంబడించగా గుప్త కాశీ ప్రాంతంలో నంది రూపంలో కనిపించిన ఈశ్వరుని పట్టుకోవడానికి భీమశేనుడు ప్రయత్నించగా ఈశ్వరుడు మాయమయ్యాడు. అప్పుడు ఈశ్వరుని శరీర భాగాలు ఐదు ఛోట్ల ప్రతిష్టితమై అవి పుణ్య క్షేత్రాలుగా భాసిల్లాయి. శివ పురాణం లో వర్ణించబడిన పంచ కేదారాలను పంచఆరామాలని పిలుస్తుంటారు.
అవి వరసగా

    1.కేదారినాధ్,
    2.తుంగ నాధ్,
    3.రుద్ర నాధ్,
    4.మధ్య మహేశ్వర్,
    5.కల్పేశ్వర్. 

నేపాల్ లోని ఘోరక్ నాధ్ తెగ వారు పంచకేదార యాత్రకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. భారతీయులూ ఈ యాత్రకు ప్రాధాన్యత ఇస్తారు. ఖాట్మండు లోని పశుపతి నాధ్ ఆలయ నిర్మాణానికి ఈ పొంచ కేదారాల నిర్మాణానికి పోలికలు ఉంటాయి.

కేదారినాధ్🙏🙏🙏

ద్వాదశ జ్యీతిర్లింగాలలో ప్రసిద్ధి చెందింది పంచ కేదారాలలో మొదటిది కేదారనాధ్. పాడవులకు అందకుండా పారి పోయిన శివుని మూపురభాగం ఉన్న చోటు. ఇందుకు నిదర్శనంగా ఇక్కడి లొంగం ఎనిమిది గజముల పొడవు, నాలుగు గజముల ఎత్తు, నాలుగు గజముల వెడల్పు ఉంటుంది. ఈక్కడి లింగం త్రిభుజాకారంలో ఉంటుంది. పాండవులు తమ అంతిమ దశలో స్వర్గారోహణ ఇక్కడ నుండి ప్రారంభించారు. శంకరాచార్యులు మోక్షం పొందిన క్షేత్రం ఇదే. సంవత్సరానికి ఆరు నెలలు మాత్రమే తెరచి ఉంచే ఈ ఆలయం ప్రతి సంవత్సరం అక్షయత్రుతియ నాడు తెరుస్తారు. కాత్రిక మాసంలో వచ్చే యమద్వివిదియ నాడు మూసి వేస్తారు. ఈ మధ్య కాలంలో స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని యూకీ మఠానికి తరలించి అక్కడ పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయం సముద్ర మట్టానికి 11,758 అడుగుల ఎత్తులో ఉంటుంది. హృషీ కేశ్ వరకు రైలు మార్గం ఉంటుంది. అక్కడి నుండి దాదాపు 250 కిలోమీటర్ల దూరం రోడ్డు మార్గంలో ప్రయాణించి గౌరీ కుండ్ చేరుకుని అక్కడి నుండి శిఖరానికి 14 మైళ్ళ దూరం కాలి నడకన చేరాలి. కానీ భక్తులు అనేక మంది డోలీలు, గుర్రాలపై ప్రయాణించి ఆలయం చేరుకుంటారు.

తుంగనాధ్🙏🙏🙏

పంచ కేదారాలలో రెండవది తుంగనాధ్. శివుని చేతులు లింగ రూపంలో వెలసిన క్షేత్రం ఇది. ఇది సముద్ర మట్టానికి 12,000 అడుగుల ఎత్తులో ఉంటుంది కేదారానికంటే ఎత్తైన ప్రదేశం. తుంగనాధుడంటే శిఖరాలకు అధిపతి అని అర్ధం. ఈ ఆలయంలోని లింగం ఒక అడుగు ఎత్తున చేతులను పోలి ఉంటుంది. స్వల్పంగా ఎడమ వైపు వాలి ఉంటుంది. గర్భగుడిలో శివునితో వ్యాస, గణపతి అష్టధాతు విగ్రహాలు ఉంటాయి. ప్రమధ గణాల విగ్రహాలు ఉంటాయి. పాండవుల చిత్రాలు గోడలో చెక్కి ఉంటాయి. ఆలయానికి కుడి వైపున పార్వతీ దేవి ఆలయం ఉంటుంది. వేరొక వైపున ఐదు ఆలయాలు ఉంటాయి . అవి పంచకేదారెఆల నమూనాలు. ఈ ఆలయాన్ని అర్జునుడు నిర్మించారని స్థల పురాణం చెప్తుంది. శిటా కాలంలో ఉత్సవ విగ్రహాలను ముకునాధ్ మఠానికి తరలించి పూజలు నిర్వహిస్తారు.

రుద్రనాధ్🙏🙏🙏

పంచ కేదారాలలో మూడవది రుద్రనాధ్. నంది రూపంలో ఉన్న శివుని ముఖ భాగం వెలసిన చోటు ఇదే. అరమోడ్పు కన్నులతో భువనమోహనంగా ముఖ లింగ రూపంలో ఉండే స్వామిని నీలకంఠ్ మహాదేవ్ అని భక్తులు పిలుస్తారు. తెల్ల వారు ఝామున అభిషేక వేళలో స్వామి వెండి తొడుగు తొలగిస్తారు. నిజరూప దర్శననానికి భక్తులు ప్రాధాన్యత ఇస్తారు. ఈ ఆలయం సముద్ర మట్టానికి 7,500 అడుగుల ఎత్తులో ఉంటుంది ఈ ఆలయానికి వెనుక భాగంలో వైతరణీ నది ప్రవహిస్తుంటుంది. ఇక్కడకు వచ్చే భక్తులు తమ పూర్వీకులకు మోక్షం ప్రసాదించమని వేడుకుంటారు. ఈ ఆలయానికి సమీప గ్రామం గోపేశ్వర్.గోపేశ్వర్ నుండి 24 మైళ్ళు క్లిష్టమైన కొండ దారిలో కాలి నడకన ప్రయాణించి ఆలయానికి చేరాలి కనుక పంచ కేదారాలలో ఇది చాలా కష్ట తరమైనది గా భావిస్తారు. శీతాకాలంలో ఇక్కడి విగ్రహాలను గోపేశ్వర్కు తరలించి అక్కడ పూజలు నిర్వహిస్తారు.

మధ్యమహేశ్వర్🙏🙏🙏

పంచ కేదారాలలో నాలుగవది మధ్య మహేశ్వర్. విశ్వనాధుని నాభి భాగం లింగంగా వెలసిన క్షేత్రం. నంది రూపంలూ ఉన్న ఈశ్వరుని భీమసేనుడు పట్టుకున్న గుప్త కాశీకి 24 మైళ్ళ దూరంలో ఉన్న ఈ క్షేత్రం ఎత్తు సముద్ర మట్టానికి 11,470 అడుగులు. ఈ ఆలయానికి ఎడమ వైపున రెండు చిన్న ఆలయాలు ఉన్నాయి ఒకటి పార్వతీ దేవిది, ఒకటి అర్ధ నారీశ్వరునిది. ఈ మూడు ఆలయాలను భీమసేనుడు నిర్మించాడని చెప్తారు. ఆలయానికి కుడి వైపున చలువరాతితో నిర్మించిన సరస్వతీ దేవి ఆలయం ఉంటుంది. శీతా కాలంలో ఇక్కడి విగ్రహాలను యూకీ మఠానికి తరలించి అక్కడ పూజలు నిర్వహిస్తారు.

కృష్ణం వందే జగద్గురుమ్

బృందావన గోపికలు ఒక సారి ఒక ఉపవాస వ్రతం చేసారు. ఆ ఉపవాసాన్ని ముగించటానికి వారికి ఒక మునికి భోజనం పెట్టే కార్యక్రమం చేయవలసి వచ్చింది. యమునా నదికి అవతలి పక్క నివసిస్తూ ఉండే దూర్వాస మహామునికి ఆరగింపు చేయమని శ్రీ కృష్ణుడు వారికి సలహా ఇచ్చాడు. గోపికలు రుచికరమైన భోజనం తయారు చేసి బయలు దేరారు, కానీ యమునా నది ఆ రోజు చాలా ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఏ నావికుడూ కూడా వారిని నది దాటించటానికి ఒప్పుకోలేదు.
గోపికలు శ్రీ కృష్ణుడి ని ఎదో ఒక పరిష్కారం కోసం వేడుకున్నారు. ఆయన అన్నాడు, "యమునా నదికి చెప్పండి, ఒకవేళ శ్రీ కృష్ణుడు అఖండ బ్రహ్మచారి అయితే మీకు దారి ఇవ్వాలి అని". గోపికలు నవ్వటం మొదలు పెట్టారు, ఎందుకంటే వారు శ్రీ కృష్ణుడు తమపై ప్రేమవ్యామోహ మోజుతో ఉండేవాడు అనుకున్నారు, కాబట్టి ఆయన అఖండ బ్రహ్మచారి అన్న పశ్నే తలెత్తదు అని. ఎదేమైనా, వారు యమునా నదిని ఆ విధంగా వేడుకున్నప్పుడు, ఆ నది వారికి దారి ఇచ్చింది, వారు వెళ్ళటానికి ఒక పూల వంతెన కూడా అగుపించింది.

గోపికలు ఆశ్చర్య చకితులయ్యారు. వారు దూర్వాస ముని ఆశ్రమానికి వెళ్లారు. వారు తయారు చేసిన రుచికరమైన భోజనమును స్వీకరించమని ఆయనను ప్రార్ధించారు. ఆయన సన్యాసే కాబట్టి ఏదో కొద్దిగా తిన్నాడు, దీనితో గోపికలు నిరాశ చెందారు. దీనితో, వారిని సంతృప్తి పరచదలిచిన దూర్వాసుడు తన యోగ శక్తితో వారు తెచ్చినదంతా భుజించాడు. అంత పదార్ధాన్ని ఆయన తినటం చూసి గోపికలు ఆశ్చర్య పోయారు, కానీ తాము వండిన శ్రమకు ఆయన న్యాయం చేసాడని సంతోషపడ్డారు.

గోపికలు ఇప్పుడు దూర్వాస మహామునిని, యమున దాటటానికి సహాయం చేయమన్నారు. ఆయన అన్నాడు, "యమునా నదికి చెప్పండి, ఒకవేళ దూర్వాసుడు గడ్డి తప్ప ఇంకా ఏమీ తినకుండా ఉంటే, ఆ నది దారి ఇవ్వాలని". గోపికలు మళ్లీ నవ్వటం మొదలెట్టారు, ఎందుకటే వారు ప్రత్యక్షంగా దూర్వాసుడు ఎన్నో పదార్ధాల తో ఉన్న భోజనం చేయటం చూసారు. అయినా, వారికి ఆశ్చర్యం గొలిపేలా, వారు యమునా నదిని ఆ విధంగా ప్రార్ధించి నప్పుడు, యమునా నది మరలా దారి ఇచ్చింది.

గోపికలు శ్రీ కృష్ణుడిని జరిగిన వృత్తాంతం వెనుక ఉన్న రహస్యం అడిగారు. అప్పుడు శ్రీ కృష్ణుడు ఇలా అన్నాడు - భగవంతుడు, మునులు బాహ్యంగా ప్రాపంచిక కార్యకలాపములలో నిమగ్నమై ఉన్నట్టు అనిపించినా, అంతర్గతంగా వారెప్పుడూ ఇంద్రియాతీత స్థితిలో ఉంటారు. ఈ విధంగా అన్ని రకాల పనులు చేస్తూనే ఉన్నా, వారు ఏమీ చేయనట్టే లెక్క. గోపికలతో బాహ్యంగా అన్యోన్యంగా ఉన్నా, శ్రీ కృష్ణుడు అంతర్గతంగా అఖండ బ్రహ్మచారి. అలాగే, గోపికలు సమర్పించిన మధురమైన భోజనం చేసినా, అంతర్గతంగా ఆ మహాముని మనసు గడ్డిని మాత్రమే రుచి చూసింది. ఈ రెండు కూడా, కర్మలో అకర్మ ని విశదీకరించే ఉదాహరణలు.

Thursday, April 16, 2020

నేనెవరు... who am I ?

ఈ క్రింది విషయాన్ని ఎవరికి వారు చదివి వారు వారు ఆలోచించుకోవడానికిగాను పెద్దలు చెప్పిన విషయాన్ని ఇక్కడ పొమ్దు పరచడం జరుగుతోంది ఇది ఒక అంతశ్చర్చలాగా సాగుతుంది.
నేను : నేనెవరు? నేను శరీరమా? శరీరము నాదా? ఒక వేళ శరీరము నేనైతే! ఈ శరీరము నాకు తెలియకుండా మారిపోతోంది ఎందుకు? ఒహొ ఐతే శరీరము నాది.
శరీరము : ఈ శరీరము నీదైతే నీకు తెలియకుండా మార్పులు ఎలా జరుగుతున్నాయి ? నీకు తెలియకుండా, నువ్వు చెప్పకుండా ఆకలి దప్పులు ఎలా కలుగుతున్నాయి ?
నేను: మా సైన్స్ చెప్పింది అది శరీరధర్మము అని, శరీరము నాదే
శరీరము: ఐతే ఇది ఎక్కడినుంచి వచ్చింది ?
నేను: మా తల్లి తండ్రుల వల్ల ఎప్పుడో పుట్టింది.
శరీరము: ఓహొ అవునా ? ఐతే, శరీరం మీ తల్లి తండ్రుల వల్ల వచ్చింది నీదెలా
అవుతుంది ?

నేను: అవును అవును, ఇది మాతల్లి తండ్రుల వల్ల వచ్చింది. అది వాళ్ళది.
నాదికాదు.

శరీరము: ఓహొ మరి అది శుక్లమిచ్చిన నీతండ్రిదా ? శోణితముతో కలిపి గర్భంలో
మోసిన తల్లిదా ?

నేను: …….
శరీరము: పాలిచ్చి పెంచిన తల్లిదా? పోషణ భారం వహించిన తండ్రిదా ?
నేను: ఆఁ….
శరీరము: సరే కొంత పెరిగాక, పశువులిచ్చే పాలు తాగి పెరిగావు. ఇది ఆ పశువులదా?
నేను: అయ్యబాబోయ్.. ఈ శరీరము నాదనుకుంటే దీనికి ఇంత మంది యజమానులు వస్తున్నారేంటి?
శరీరము: సరి, మరి భోజనాదులు, పళ్ళు ఫలాలు తిని కదా ఈ శరీరం మార్పు చెందింది అన్న వికారంగా? మరి ఇది ఆ మొక్కలు చెట్లది కాదా?
నేను: మళ్ళీ ఇదోటా ?
శరీరము: సరి, పెరిగి పెద్దవుతున్నప్పుడు విద్యాబుద్దులు నేర్పి, సంస్కారాలునేర్పి శరీరాన్ని నిలబెట్టిన గురువులది కాదా?
నేను: ఇంకా ఎంత మంది దీనికి యజమానులు ?
శరీరము: ఉద్యోగమిచ్చి, నీ జీవన గమనానికి గాను భత్యమిచ్చిన నీ యజమాని వల్లనే కదా దీనిని పోషించి రక్షించు కుంటున్నావు, మరి ఇది ఆయనది కాదా?
నేను: నేను ప్రతిఫలంగా పని చేస్తున్నానే !
శరీరము: అవునా మరి ఇటువంటి శరీరాలు కొన్ని కోట్లు భూమి మీద ఉన్నాయి, ఇది చేసే పనే వేరొకరు కూడా చేస్తున్నారు వారికి తక్కువ దీనికి ఎక్కువ భత్యం ఎందుకు?
నేను: సరే అదీ ఒప్పుకున్నాను, అయ్యిందా ఇంకెవరన్నా ఉన్నారా?
శరీరము: దీనికి ఇంకో శరీరంతో పెళ్ళి అయ్యింది? ఆ శరీరం దీని పోషణార్థమై కష్టపడిందా లేదా? దీన్ని సుఖపెట్టిందా లేదా? మరి దానిది కూడా కదా !
నేను: అవును
శరీరము: ఇది పడిపోయాక దీని అంత్యక్రియ జరిపేవాడొకడున్నాడు కదా! మరి ఇది వాడిది కాకపోతే దానినెందుకు అంత్యేష్టి పేర నాశనము చేస్తున్నాడు? ఐతే ఇది వానిది కూడా!
నేను: అర్థం అవుతోంది…
శరీరము: ఈ శరీరములోని పంచ భూతాలను తిరిగి పంచభూతాలలో కలుపుకునే పంచభూతాలదా కాదా
నేను: అవును ఇది అందరిదీ !
శరీరము: మరి అంత దానికి నాది నాది అని నన్ను (శరీరాన్ని) పట్టుకుని విర్రవీగుతావేం? ఇది ఆ పంచ భూతాలది కూడా కాదు వానిని కూడా సృష్టించి నిర్వహించే వాడున్నాడే వానిది. ఈ శరీరానికి ఇంత మంది యజమానులు లౌకికంగా ఉంటే అందరినీ సమానంగా మాతా పితృభావంతో చూడక ఎందుకు స్వార్థచింతనతో ఉంటావ్? ఇది నీది కానప్పుడు దాన్ని జాగ్రత్తగా చూసి దానితో ఉత్తమమైన పనులు చేయించక, నీస్వార్థం కోసం వాడుకుంటావే? అలా చేస్తే నువ్వూ ఒక దొంగవేగా?
నేను: బోధ పడింది, ఓ శరీరమా, నేను ఎప్పుడూ నేను నేను అని చూపే నువ్వు నేను కాదు. నువ్వు నా మొదటి గురువువి, నా సంరక్షకుడివి. ఎల్లప్పుడూ నాతో ఉండి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని చెప్పే గురు స్వరూపానివి. ఓ శరీరమా నా జీవన గమ్యంలో కలిగే మార్పులను పరమాత్మ తోడి నాసంబంధాన్ని ప్రకృతితోడి సంబంధాన్ని తెలిపే దానవు. నీవు నేను కాదు నేను నీవు కాదు, నువ్వు నాదానవు కాదు. నేను నీవాడను కాను. పరమాత్మ నాకిచ్చిన తొడుగువు నువ్వు, కానీ లేని పోని సిద్ధాంతాలతో నేనే నీవని భావించి అసలు నెనెవరినో నేనెవరివాణ్ణో మరిచిపోయాను. అశాశ్వతమైన నువ్వు (శరీరము) నేను కాదు, అఖండము, అనంతము, ఐన పరమాత్మకు చెందినవాడను. 

Monday, April 13, 2020

దక్షిణామూర్తి స్తోత్రం

విశ్వందర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం
పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యధానిద్రయా
యస్సాక్షాత్కురుతే ప్రభోధసమయే స్వాత్మానమే వాద్వయం
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

బీజస్యాంతతి వాంకురో జగదితం ప్రాఙ్నర్వికల్పం పునః
మాయాకల్పిత దేశకాలకలనా వైచిత్రచిత్రీకృతం
మాయావీవ విజృంభ త్యపి మయా యోగేవయః స్వేచ్ఛయా
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పా ర్థకం భాసతే
సాక్షాత్తత్వమసీతి వేదవచసాయో బోధయత్యాశ్రితాన్
యస్సాక్షాత్కరణాద్భవేన్నపురనావృత్తిర్భవాంభోనిధౌ
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

నానాచ్ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం
జ్ఞానం యస్యతు చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే
జానామీతి తమేవ భాంతమునుభాత్యేతత్సమస్తంజగత్
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధించశూన్యం విదుః
స్త్రీ బాలాంధ జడోపమాస్త్వహ మితి భ్రాంతాభృశం వాదినః
మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారిణే
తస్మైశ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్
సన్మాత్రః కరణోప సంహరణతో యో భూత్సుషుప్తః పుమాన్
ప్రాగస్వాప్సమితి ప్రభోద సమయే యః ప్రత్యభిజ్ఞాయతే
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథాసర్వాస్వవస్థాస్వపి
వ్యావృత్తా స్వను వర్తమాన మహమి త్యంతస్స్ఫురంతం సదా
స్వాత్మానం ప్రకటికరోతిభజతాం యోముద్రయా భద్రయా
తస్మైశ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామిసంబంధతః
శిష్యచార్యతయా తథైవ పితృ పుత్రాద్యాత్మనా భేదతాః
స్వప్నే జాగ్రృతి వాయు ఏష పురుషో మయా పరిభ్రామితః
తస్మైశ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

భూరంభాం స్యనలోనిలోబర మహర్నాధోపిమాంశుః పుమాన్ మిత్యాభతి చరాచరాత్మక మిదం యస్మైచ మూర్త్యష్టకం
నాన్యత్కించ నవిద్యతే విమృశతాంయస్మాతత్పర స్మాద్విభో తస్మై శ్రీగురుమూర్తయే నమఇదం శ్రీ దక్షిణామూర్తయే

సర్వాత్వమితి స్ఫుటీకృత మిదం యస్మాదముష్మిన్ స్తవే
తేనాస్యశ్రవణాత్త దర్థ మననా ద్ధ్యానా చ్ఛ సంకీర్తనాత్
సర్వాత్మత్వ మహావిభూతి సహితం స్వాదీశ్వత్వం స్వతః
సిద్ధ్యేత్తత్పునరష్టధా పరిణతం చైశ్వర్య మవ్యాహతమ్....

భార్యదే అసలైన చదువు

అవును..
భార్యదే నిజమైన చదువు.

చిన్నప్పుడు తల్లిదండ్రులను.

చదువుకున్నప్పుడు స్నేహితులను.

కలిసిమెలిసితిరిగేటప్పుడు *ఇరుగుపొరుగు వారిని చదువుకుంది.

పెళ్ళి అయ్యాక *భర్తను చదువుతుంది*. 
*పిల్లలను చదువుతుంది*.

*తన కుటుంబ సభ్యులను చదువుతుంది*.
*పరిసరాలను చదువుతుంది*..
అందుకే...

*భర్తకు.. తన గురించి తనకు*
*తెలియని విషయాలెన్నో*
*భార్యకు తెలుసు!*

*తల్లికి ఏం యిష్టమో తన కంటే తన భార్యకే బాగా తెలుసు*.
*పిల్లలు ఏం తింటారో తండ్రిగా తన కంటే తల్లిగా తనకే తెలుసు*.

అందుకు ...
*ఆశ్చర్యం, ఆనందం.. రెండూనూ!*
.....................
*సంసారం ఒక గడియారమనుకుంటే...*
*చిన్న ముల్లు భర్త,*
*పెద్ద ముల్లు భార్య*

*గంటల ముల్లులా మందగమనం భర్త వ్యవహారం!*
*నిమషాల ముల్లులా చకచకా సాగుతుంది భార్య శతావదానం!*

*వంటింట్లో సహకరిద్దామంటే అగ్గి సిగ్గుపడుతుందట..*
*కనీసం ఇల్లైనా ఊడుద్దామంటే*
*చీపురు చిరాకు పడుతుందట..!*

*పోనీ ..భోజనానంతరమైనా కంచాలు కడగడంలో చేయికలుపుదామంటే పుణ్యం నాకు దక్కకుండా చేయడానికా అని కంట నీరు తిప్పుతుంది*
ఇవన్నీ తన అధ్యయనం వల్లే నేర్చుకుంది.

*ఇన్ని చదువుతున్న తనకు ఇంగ్లీషు చదవడం నేర్పుదామంటే నువ్వుండగ నాకేం లోటని*.. *అమాయకంగా నవ్వుతుంది పిచ్చిదాయి*. 

*ఇంకా..లెక్కల్లో కూడా నేనే ఫష్ట్ అంటుంది*.. *పేపరుమీద రూపాయల లెక్కలు మీరు చెబితే ..ఆ రూపాయలతో ఇల్లు చక్కబెట్టే లెక్కలు నావని అంటుంది*.

ఎందుకంటే..

*పుస్తకాల్ని మాత్రమే చదివేది భర్త*.
*భర్తను సైతం చదివేది భార్య.*
*ఇంటిల్లపాదిని*
*తన హస్తరేఖలుగా* *మలచుకొన్న*
*తన నేర్పంతా ..*
*తన సంస్కారం ముందు తల వంచుతునేఉంటుంది* 
*అందుకే ఆమె చదువే గొప్పది*.
*ఆమె సంస్కారమే ఎనలేనిది.*

*ఓడి గెలుస్తుంటుంది భార్య!*
*గెలిచి ఓడేది భర్త.. !!*

*అందుకే తనే ఓ సిద్ధాంతమైంది*.

 *పెసలు నలిగి పిండి కాలాలంటే తిరగలి పాప ఒకటి తిరగుతుండాలి.. ఇంకొకటి కదలకుండా ఉండాలి ..అని తిరగలి సిద్ధాంతం బోధిస్తుంది. 

పనిమనిషినైనా పెట్టకుందామంటే పనిచేయని ఒళ్ళు రోగాల పుట్టని ఆరోగ్య చిట్కాలు చెబుతుంది!

ఎలా చూసినా అసలైన చదువు తనదేనని అనుక్షణం రుజువు చేస్తూనే ఉంటుంది!

అందుకే..
శ్రీమతి ఒక అమూల్యమైన బహుమతి. ఆమే చదువుల సరస్వతి. 

పిల్లలపెంపకం విషయంలో రామాయణం ఏం చెపుతున్నది?


    శ్రీరాముడు సీతాదేవి నగలను లక్ష్మణుడికి చూపించి ఇవి మీ వొదిన కేయూరాలే గద !   ఒక్కసారి నువ్వు కూడా గురుతు పట్టు అంటే అప్పుడు లక్ష్మణస్వామి అంటారు కదా .......

 *నాహం జానామి కేయూరే   నాహం జానామి కుండలే*             
*నూపురే త్యభి జానామి నిత్యం పాదాభివందనాత్* 

           దీనర్థం ఏమిటంటే ఓ అన్నా! వొదినగారు భుజానికి పెట్టుకునే  కేయూరాలు గానీ గానీ, చెవులకు పెట్టుకునే కుండలాలు గాని నే నెరుగను, కానీ  ఆవిడ పాదాలకు పెట్టుకునే నూపురాలను మాత్రం గుర్తు పట్టగలను. ఎందుకంటే ఆ తల్లి పాదాలకు నిత్యం నమస్కారం చేస్తాను కాబట్టి .
పరస్త్రీని కన్నులెత్తి చూడని సంస్కారం! 
అసలు ఆడువారి ముఖంలో ముఖంపెట్టి కళ్ళలోకి సూటిగా చూస్తూ ఎందుకు మాట్లాడాలి ?
ఈ విధమైన శీల సంపద లక్ష్మణుడికి ఎక్కడ నుండి వచ్చింది ? తల్లి సుమిత్రాదేవి పెంపకం!! 

   రాముడితో అడవికి వెళ్ళేటప్పుడు ఆ మహాతల్లి కొడుకుకు ఏమని చెపుతుందో తెలుసా?

 *రామం దశరథం విధ్ధి,  మాం విధ్ధి జనకాత్మజాం,*
*అయోధ్యాం అటవీం విధ్ధి  గచ్ఛ తాత! యథా సుఖం*

 *రాముణ్ణి దశరథుడనుకో, సీతను నన్ననుకో*
*అడవిని అయోధ్య అనుకో   హాయిగా వెళ్ళిరా నాన్నా!*
   ఇంత సంస్కారమున్న తల్లి పెంచింది కాబట్టే,   లక్ష్మణుడు అంత శీలవంతుడయ్యాడు; చీర తొలగి మత్తులో ఉన్న తారతో మాట్లాడవలసి వచ్చి నప్పుడు తల వంచుకుని మాట్లాడిన అద్భుత శీల సౌందర్యం లక్ష్మణస్వామిది !

నేడు ప్రతి తల్లీ తెలుసుకో వలసిన సత్యం ఇది కాదా?
పిల్లలను ఈ విధంగా పెంచితే దేశంలో ఏ ఆడబిడ్డయినా ఎందుకు బాధపడుతుంది? 
నిర్భయ లాంటి ఘటనలు ఎందుకు చోటు చేసు కుంటాయి? ప్రియాంక రెడ్డి లాంటి భవిష్యత్తు ఉన్న బంగారుతల్లుల జీవితాలు ఎందుకు చిదిమి వేయబడతాయి ?

  రామాయణం, రామకథలు విరివిగా ప్రచారం చేయండి ! పరస్త్రీని ఇష్టం లేకుండా చెరబడితే దండన ఏదో, స్త్రీలతో ఎలా మెలగాలో అన్నీ తెలుస్తాయి.

రామరాజ్యంలో ఓ కుక్క కథ

రామరావణ యుద్ధం ముగిసింది. రాముడు పట్టాభిషిక్తుడు అయ్యాడు. ఆయన పాలనలో ధర్మం నాలుగు పాదాలా నడుస్తోందన్న కీర్తి ముల్లోకాలకీ వ్యాపించింది. అలాంటి సందర్భంలో ఓ రోజున...
రాముడు తన దర్బారులో కొలువై ఉన్నాడు. అతని చుట్టూ మంత్రులు పరివేష్టించి ఉన్నారు. కశ్యపుడు, వశిష్టుని వంటి రుషివర్యులు ఉచితాసనాలని అలంకరించారు. అలాంటి నిండుసభలో రాముల వారు లక్ష్మణుని వంక చూస్తూ ఎవరన్నా పౌరులు కార్యార్థులై, తన సభకు చేరుకున్నారా అని అడిగాడు. సుభిక్షమైన రాముని పాలనలో... ప్రత్యేకించి విన్నవించుకునేందుకు ఎవరికీ ఏ సమస్యా, అవసరమూ లేవని బదులిచ్చాడు లక్ష్మణుడు. పోనీ రాజద్వారం దగ్గర ఎవరన్నా సమస్యలతో నిలబడి ఉన్నారేమో చూసి రమ్మని పంపాడు రాముడు.  

రాముని ఆజ్ఞ మేరకు రాజద్వారాన్ని చేరుకున్న లక్ష్మణుడికి అక్కడ ఓ గాయపడిన కుక్క కనిపించింది. ‘ఓ శునకమా! నీకేం ఆపద వచ్చింది? ఎలాంటి సంకోచమూ లేకుండా నీకు వచ్చిన సమస్యని చెప్పుకో!’ అంటూ అభయమిచ్చాడు లక్ష్మణుడు. దానికి ఆ కుక్క తన సమస్యని రామునికే విన్నవించుకుంటానని పట్టుపట్టింది. దాంతో దానిని రాముని సమక్షానికి తోడుకుపోక తప్పలేదు లక్ష్మణునికి
 

తనకి వచ్చిన ఆపదని చెప్పుకోమంటూ రాముడు అభయాన్ని ఒసిగిన వెంటనే ఆ కుక్క – ‘ప్రభూ! రాజన్నవాడు తన పౌరులకి దేవునితో సమానం. వారికి సృష్టి, స్థితి, లయకారుడు ఆ రాజే! అందుకనే తన రాజ్యంలోని ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత రాజు మీదే ఉంటుంది. దానం, కరుణ, సత్పురుషులని ఆదరించడం, మంచి నడవడి వంటి లక్షణాలన్నీ కూడా ఆ ధర్మానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి. కానీ నీ రాజ్యంలో ఒకరు ధర్మాన్ని తప్పి నా మీద దాడి చేశారు. సర్వదసిద్ధుడనే పరివ్రాజకుడు నన్ను గాయపరిచాడు,’ అంటూ వాపోయింది.

ఆ శునకం మాటలు విన్న రాములవారు వెంటనే సర్వదసిద్ధుని పిలిపించారు. ‘ఆ కుక్కను గాయపరిచిన మాట నిజమే ప్రభూ! నేను యాచనకు బయల్దేరిన సమయంలో ఈ కుక్క నా దారికి అడ్డంగా నిలిచింది. అసలే ఆకలితో ఉన్న నేను ఆగ్రహాన్ని పట్టలేకపోయాను. ఆ ఆగ్రహంతోనే ఈ కుక్కను గాయపరిచాను. నేను చేసిన పని తప్పేనని ఒప్పుకుంటున్నాను. అందుకుగాను మీరు ఎలాంటి శిక్షను విధించినా సంతోషంగా స్వీకరిస్తాను,’ అంటూ వేడుకున్నాడు సర్వదసిద్ధుడు.

సర్వదసిద్ధునికి ఎలాంటి శిక్ష విధించాలా అని దర్బారులో జనమంతా తర్జనభర్జన పడుతుండగా ఆ శునకం- ‘ప్రభూ! తమరేమీ అనుకోనంటే నాది ఒక విన్నపం. మీకు నిజంగా నా పట్ల జాలి కలిగితే, నన్ను కరుణించాలన్న తలంపు మీలో ఉంటే నేను చెప్పిన శిక్షను అతనికి విధించండి,’ అని కోరింది.

ఆ మాటలకు రాములవారు అంగీకరించగానే- ‘ఈ బ్రాహ్మణుడిని కులపతిగా నియమించండి. అతడిని కలంజర అనే మఠానికి అధిపతిని చేయండి,’ అని కోరింది.

ఆ మాటలు విన్నంతనే సభలోని వారంతా ఆశ్చర్యపోయారు. బ్రాహ్మణుడు మాత్రం తనకు శిక్షకు బదులుగా పదవి లభించినందుకు సంబరపడుతూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ‘అదేమిటీ, నీకు జరిగిన అన్యాయానికి బదులుగా సర్వదసిద్ధుని కఠినంగా శిక్షించమని కోరతావనుకుంటే... అతనికి కులపతి హోదానీ, మఠాధిపతి పదవినీ కట్టబెట్టించావెందుకనీ,’ అంటూ అడిగారు సభలోని పెద్దలు.
 

దానికి ఆ శునకం ఇలా బదులిచ్చింది- ‘అయ్యా గత జన్మలో నేను ఆ మఠాధిపతిని. రుషులను ఆదరిస్తూ, దేవతలని పూజిస్తూ, సేవకుల బాగోగులను గమనిస్తూ, అందరికీ పంచగా మిగిలిన ఆహారాన్ని భుజిస్తూ చాలా నిష్టగా జీవించాను. అయినా కూడా కుక్కగా జన్మించాల్సి వచ్చింది. అంత సత్ప్రవర్తనతో మెలిగిన నేను ఈ స్థితికి చేరుకుంటే... చిన్నపాటి కోపాన్ని కూడా అదుపు చేసుకోలేని ఆ సర్వదసిద్ధుడి గతేమవుతుందో ఆలోచించండి,’ అంటూ నవ్వింది.

అధికారం చేతిలోకి వస్తే మనిషి విచక్షణలో మార్పు వస్తుంది. ఆ మత్తులో అతను తెలిసో తెలియకో చిన్నచిన్న పొరపాట్లు చేయడం ఖాయం. మఠాధిపతి హోదాలో అతిపవిత్రంగా ఉండాల్సిన మనిషి ఇంకెంత నిష్టగా ఉండాలో కదా! ఈ విషయాన్ని సున్నితంగా తెలియచేస్తోంది పై కథ. ఇందులో ఒక పక్క కుక్క చూపించిన సమయస్ఫూర్తి అబ్బురపరచినా... గురువుగా ఉన్నత స్థానాన్ని అలంకరించేవారు ఎంత పవిత్రంగా ఉండాలో హెచ్చరిస్తోంది. 

ఊర్మిళా దేవి నిద్ర

ఊర్మిళాదేవి కోరుకున్న వింత వరం..

రావణసంహారం జరిగిపోయింది. 
రాములవారు దిగ్విజయంగా అయోధ్యకు చేరుకున్నారు. మంచి ముహూర్తంలో అంగరంగవైభోగంగా ఆయనకు పట్టాభిషేకం జరిగింది. 
ఒకరోజున రాములవారు సభలో కూర్చుని ఉండగా యుద్ధానికి సంబంధించిన విషయాలు చర్చకు వచ్చాయి.

14 ఏళ్లపాటు నిద్రాహారాలు లేనిమనిషే ఇంద్రజిత్తుని చంపగలడు. 
లక్ష్మణుడు అలా 14 ఏళ్లపాటు నిద్రాహారాలు లేకుండా గడిపాడు కాబట్టే... ఆయన ఇంద్రజిత్తుని సంహరించగలిగాడు,' అని ఎవరో గుర్తుచేశారు.

ఆ మాటలు విన్న రాములవారికి ఒక అనుమానం వచ్చింది. ''14 ఏళ్లపాటు మమ్మల్ని కంటికి రెప్పలా కాచుకుని ఉండేందుకు నువ్వు నిద్రపోలేదని నాకు తెలుసు.

నీ భార్య ఊర్మిళ ఇక్కడి అంతఃపురంలో ఆ నిద్రని అనుభవించిందని తెలుసు. 
కానీ రోజూ నీకు అందించిన ఆహారాన్ని ఏం చేశావు,' అని అడిగారు.

''మనం వనవాసం చేస్తున్నన్నాళ్లూ, నాకు అందించిన ఆహారాన్ని పంచవటిలోని ఒక చెట్టు తొర్రలో ఉంచేవాడిని,'' అని జవాబిచ్చాడు లక్ష్మణుడు. 
లక్ష్మణుడు చెప్పిన మాటలు సబబుగానే తోచాయి. 
కానీ సరదాగా ఆ ఆహారపు పొట్లాలన్నీ ఓసారి లెక్కపెడదామని అనుకున్నారట. 
దాంతో వాటిని రప్పించి సైనికులతో లెక్కించారు. 
కానీ లెక్కలో ఒక ఏడు రోజుల ఆహారం తగ్గినట్లు తేలింది. 

''లక్ష్మణా! ఓ ఏడు రోజులపాటు ఆహారంగానీ ఆరగించావా ఏం!'' అని పరిహాసంగా అడిగారట రాములవారు.
''అన్నయ్యా! మొదటి సందర్భంలో, తండ్రిగారి మరణవార్త తెలిసిన రోజున మనం ఆహారం తీసుకోనేలేదు. రావణాసురుడు సీతమ్మను అపహరించిన రోజున ఆహారాన్ని తీసుకోవాలన్న ధ్యాసే మనకు లేదు. మైరావణుడు మనల్ని పాతాళానికి ఎత్తుకుపోయిన సందర్భంలో మూడోసారి ఆహారాన్ని సేకరించలేదు. 
నేను ఇంద్రుజిత్తు సంధించిన బాణానికి మూర్ఛిల్లిన రోజున ఎవరూ నాకు ఆహారాన్ని అందించే ప్రయత్నం చేయలేదు. మర్నాడు ఇంద్రుజిత్తుతో భీకరమైన పోరు జరిగే సమయంలోనూ ఆహారాన్ని నాకు అందించే సమయమే చిక్కలేదు. 
ఇక రావణాసురుని సంహారం జరిగిన రోజున బ్రహ్మహత్యాపాతకం జరిగిందన్న బాధతో ఆహారాన్ని అందించలేదు. 
మర్నాడు రావణుని కోసం విలపిస్తున్న లంకావాసులకు తోడుగా మన సేన కూడా ఉపవాసం చేసింది. 
ఇలా ఏడు సందర్భాలలో అసలు ఆహారం నా చేతికి అందే పరిస్థితే రాలేదు,'' అని బదులిచ్చాడు లక్ష్మణుడు.

లక్ష్మణుడి నిబద్ధతకు రాములవారి మనసు కరిగిపోయిందని వేరే చెప్పాలా. 
అదే సమయంలో ఊర్మిళ పట్ల కూడా ఆయన ప్రసన్నులయ్యారు. 

''తల్లీ! వనవాసంలో నువ్వు ప్రత్యక్షంగా మాతోపాటు లేకపోయినా, ఇక్కడ నువ్వు చేసిన త్యాగంతోనే మేము అక్కడ అన్ని సమస్యలని తట్టుకుని నిలబడగలిగాము. అందుకే సీతాలక్ష్మణులతో పాటుగా నువ్వు కూడా మా పక్కనే ఆశీసురాలివై ఉండు!'' అన్నారట రాములవారు.
రాములవారి అనుగ్రహానికి ఊర్మిళ కళ్లు చెమ్మగిల్లాయి. 

కానీ ''ప్రభూ! నాకు నీ పాదపద్మాల దగ్గర చోటుకంటే వేరే వరమేదీ వద్దు. 
ప్రతిరోజూ నీ పాదాల చెంతకి చేరుకుని, నా అనుగ్రహాన్ని పొందే నైవేద్య రూపంలో నేను ఉండేలా అనుగ్రహించు,'' అని వేడుకుందట ఊర్మిళ.

''కలియుగంలో పూరీక్షేత్రంలో నేను కృష్ణుని అవతారంలో వెలుస్తాను. 
నా సోదరుడు లక్ష్మణుడు బలరాముని రూపంలో నాతో తోడుగా ఉంటాడు.
నువ్వు విమలాదేవి అవతారంలో ఆ ఆలయంలోని క్షేత్రపాలకురాలిగా వెలుస్తావు. 
అక్కడ నిత్యం రూపొందించే మహాప్రసాదంలో కొలువై ఉంటావు,'' అంటూ వరాన్ని అందించారట. 
ఆ వరం కారణంగా ఇప్పటికీ పూరిలోని జగన్నాథుని ఆలయం పక్కన విమలాదేవి ఉపాలయం కనిపిస్తుంది. అక్కడ నిత్యం తయారుచేసే మహాప్రసాదాన్ని ఆ అమ్మవారికి నివేదించిన తర్వాత కానీ భక్తులకు అందించరని చెబుతారు. 

పూరీలో నిత్యం 56 రకాల ప్రసాదాలతో వైభవోపేతమైన నైవేద్యం రూపొందే విషయం తెలిసిందే! 

ఆ మహాప్రసాదం వెనుక ఉన్న కథలలో ఈ *ఊర్మిళాదేవి కథ* కూడా విస్తృత ప్రచారంలో కనిపిస్తుంది..స్వస్తి..
శ్రీరామ జయరామ జయ జయరామ..

వైద్యనాథాష్టకము - To heal all your health issues


పరమశివుడు వైద్యులకు అధిపతిగా కూడా పేరొందాడు. శ్రీ రుద్రాభిషేచనంలో చాలా భాగం దీన్ని వక్కాణిస్తుంది.  నమకం, చమకంలో పూర్తి ప్రార్థన, ఫలితం కూడా రోగ నివారణ, ఆరోగ్యము, దీర్ఘాయుష్షు గురించి చెపుతాయి. అందుకనే శివుని వైద్యనాథుడిగా కొలుస్తారు. దీనికి జ్యోతిర్లింగ స్వరూపమే మహారాష్ట్ర అంబజోగై సమీపం లోని వైద్యనాథ దేవాలయం. అలాగే, తమిళనాట చిదంబరం దగ్గర వైదీశ్వరన్ కోవిల్ ఈ స్వామి మహాత్మ్యాన్ని తెలిపేదే.

జటాయు అంత్యక్రియలు, కుష్ఠు వ్యాధితో బాధపడుతున్న అంగారకునికి (కుజ గ్రహం) రోగ నివారణ ఇక్కడే జరిగాయని గాథ. సుబ్రహ్మణ్యునికి శూలము కూడా ఇక్కడ శివుని ప్రార్థించిన తర్వాతే లభించిందని ఇక్కడి ప్రజల విశ్వాసం. ఇక్కడి సిద్ధామృత తీర్థం (పుష్కరిణిలో నీరు), అంగసనాతన తీర్థంలో స్నానం చేసి,  వేప చెట్టు క్రింద మట్టి తీసుకుని పవిత్ర భస్మముతో కలిపి దేవునికి సమర్పించి ఆ సిద్ధామృత తీర్థంతో తీసుకుంటే సర్వ రోగ నివారణ అవుతుందని గట్టి విశ్వాసంv. అలాగే ఆ వైద్యనాథుని ఈ క్రింది స్తోత్రము రోజుకు మూడు సార్లు చదివితే ఆరోగ్యం కలుగుతుందట. అంతటి మహిమాన్వితమైన వైద్యనాథ అష్టకం, తాత్పర్యము మీకోసం. 

శ్రీ రామ సౌమిత్రి జటాయు వేద
షడాననాదిత్య కుజార్చితయ
శ్రీ నీలకంఠాయ దయామయాయ
శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ

తాత్పర్యము: శ్రీ రాముడు, లక్ష్మణుడు, జటాయువు, వేదములు, సుబ్రహ్మణ్య స్వామి, సూర్యుడు, అంగారకుడిచే పూజించబడిన, నీలకంఠము కలవాడు, దయామయుడు, వైద్యనాథుడైన శివునికి నా నమస్కారములుl.

గంగా ప్రవాహేందు జటాధరయ
త్రిలోచనాయ స్మర కాల హంత్రే
సమస్త దేవైరపి పూజితాయ
శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ

తాత్పర్యము: ప్రవహించే గంగను, చంద్రుని జటా ఝూటములో ధరించిన, మూడు కన్నులు కలవాడు, మన్మథుని, యముని సంహరించిన వాడు, దేవతలందరి చేత పూజించ బడినవాడు, వైద్యనాథుడైన శివునికి నా నమస్కారములు.

భక్త ప్రియాయ త్రిపురాంతకాయ
పినాకినీ దుష్ట హరాయ నిత్యమ్
ప్రత్యక్ష లీలాయ మనుష్య లోకే
శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ

తాత్పర్యము: భక్త ప్రియుడు, త్రిపురములను నాశనము చేసిన వాడు, పినాకమును (త్రిశూలమును) చేతిలో ధరించిన వాడు, నిత్యము దుష్టులను సంహరించే వాడు, వైద్యనాథుడైన శివునికి నా నమస్కారములు.

ప్రభూత వాతాది సమస్త రోగ
ప్రణాశ కర్త్రే ముని వందితాయ
ప్రభాకరేంద్ర్వగ్ని విలోచనాయ
శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ

తాత్పర్యము: వాతము, కీళ్ళనొప్పులు మొదలగు రోగములను నాశనము చేసే వాడు, మునులచే పూజించబడిన వాడు, సూర్యుడు, చంద్రుడు, అగ్ని నేత్రములుగా కలవాడు, వైద్యనాథుడైన శివునికి నా నమస్కారములు.

వాక్శ్రోత్ర నేత్రాంఘ్రి విహీన జంతోః
వాక్శ్రోత్ర నేత్రాంఘ్రి సుఖ ప్రదాయ
కుష్ఠాది సర్వోన్నత రోగ హంత్రే
శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ

తాత్పర్యము: వాక్కు, వినికిడి శక్తి, కాంతి చూపు, నడిచే శక్తి కోల్పోయిన జీవ రాశులకు ఆ శక్తులను తిరిగి కలిపించే వాడు,  కుష్ఠు మొదలగు భయంకరమైన రోగములను నిర్మూలము చేసి ఆరోగ్యాన్ని ప్రసాదించే వాడు, వైద్యనాథుడైన శివునికి నా నమస్కారములు.

వేదాంత వేద్యాయ జగన్మయాయ
యోగీశ్వర ధ్యేయ పదాంబుజాయ
త్రిమూర్తి రూపాయ సహస్ర నామ్నే
శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ

తాత్పర్యము: వేదముల ద్వారా తెలుసుకొనే దైవము, విశ్వమంతా వ్యాపించి యున్నవాడు, యోగులచే ధ్యానింపబడిన పాద పద్మములు కలిగిన వాడు, త్రిమూర్తుల రూపమైన వాడు, సహస్ర నామములు కలవాడు, వైద్యనాథుడైన శివునికి నా నమస్కారములు.

స్వతీర్థ మృడ్భస్మ భృతాంగ భాజాం
పిశాచ దుఃఖార్తి భయాపహాయ
ఆత్మ స్వరూపయ శరీర భాజాం
శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ

తాత్పర్యము: ఆయన దేవాలయమున ఉన్న పుణ్య పుష్కరిణీ స్నానము వలన, వేపచెట్టు క్రింద మట్టి మరియు భస్మము వలన - భూత ప్రేతముల బాధ, దుఃఖములు, కష్టములు, భయములు, రోగములు తొలగించే, ఆత్మ స్వరూపుడై దేహము నందు నివసిస్తున్న,  వైద్యనాథుడైన శివునికి నా నమస్కారములు.

శ్రీ నీలకంఠాయ వృష ధ్వజాయ
స్రక్గంధ  భస్మాద్యభి శోభితాయ
సుపుత్రదారాది సుభాగ్యదాయ
శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ

తాత్పర్యము: నీలకంఠుడు, వృషభమును (ఎద్దును) పతాకమందు చిహ్నముగా కలవాడు,  పుష్పములు, గంధము, భస్మముచే అలంకరించబడి శోభిల్లే వాడు, సుపుత్రులు, మంచి ధర్మపత్ని, సత్సంపదలు, అదృష్టములు ఇచ్చే వాడు,  వైద్యనాథుడైన శివునికి నా నమస్కారములుl.

 ఫల శ్రుతిః 

బాలాంబికేశ వైద్యేశ భవ రోగ హరేతి చ
జపేన్నామ త్రయం నిత్యం మహారోగ నివారణం

ఫల శృతి: బాలాంబిక పతి, జరామరణముల భయమును పోగొట్టేవాడు అయిన వైద్యనాథుని ఈ వైద్యనాథాష్టకం ప్రతి దినము మూడు సార్లు పఠించే వారికి సకల రోగ నివారణ కలుగును.

తెలివైన చిట్టి చిలుక

ఒక వ్యక్తి పట్టణంలో జరుగుతున్న సత్సంగానికి  ప్రతిరోజు వెళ్ళుతుండేవాడు.

ఆ వ్యక్తి ఒక చిలుకను పంజరములో ఉంచి పోషించేవాడు.

ఒక రోజు చిలుక తన యజమానిని అడిగింది, 'మీరు ఎక్కడకు రోజు వెళ్తున్నారు' అని?

అతను ఇలా అన్నాడు, "మంచి విషయాలు తెలుసుకోవడానికి నేను రోజూ సత్సంగానికి వెళతాను."
"మీరు నాకు ఒక సహాయం చేయగలరా?" అని అడిగింది ఆ చిట్టిచిలుక ఆ యజమానిని. "నేను ఎప్పుడు స్వేచ్ఛ పొందగలను అని మీ గురువు గారిని అడిగి చెప్పండి" అని.

మరుసటి రోజు, యజమాని సత్సంగానికి వెళ్ళాడు.

సత్సంగం ముగిసిన తర్వాత, అతను గురువు దగ్గరకు వెళ్లి, "మహారాజ్, నా ఇంటిలో ఒక చిలుక ఉంది, అది స్వేచ్ఛ ఎప్పుడు పొందగలదో మిమ్మలను అడిగి తెలుసుకోమని ప్రాధేయపడింది" అని.

అది విన్న వెంటనే, గురువుగారు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు.

ఇది చుాసిన చిలుక యజమాని భయపడి,నిశ్శబ్దంగా అక్కడ నుండి వెళ్ళిపోయాడు.

అతను ఇంటికి చేరుకొన్నాడు. అతని చిలుక అతనిని అడిగింది, 'మీరు నా ప్రశ్నను గురువుగారిని అడిగారా?' అని.

యజమాని బదులిచ్చాడు- 'నేను అడిగాను కానీ నీ అదృష్టం బాగాలేదు. నేను నీ ప్రశ్న అడిగిన వెంటనే, గురువుగారు అపస్మారక స్థితి లోకి వెళ్లిపోయారు' అని.

"సరే సరే, నేను అర్థం చేసుకున్నాను" అన్నది ఆ చిలుక.

మరుసటి రోజు సత్సంగానికి వెళ్తూ, యజమాని పంజరంలో ఉన్నచిలుక అపస్మారక స్థితిలో ఉండడాన్ని చూశాడు.

యజమాని పరీక్షగా చూసి చిలుక చనిపోయిందనుకుని  బయటకు తీసాడు. దానిని నేలమీద ఉంచాడు. వెంటనే ఆ చిలుక రివ్వుమంటూ ఎగిరిపోయింది. 

చేసేది లేక సత్సంగం కోసం మామూలుగా వెళ్లాడు ఆ యజమాని.

గురువు అతనిని చూసి, దగ్గరకు పిలిచి, "నీ చిలుక ఎక్కడ ఉంది?" అని అడిగాడు.

"నేను ఉదయం సత్సంగానికి వచ్చేటప్పుడు, నా చిలుక అపస్మారక స్థితికి గురై, పంజరంలో పడి ఉంది. దాని ఆరోగ్యం తనిఖీ చేయడానికి నేను పంజరం తెరిచి దానిని నేలమీద ఉంచినప్పుడు, అది పారిపోయింది" అని దిగులుగా చెప్పాడు.

గురువు నవ్వి, "మీ చిట్టిచిలుక మీ కన్నా ఎక్కువ తెలివిగలది. అది నేను ఇచ్చిన చిన్న సూచన అర్థం చేసుకుని
ఆచరణలో పెట్టి స్వేచ్ఛను పొందగలిగింది.

కానీ మీరు చాలా రోజుల పాటు సత్సంగానికి వస్తూ కూడా సాధన చేయక, ఈ ప్రపంచంలోనే  భ్రమ అనే పంజరంలో చిక్కుకొని ఉన్నారు."
అని అన్నాడు.
యజమాని సిగ్గుతో తలదించు కొన్నాడు.
దూరం నుంచి చిలుక గురువుకు కృతజ్ఞతలు తెలుపుకుంది.

నీతి : సత్సంగం యొక్క ఉద్దేశం కేవలం భక్తికోసం కాదు, కాలక్షేపం కోసం కానే కాదు. అజ్ఞానం నుండి, అంధకారం నుండి,భ్రమ నుండి మనం బయటపడి స్వేచ్ఛగా విముక్తలమై దైవానికి చేరువకావడం కోసం అని గ్రహించాలి.

హనుమకృత సీతారామ స్తోత్రమ్

అయోధ్యా పుర నేతారం మిథిలా పుర నాయికాం !
రాఘవాణాం అలంకారం వైదేహీనాం అలంక్రియాం !!

రఘూణం కుల దీపం చ నిమీనం కుల దీపికాం !
సూర్య వంశ సముద్భూతమ్ సోమ వంశ సముద్భవాం !!

పుత్రం దశరథస్యాద్యమ్ 
పుత్రీం జనక భూపతే!
వసిష్టాను మతాచారం శతానంద మతానుగం !!

కౌసల్యా గర్భ సంభూతం 
వేదిగర్భోదితం స్వయం !
పుండరీక విశాలాక్షం స్ఫురదిందీ వరేక్షణాం !!

చంద్రకాంతాననాంభోజం 
చంద్ర బింబోపమాననం !
మత్త మాతంగ గమనం 
మత్త హంస వధూ గతాం !!

చందనార్ద్ర భుజా మధ్యం కుంకుమార్ద్ర కుచస్థలీం !
చాపాలంకృత హస్తాబ్జం పద్మాలంకృత పాణికాం !!

శరణాగత గోప్తారం
 ప్రణిపాత ప్రసాదికాం !
కాలమేఘ నిభం రామం 
కార్త స్వర సమ ప్రభాం !!

దివ్య సింహాసనాసీనం దివ్యస్రగ్వస్త్ర భూషణాం !
అనుక్షణం కటాక్షాభ్యాం అన్యోన్య క్షణ కాంక్షిణూ !!

అన్యోన్య సదృశాకారౌ త్రైలోక్య గృహ దంపతి !
ఇమౌ యువాం ప్రణమ్యాహం భజామ్యద్య కృతార్థతాం !!

అనేన స్తోతి యః స్తుత్యం రామం సీతాంచ భక్తితః !
తస్య తౌ తనుతాం పుణ్యాస్సంపదః సకలార్థదాః !!

ఏవం శ్రీరామ చంద్రస్య జానక్యాశ్చ విశేషతః !
కృతం హనుమతా పుణ్యం స్తోత్రం సద్యో విముక్తిదం
యః పఠేత్ ప్రాతరుత్థాయ సర్వాన్ కామనవాప్నుయాత్ !!
ఇతి శ్రీ సీతారామస్తోత్రం సంపూర్ణం


ప్రతి శ్లోకంలో మొదటిభాగం స్వామివారి గురించి, రెండవ భాగం అమ్మవారి గురించి చెప్తూ హనుమంతుడు చేసిన స్తుతి.

రామచంద్రాయ జనక
రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ
మామకాభీష్టదాయ మహితమంగళం || ||రామ||

కౌసలేశాయ మందహాస దాసపొషనాయ
వాసవాది వినుత సద్వరాయ మంగళం || ||రామ||

చారు మేఘ రూపాయ చందనాది చర్చితాయ
భాన కటక శోభితాయ భూరి మంగళం || ||రామ||

లలిత రత్న కుండలాయ తులసీ వనమాలికాయ
జలజ ఘతుక దేహాయ చారు మంగళం || ||రామ||

దేవకీ సుపుత్రాయ దేవ దేవోదత్తమాయ
చావజాత గురువరాయ సర్వ మంగళం || ||రామ||

పుండరీకాక్షాయ పూర్ణచంద్రాననాయ
అండజాత వాహనాయ అతుల మంగళం || ||రామ||

విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ
సుముఖ చిత్త కామితాయ శుభగ మంగళం || ||రామ||

రామదాసాయ మ్రుదుల హృదయ కమల వాసాయ
స్వామి భద్రగిరివరాయ సర్వ మంగళం || ||రామ||

Sunday, April 12, 2020

రామతత్వం పరమాత్మ ధర్మం

*వేదవేద్యే పురేపుంసీ జాతే ధశరధాత్మజే* 
 *వేద: ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన:* 

ఉపాసన విషయం లో ఒక్కో అధిష్ఠాన దేవతకి ఒక్కో రకమైన ప్రత్యేకత ఉంటుంది.... 

రామ తత్వాన్ని తీసుకుంటే రాముని భక్తుడిగా ఉండటం అంత ఆషామాషీ వ్యవహారం మాత్రం కాదు... 
ఎందుచేత ఈ మాట అంటున్నారు అనంటే సాక్షాత్తు ధర్మదేవత కి ప్రతిరూపమై భూమిపై నడయాడిన స్వరూపం శ్రీ రామ చంద్ర స్వామి...

ఎంత ఉపాసన చేసినప్పటికీ  ఎంత ఆరాధ్య భావాన్ని ప్రకటించుకున్నప్పటికినీ ఆ స్వామి ని అర్థం చేసుకుని ఆయన భక్తుడిగా కడదాక కొనసాగగలగడం నిజం గా కత్తిమీద సామే......

శ్రీ రామ చంద్ర స్వామి కి భక్తాగ్రేసరుడైన కంచర్ల గోపన్న గారు కూడా రామ భక్తుడిగా ఎన్నో పరీక్షలను ఎదుర్కొన్న విషయం మనం గుర్తుంచుకోవాలి... 

తన జీవితం అంతా రామ భక్తి కోసం పరితపించిన మహనీయుడికి కూడా పరీక్ష తప్పలేదు... 

చరసాలలో వేసినా క్షరాన్నాన్ని పెట్టినా ఆయన రాముడికోసమే తపన పడినాడు తప్ప నాస్తికుడిగా మారలేదు... 

ఇంత పిలిచినా వేడుకున్నా తనకు రాముడు దర్శనం ఇవ్వలేదని ఏడిచినా కూడా ఆ రామచంద్ర స్వామి తన దర్శనాన్ని తానీషా కే ముందుగా ఇచ్చాడు... 

ఆ సమయంలో సామాన్య భక్తులైతే వెంటనే నన్ను కొట్టి ఖైదు చేసిన తానీషా పై ఉన్న పాటి కరుణ కూడా నా మీద లేదా అంటూ అసలు నువ్వు దేవుడివేనా అంటూ భక్తి మార్గాన్ని తెంచుకుని దారి తప్పినా ఆశ్చర్యం లేదు...
 రామదాసు గారు కూడా ఎంతో దుఖ్ఖించారు.. ప్రాదేయపడినారు

నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి నను బ్రోవమని చెప్పవే... అంటూ అమ్మ కి చెప్పి సేద తీరారు...

అలాంటి రామదాసు గారికి చివరకు మోక్షం ప్రసాదించిన దైవం కూడా ఆ రామ చంద్రుడే...

చివరగా చెప్పేదేమంటే ధర్మ మార్గం లో నడవగలిగిన ధైర్యం ఉన్నవాడే నీతి నిజాయితీ లకు కట్టుబడిన నాడే పితృవాక్య పరిపాలనా ప్రాజ్ఞుడిగా మారిన నాడే  మనం ఆ రామభద్రుని పాదాలను కడదాకా మనసు లో నిలుపుకోగలం.. ..

అలా నిలుపుకోవడమే నిజమైన పరిణతి తో కూడిన భక్తి అవుతుంది...

 ఎన్ని యుగాలు మారినా పదునాలుగు భువన భాండమ్ముల నిండా దశ దిశలలోనూ పరివ్యాప్తమై ఉన్నది రామతత్త్వం ఒక్కటే.

Vontimitta Kodandarama Swamy Temple

అత్యంత పురాతనమైన ఈ ఆలయంలోని సీతారామ లక్ష్మణ విగ్రహాలు విడి విడిగా వున్నా ఏక రాతిలో చెక్కబడినవి.
ఇంకొక విశేషం ఇక్కడ గర్భగుడిలో ఆంజనేయస్వామి వుండరు. ఆయన్ని కలుసుకోవటానికి ముందే సీతారామ లక్ష్మణులు ఇక్కడ సంచరించారనీ, అందుకని ఆంజనేయస్వామి విగ్రహం ఇక్కడ ప్రతిష్టింపబడలేదని అభిజ్ఞుల అభిప్రాయం. వనవాస సమయంలో సీతారామ, లక్ష్మణులు ఇక్కడ సంచరిస్తూ వుండగా సీతమ్మకి దాహం వేసింది. అప్పుడు శ్రీరామచంద్రుడు తన బాణంతో పాతాళ గంగను రప్పించాడు. ఆ తీర్ధం రామ తీర్ధంగా ఇప్పటికీ అక్కడ వున్నది.

ఒక మిట్టమీద నిర్మింపబడ్డ రామాలయం అవటంవల్ల ఈ ఆలయానికి ఒంటిమిట్ట రామాలయం అని పేరు వచ్చింది. ఈ ఆలయంలోని విగ్రహాలు ఒకే శిలలో మలచబడ్డాయి. అందుకే దీనికి ఏక శిలా నగరమనే పేరు వచ్చింది.

ఇంకొక కధనం ప్రకారం ఒంటుడు, మిట్టుడు అనే ఇద్దరు రామ భక్తులు (వీరు చోరులు అని కూడా అంటారు) ఈ ఆలయాన్ని నిర్మించారు. నిర్మాణం పూర్తయిన తర్వాత వారు తమ జీవితాలని అంతం చేసుకున్నారు. వారి శిలా విగ్రహాలు ఆలయంలో ప్రవేశించటానికి ముందు చూడవచ్చు.
మహా భాగవతకర్త పోతన తాను ఏక శైలపురివాసినని చెప్పుకున్నాడు. భాగవతంలో తానీ ప్రాంతానికి చెందినవాడనే మాటలు కొన్ని వుండటంవల్లకూడా పోతన కొంత కాలం ఇక్కడ నివసించినట్లు భావిస్తారు. పోతన జన్మ స్ధలం గురించి ఎన్నో వివాదాలున్నాయి. అయినా ఆయన రచించిన భాగవతాన్ని అంకితమిచ్చింది కోదండరాముడికే. ఆలయంలో ఈ సహజ కవి విగ్రహాన్ని దర్శించవచ్చు.

తెలుగులో తొలి యాత్రా రచన .. కాశీ యాత్ర చరిత్ర .. లో ఈ గ్రామ ప్రస్తావన వున్నది. ఆ గ్రంధకర్త ఏనుగుల వీరాస్వామి కాశీ యాత్రలో భాగంగా అత్తిరాలనుంచి భకరాపేట వెళ్ళే మార్గంలో ఒంటిమిట్టనుంచి వెళ్ళారు. ఈ గ్రంధ రచన క్రీ.శ. 1830లో జరిగింది. ఆ సమయంలో గ్రామం నాలుగు పక్కల కొండలు మధ్యలో భారీ చెరువున్నది. చెరువుకట్టమీద వున్న బాటమీద ఆయన ప్రయాణం చేశారు. అప్పట్లో అది గ్రామమనీ, గ్రామంలో చక్కటి గుళ్ళు, యాత్రికుల నిలయం వున్నాయని పేర్కొన్నారు.

రామ లక్ష్మణులు చిన్న వయసులోనేకాక సీతా రామ కళ్యాణం తర్వాత కూడా మృకండ మహర్షి, శృంగి మహర్షి కోరికమీద యాగ రక్షణకి, దుష్ట శిక్షణకీ శ్రీరామ లక్ష్మణులు అంబులపొది, పిడిబాకు, కోదండం పట్టుకుని ఈ ప్రాంతానికి వచ్చి యాగ రక్షణ చేశారని ఒక కధనం. అందుకు ప్రతిగా ఆ మహర్షులు సీతా రామ లక్ష్మణుల విగ్రహాలను ఏక శిలలో చెక్కించారనీ, తర్వాత జాంబవంతుడు ఈ విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ట చేశాడనీ ఇక్కడివారి విశ్వాసం.

సందర్శకులను ఆకర్షించే అంశాల్లో ఇంకొకటి ఇమాంబేగ్ బావి. 1640 సం. లో కడపను పాలించిన అబ్దుల్ నబీఖాన్ ప్రతినిధి ఇమాంబేగ్. ఒకసారి ఆయన ఈ ఆలయానికి వచ్చిన భక్తులను మీ దేవుడు పిలిస్తే పలుకుతాడా అని ప్రశ్నించాడుట. చిత్త శుధ్ధితో పిలిస్తే ఖచ్చితంగా పలుకుతాడని వారు సమాధానం ఇవ్వగా ఆయన మూడు సార్లు రాముణ్ణి పిలిచారట. అందుకు ప్రతిగా మూడు సార్లు ఓ అని సమాధానం వచ్చింది. ఆయన ఆశ్చర్య చకితుడై, స్వామి భక్తుడిగా మారి, అక్కడి నీటి అవసరాలకోసం ఒక బావిని తవ్వించాడు. ఆయన పేరుమీద ఆ బావిని ఇమాంబేగ్ బావి అటారు. అప్పటినుంచి ఎందరో ముస్లిం భక్తులు కూడా ఈ ఆలయం సందర్శిస్తూ వుంటారు.

ఫ్రెంచి యాత్రికుడు టావెర్నియర్ 16 వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని దర్శించి, భారత దేశంలో పెద్ద గోపురాలలో ఈ ఆలయ గోపురం ఒకటి అని శ్లాఘించాడు.

ఆలయ నిర్మాణం:

* పొత్తపి చోళులు, విజయనగర రాజులు, మట్టిరాజులు ఈ ఆలయాన్ని మూడు దశలలో నిర్మించారు.

* మూడు గోపురాలతో, విశాలమైన ఆవరణలో అలరారే ఈ ఆలయం ముఖద్వారం ఎత్తు సుమారు 160 అడుగులు.

* ఈ ఆలయంలో మధ్య మండపంలో 32 స్తంబాలున్న రంగమంటపం వున్నది. సందర్శకులను ఆకట్టుకునే ఈ స్తంభాల మీద శిల్ప కళ చోళ, విజయనగర శిల్ప శైలిని పోలి వుంటుంది. ఈ స్తంబాలపై రామాయణ, భారత కధలను చూడచ్చు.

* గుడి ఎదురుగా సంజీవరాయ దేవాలయం, పక్కగా రధశాల, రధం వున్నాయి.

* పోతన, అయ్యల రాజు రామభద్రుడు, ఉప్పు గుండూరు వేంకటకవి, వరకవి మొదలగు ఎందరో స్వామికి కవితార్చన చేసి తరించారు.

* అన్నమాచార్యుడు ఈ ఆలయాన్ని దర్శించి స్వామిమీద కొన్ని కీర్తనలు రచించారు.

* ప్రౌఢ దేవరాయల ఆస్ధానంలో అయ్యల తిప్పరాజు ఈ ప్రాంతవాసి. ఈయన స్వామిపై ... శ్రీ రఘువీర శతకాన్ని రచించారు. ఇతని మనవడే అష్ట దిగ్గజాల్లో ఒకరయిన అయ్యల రాజు రామభద్రుడు. 

వాల్మీకి రామాయణాన్ని తెలుగులోకి అనువదించి, ఆంధ్ర వాల్మీకిగా పేరుపొందిన శ్రీ వావిలకొలను సుబ్బారావు (1863 – 1936) రెవెన్యూ ఉద్యోగి. ఈయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి తన జీవితాన్ని ఈ ఆలయ పునరుధ్ధరణకి అంకితం చేశారు. ఊరూరా భిక్షమెత్తి ఈ ఆలయానికి భూములు, భవనాలు, స్వామికి విలువైన ఆభరణాలు ఏర్పాటు చేశారు. ఈయన రామాయణాన్ని తెలుగులో రచించి దానికి “మందరం” అనే పేరుతో వ్యాఖ్యానం కూడా రాశారు.

మార్గము:
కడపనుంచి రాజం పేట వెళ్ళే మార్గంలో కడపకి 27 కి.మీ. ల దూరంలో వున్నది. కడపనుంచి బస్సు సౌకర్యం వున్నది.

ఉత్సవాలు:
చైత్ర శుధ్ధ నవమినుండి బహుళ విదియ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అందులో

చతుర్దశినాడు కళ్యాణం, పౌర్ణమినాడు రధోత్సవం, నవమినాడు పోతన జయంతి జరుగుతాయి.

నమ్మకం విలువ ఖచ్చితంగా చెప్పే రామ సేతు

  శ్రీరాముడు రావణునితో
యుద్ధం చేసి అతనిని సంహరించాడు
యుద్ధం ముగిసింది ఆ రాత్రి రామలక్ష్మణులు
కపి సైన్యంతో సముద్ర తీరంలో విశ్రమించారు

అర్థరాత్రి అయింది .......
రాముడు లేచి సముద్రం దగ్గరకు వెళ్ళాడు
ఒక్కొక్క రాయి తీసికొని
సముద్రం నీటిలో వేస్తున్నాడు
 ప్రతి రాయి మునిగిపోతుంది
రాముడు లేచి కడలి చెంతకు వెళ్ళడం
గమనించిన హనుమంతుడు
తాను రాముని వెంట వెళ్ళాడు
రాముడు రాళ్ళను సముద్రంలో
వేయడం గమనించారు
రాముని ముందుకు వెళ్ళి నమస్కరించి మహాప్రభూ ఎందుకిలా రాళ్ళను
అంబుధిలో వేస్తున్నారు అని ప్రశ్నించాడు

హనుమా  ! నువ్వు నాకు
అబద్ధం చెప్పావు అన్నాడు రాముడు
అదేమిటి స్వామి నేను మీకు
అబద్ధం చెప్పానా  ?
ఏమిటి స్వామి అది  ?
ఆశ్చర్యంతో అడిగాడు ఆంజనేయుడు
వారధి కట్టేటప్పుడు నా పేరు
జపిస్తూ రాళ్ళను కడలిలో వేశామని
అవన్నీ తేలి వంతెనలాగా ఏర్పడ్డాయని చెప్పావు నిజమేనా ? అన్నాడు రాముడు
అవును స్వామీ  !..
నా పేరు జపింవి వేసిన రాళ్ళు
తేలడం నిజమైతే
నేను స్వయంగా వేస్తున్న రాళ్ళు
ఎందుకు తేలడం లేదు  ?
మునగడానికి కారణమేమిటి  ?..
నువ్వు చెప్పిన మాట అబద్ధం కాదా  !..
అడిగాడు రాముడు
హనుమంతుడు వినయంగా
చేతులు కట్టుకుని ఇలా అన్నాడు
రామచంద్ర ప్రభూ  !  ....
మేము మిమ్ము మీ శక్తిని నమ్మాము
మీ మీద నమ్మకంతో వేశాము
మా నమ్మకం వలన అవి తేలాయి
మీకు మీ శక్తి మీద నమ్మకం లేదు
అనుమానంతో అపనమ్మకంతో
రాళ్ళను వేశారు
అందుకే  అవి మునిగిపోయాయి
నమ్మకం విలువ అది

మన ఇతిహాసాలు

*అపరిమిత బలము కలిగిన భీముడు ఒక పాము చేతిలో బంధీకృతుడు కావడo*
ఒకరోజు భీముడు వేటనిమిత్తం హిమాలయ శిఖరం మీదకు వెళ్ళాడు. అక్కడ ఒక కొండచలువ భీముని ఆహారంగా పట్టుకుంది. అది భీముని తన శరీరంతో చుట్టేసింది. భీముని బలం ఆ కొండచిలువ బలం ముందు చాలలేదు. భీముడు ఆశ్చర్యపడి "నా వంటి బలవంతుని ఇలా బంధించే శక్తి నీకు ఎలా వచ్చింది? నీవు వరప్రసాదివా? " అని అడిగాడు. ఆ కొండచిలువ భీమునితో ఇలా పలికింది " భీమసేనా నేను నహుషుడు అనే మహారాజును. ఒకప్పుడు దేవేంద్రపదవిని అధిష్టించాను. కాని ఒకమునివరుని శాపం వలన సర్పరూపం దాల్చాను " అని దు॰ఖించాడు.

ఇంతలో భీమసేనుడు కనపడలేదని కలత పడి ధర్మరాజు అతడిని వెతుకుతూ వచ్చాడు. కొండచులువ బంధించి ఉన్న భీముని చూసి " ఆహా ఏమి కాల మహిమ? అపరిమిత బలము కలిగిన భీముడు ఒక పాము చేతిలో బంధీకృతుడు కావడమా? " అనుకున్నాడు. ధర్మరాజు కొండచిలువను చూసి " అయ్యా నీవు ఎవరు? రాక్షసుడివా దేవతవా చెప్పు. నేను పాండురాజు పుత్రుడను. నా పేరు ధర్మరాజు. నీవు నా తమ్ముని కేవలం ఆహారం కొరకు పట్టుకుంటే అతడిని విడిచిపెట్టు. నేను నీకు తగినంత మృగమాంసం సమకూరుస్తాను " అన్నాడు. ధర్మజా! నేను నీవంశంలో పుట్టిన వాడను. నా పేరు నహుషుడు. నేను ఇంద్రుడితో సమానుడను. ఐశ్వర్య గర్వంతో వివేకం లేక సప్తఋషులతో పల్లకి మోయించుకుని వారిని అవమానించాను.ప్రత్యేకంగా అగత్యుడిని అవమానించి కారణంగా అతడు నన్ను పాముగా పడి ఉండమని శపించాడు. ఆశాపప్రభావంతో ఇక్కడ సర్పరూపంలో పడి ఉన్నాను.

నా శాపవిమోచనం కొరకు నాకు పూర్వజన్మ స్మృతి ఉండేలా అనుగ్రహించమని వేడుకున్నాను. అగస్త్యుడు కరుణించి నా ప్రశ్నలకు ఎవరు సమాధానం చ్ప్తారో వారి వలన శాపవిముక్తి కలుగుతుందని చెప్పాడు. ఆ మహానుభావుని కొరకు నిరీక్షిస్తూ ఇలా పడి ఉన్నాను. నీకు శక్తి ఉంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పి నీ తమ్ముని విడిపించుకో. ధర్మరాజు "అయ్యా! నీవు అడిగే ప్రశ్నలకు విజ్ఞులైన బ్రాహ్మణులు మాత్రమే చెప్పగలరు నాకు సాధ్యమా? అయినా ప్రయత్నిస్తాను. అడుగు " అన్నాడు.కొండచిలువరూపంలో ఉన్న నహుషుడు మొదటి ప్రశ్న ఇలా వేసాడు.ఏ గుణములు కలవాడు బ్రాహ్మణుడు? అతను తెలుసుకోదగిన విష్యమేమిటి? ". జవాబుగా ధర్మరాజు " సత్యము, క్షమ, దయ, శౌచము, తపము, దానము, శీలము మొదలైన గుణములు కలిగిన వాడు బ్రాహ్మణుడు. సుఖము దు॰ఖము ఎడల సమబుద్ధి కలిగి ఉండటమే అతను తెలుసుకోదగిన ఉత్తమ విద్య " అన్నాడు.

నహుషుని రెండవ ప్రశ్న " శూద్రుడు పైన చెప్పిన గుణములు శూద్రునిలో కనిపిస్తే అతను బ్రాహ్మణుడు అని పిలువబడతాడా? అలా అయితే కుల విభాగములు ఎందుకు? అధికులు హీనులు అనే వివేకం అపార్ధం కాదా? ధర్మరాజు " మహాత్మా! ఏకారణం చేతనైనా వర్ణసంకరం ఏర్పడినప్పుడు ఎవరు ఏ వర్ణమునకు చెందిన వారు అని తెలియజేయుటకు స్వాయంభువమనువు ఒక పరీక్ష పెట్టాడు. సత్యమూ మొదలగు గుణములు శూద్రుడు ఉత్తమమైన శూద్రుడు కాగలడు కాని బ్రాహ్మణుడు కాగలడా? అదే విధంగా సత్యమూ మొదలగు గుణములు లేని వాడు బ్రాహ్మణుడు కాగలడా? కనుక ఒక వ్యక్తి గుణములు నిర్ణయించుటకు అతని గుణశీలములు ముఖ్యము. గుణశీలములు కలవాడు ఇంకా ఉత్తముడు కాగలడు. గుణశీలములు లేనివాడు వాటిని కాపాడుకోలేడు. కనుక ధనాన్ని రక్షించటం కంటే గుణశీలములు కాపాడుకోవడం ఉత్తమం " అని జవాబిచ్చాడు.

నహుషుని మూడవ ప్రశ్న. " పరులకు అపకారం చేసి, అసత్యములు చెప్పి కూడా అహింసను కఠినంగా ఆచరించినవాడు ఉత్తమ గతులు పొందగలడు. అహింస అంత పవిత్రతను పొందింది ? " ధరరాజు " దానం చెయ్యడం, ఇతరులకు ఉపకారం చెయ్యడం, సత్యం పలకడం, అహింసను పాటించడం అనేవి నాలుగు ఉత్తమ ధర్మములు కాని వాటిలో అహింస విశేషమైంది. దేవతా జన్మ, జంతుజన్మ, మానవజన్మ అనునవి మానవునికి కలుగు జన్మలు. దానము మొదలగు కర్మలు ఆచరిస్తూ అహింసా వ్రతం ఆచరించువాడు దైవత్వాన్ని పొందుతాడు. సదా హింస చేయువాడు జంతువుగా పుడతాడు. అందుకని అహింస పరమ ధర్మంగా పరిగణించబడుతుంది " అని జవాబిచ్చాడు. ఈ సమాధానం విని భీముని వదిలాడు. తన సర్ప రూపం వదిలి దివ్యమైన రూపం పొందాడు*

Saturday, April 11, 2020

ప్రస్తుత పరిస్థితికి అద్దం పట్టే కథ

అది ఒక అందమైన  జింకల వనం. అందులో జింక జాతులు ఆనందంగా, నిర్భయంగా జీవిస్తున్నాయి. 

ఒకసారి ఆ వనం నుంచి ఒక జింక దారి తప్పి, వేరే అడవిలోకి వెళ్ళింది. అక్కడ దానికి ఎన్నెన్నో కొత్త కొత్త జంతువులు కనిపించాయి. తోడేళ్ళనూ, పులులనూ, సింహాలనూ, నక్కలనూ తొలిసారి అక్కడే చూసింది. 

అక్కడ ఒక కొమ్ముల జింక ఎదురై- ‘‘ఓ జింక సోదరా! ఈ అడవిలో నిన్నెప్పుడూ చూడలేదే!’’ అంది. 

‘‘అవును. మాది జింకల వనం!’’
‘‘ఈ అడవి మీ జింకల వనం లాంటిది కాదు. ఇక్కడ మనల్ని చంపి తినే క్రూరమృగాలు ఉన్నాయి. వాటి నుంచి ఎలా తప్పించు కోవాలో మీకసలు తెలియదు. కాబట్టి ఇక్కడి నుంచి త్వరగా  వెళ్ళిపో!’’ అంటూ ఆ జింక గెంతుతూ వెళ్ళిపోయింది. 

‘‘పిరికి జింక! నేనూ జింకనే. అదెలా తప్పించు కోగలదో నేనూ అలాగే తప్పించు కోగలను’’ అనుకుంటూ జింకలవనం జింక ముందుకు వెళ్ళింది. 

అక్కడ చెట్టు కింద నిద్రపోతున్న సింహం కనిపించింది. జింక మెల్లగా దాని దగ్గరకు వెళ్ళి, తన ముంగాలి గిట్టతో సింహం తోకను తొక్కింది. 

సింహానికి మెలకువ వచ్చింది. బద్దకంగా లేస్తూ జింకను చూసింది. గర్జించింది. ఆ గర్జన విని, జింకకు గుండె ఆగినంత పని అయింది.. వెను తిరిగి వచ్చిన దారినే పరుగులు పెట్టింది. 
అడవి దాటి జింకలవనం వైపు పరుగులు తీస్తూనే ఉంది. జింకలవనం సమీపానికి రాగానే సింహానికి చిక్కింది. సింహం దాన్ని చంపి, చీల్చి ఆరగించింది.

తరువాత సింహం లేచి మెల్లగా జింకలవనం లోకి వెళ్ళింది. దానికి అది కొత్త ప్రదేశం. అక్కడ దానికి గుంపులు గుంపులుగా జింకలు కనిపించాయి. సింహం ఆనందానికి అంతు లేదు. దొరికిన జింకను దొరికినట్టు చంపి తినేస్తోంది.

కొత్తగా ముంచుకొచ్చిన ఈ మృత్యువును చూసి జింకలన్నీ భయపడిపోయాయి. చెల్లా చెదురయ్యాయి. పొదల్లో దాక్కున్నాయి. బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నాయి. పొరపాటున ఏ జింకయినా బయటకొస్తే చాలు... సింహం దాన్ని పడగొట్టేస్తోంది. 

అయితే ఆ జింకల్లో తెలివైన కుర్ర జింక ఒకటుంది. దాని పేరు జ్ఞాననేత్ర. జింకల పెద్దలు జ్ఞాననేత్ర దగ్గరకు వచ్చి- ‘‘దీనికి పరిష్కారం ఏమిటి?’’ అని అడిగాయి.

‘‘జింక పెద్దలారా! నేనూ అదే ఆలోచిస్తున్నాను. ఈ క్రూరజంతువును ‘సింహం’ అంటారు. దీని పంజా నుంచి తప్పుకొనే చాకచక్యం మనకు లేదు. ఎటు ఆలోచించినా, ఎంత యోచించినా ఒకే ఒక్క దారి కనిపిస్తోంది. ఈ సింహం ఆహారం లేకుండా 14 రోజులు మాత్రమే బతకగలదు. కానీ మనం 21 రోజులు బతకగలం. కాబట్టి మన జింకలన్నీ తమ పొదల్లోకి దూరి 14 రోజులు బయటకు రాకుండా ఉంచే చాలు. దీని పీడ మనకు విరగడ అవుతుంది. మనలో ఎవరైనా నిర్లక్ష్యంతో బయటకు వచ్చి దానికి చిక్కారా... దాని జీవిత కాలాన్ని మరో 14 రోజులు పెంచినట్టే! ఈ రోజు అమావాస్య. ఇప్పుడే పొదల్లోకి చేరిపోదాం. పున్నమి నాటికి బయటకు వద్దాం. తమ పొద నుంచీ ఏ జింకా బయటకు రాకుండా చూసే బాధ్యత ఆ జింకల పెద్దలదే!’’ అంది. 

జింకలన్నీ జ్ఞాననేత్ర మాటలు విన్నాయి. ఆకలితో అలమటించాయి. 

పున్నమి వచ్చింది. జింకలన్నీ ఒక్కొక్కటీ భయం భయంగా బయటకు వచ్చాయి. వనం మధ్య చెట్టుకింద చచ్చి పడి ఉన్న సింహాన్ని చూశాయి. 

ఆనందంతో అరిచాయి. గెంతాయి.  జింకల కేరింతలతో వనమంతా పులకరించింది.

Friday, April 10, 2020

Zodiac Signs- Astrology- Body parts


When we would analyze a Horoscope chart in terms of body issues and health concerns we would pay attention both to signs and planets as well as the houses. For example, we have been having headaches quite often. The head is associated with Aries and the first house. We would need to pay attention to any planet in the first house. Mars rules the sign of Aries and it could bring pain, pressure or burst of energy and even accidents to the head. Other planets in Aries would be important as well.
However, Mars could be in square (disruption of the flow) with Mercury (lots of thinking and confusion in terms of decisions), Saturn (tiredness and low energy) or any other planet in our Horoscope chart. Transits would also be important and might give us more insight, too. In that term the first house is connected to the head, the second house is connected to the throat… But, when we are talking about issues with the body and overall health the sixth house needs to be taken into careful consideration, as well.

So there is really no simplification, but there is always a very deep and meaningful answer when we turn to our Horoscope chart. Sun sign of a person will often bring an issue that will be present throughout the life and we can see this quite often.

However, as we can connect parts of the body with the planets and every planet is related to one chakra, if there is an issue we are facing with, meditations and visualizations focused on a specific chakra could help, too. 

This is something that we can learn to do by ourself and will do us a lot of good. If we are having headaches, we would need to focus on the first chakra (Mars) and unblock the energy which is not flowing to the head, therefore headaches might appear.

#Aries the head, the pineal gland, the eyes, Mars muscles and when the planet is afflicted by transit on this sign and you are getting surgery, we might expect, Heaven forbid, a hemorrhage. The same with the Moon which rules moods: when it is negatively afflicted by transit look at the sign it is transiting in because the associated body part might have a hemorrhage during surgery.

#Taurus: the throat, the neck, the voice, AND Venus rules the skin of the person.

#Gemini: the nervous system. The lungs and movement. Gemini's might find it difficult to stand still they constantly need movement. Mercury: problems with language and speaking, extreme nervousness, problems with the mind.

#Cancer: the breasts and the stomach, extreme moodiness, mood swings, over sensitive to the mental atmosphere. 

#Leo: the heart, the entire cardiovascular system, the back. The Sun: inflammation. Confusion if Mercury is close by because it causes an obliteration of the mind. 

#Virgo: the intestines, the guts.

#Libra: the kidneys but Venus rules the skin so Libra's are obsessed with the use of cosmetic creams.

#Scorpio: the genitals, so if Mars is afflicted in Scorpio, expect a genital inflammation.

#Sagittarius: the legs, the hips, Jupiter rules the veins and circulation, beware of Jupiter because it also rules weight gains, it makes people fat.

#Capricorn: the teeth, the bones, the knees, and Saturn rules blockages like constipation or mental and emotional blockages if afflicted by Mercury or the Moon.

#Aquarius: the ankles, the ligaments.

#Pisces: the feet. 

We can see there is a plethora of information we can derive from a Horoscopic chart and its transits to clarify the medical conditions of a person.

Thursday, April 9, 2020

కాల ధర్మాన్ని పోషించడమే నా ధర్మం

ఆత్మ నిష్ఠ - ఆత్మ విచారణ

1. స్వధర్మం
2.  అవసరం లేదు
3. ఇక చాలు
4. ఏదీ శాశ్వతం కాదు
5. దేహానికే మరణము
6.  సంసిద్ధత
7. అవగాహనత /మేలుకో
 కాంక్ష, మోహం లోనుంచి బయిటపడాలి అనంటే,
మూడు నియమాలను పెట్టుకోవాలి కదా!
ఏమిటి? అవి.
(1). ‘ధర్మం తప్పి ప్రవర్తించను’-అనేది వుండాలా? వద్దా?
అదేమిటి?
స్వధర్మం, పరధర్మం.
So, ధర్మం తప్పి ప్రవర్తించడం అంటే?
స్వధర్మాన్ని తప్పి ప్రవర్తించను. ఆత్మధర్మాన్ని తప్పి ప్రవర్తించను.
ఆత్మధర్మాన్ని తప్పి ప్రవర్తించినదంతా అధర్మమే. పర ధర్మమే. అర్థమైందా?
ఇంకొకటి ఏమిటి?

(2). ఇకచాలు.
ఇక చాలా? ఉన్నది చాలా?
శి: ఉన్నది చాలు.
గు: ‘ఉన్నది చాలు’ అంటే... ఇంకా అందులో శేషం మిగిలి వుందిగా...
శి: ‘ఇక చాలు’ - అనగలగాలి.
గు: ‘ఉన్నది చాలు’ - అన్నవాడికి...
అప్పుడేమయ్యింది? శేషం మిగలడం లేదా?
ఆత్మ ధర్మంలో, ‘ఉన్నదిచాలు’అనడానికి అక్కడ ఏముంది?
అంతటా వున్నదే కానీ అది,పరిమితంగా లేదుగా. కాబట్టి ప్రపంచానికి సంబంధించినటువంటి పరధర్మ విషయం వచ్చింది.
అక్కడేమి చెప్పాడు ఇక?
‘ఇక చాలు’ - అన్నాడు.
‘ఉన్నది చాలు’ - అనడం లేదు ఇప్పడు.
‘ఇక చాలు’ - అన్నాడు.
‘ఇక చాలు’ - అని ఎప్పుడైతే అన్నాడో ఏమైంది? ముగిసిపోలేదా ఇక...?
Full stop పడిపోయింది.
‘ఉన్నది చాలు’ - అంటే ప్రపంచం మిగిలింది ఇంకా.

విషయం కూడా మిగిలింది ఇంకా.
ఆసక్తి కూడా మిగిలింది ఇంకా అక్కడ.
ఇక చాలయ్యా! ఈ ఆట చాలా కాలం ఆడాను, ఇంకెంత కాలం ఆడతాను?
నేను ఎప్పటి నుంచో ఆడుతూనే వున్నాను. ఎన్నో లక్షల జన్మల్లో ఆడుతూనే వున్నాను.
ఈ జననమరణాలనే ఆట ఆడుతూనే వున్నాను.
ఇకచాలు. ఈ జన్మతో ఇక చాలు. అర్థమైందా?!
‘ధర్మం తప్పను’, ‘ఇక చాలు’.

(3). మూడవ నియమం.... ‘అవసరం లేదు’. ఇది చాలా బలమైనటువంటి నియమం.
జననమరణాలు కలగడానికి కారణం ఏమిటి?

అవసరమేగా! ‘అవసరం వుంది’అనే భావన వుందనుకోండి, మళ్ళా రాక తప్పదు.
కాబట్టి ‘అవసరం లేదు’ అనే నియమాన్ని పాటిస్తే ఏమైంది?
ఇక నేను దానికి లొంగటం లేదు కదా! ఇక, అర్థమైందా?

తీవ్ర వైరాగ్య సంపన్నుడు - జగమొండి.
రాజుకంటే బలవంతుడు.
వాడిని ఏదీ వంచలేదన్నమాట ఇక.
ఎందుకనీ?
వాడి దగ్గర ఈ మూడు నియమాలు వుంటాయి.

1. ధర్మం(స్వధర్మం)తప్పడు.
2. ‘ఇకచాలు’అంటాడు ఏదైనా సరే.
3. ‘అవసరం లేదు’అంటాడు... నువ్వు ఏదైనా చెప్పు,

‘పిపీలికాది బ్రహ్మపర్యంతము’ -అంటున్నామా? లేదా?వివేకచూడామణిలో... అంటున్నామా?ఏమి ఇవ్వబడుతాయి?
అంటే, పిపీలకము నుంచీ బ్రహ్మపదవి వరకూ...

కాబట్టి పిపిలికాది బ్రహ్మపర్యంతమూ నీకు గనుక ఇవ్వబడినప్పటికీ... నువ్వు ఏమన్నావు?

‘అవసరం లేదు’. నాకెందుకు?
పిపీలికాది బ్రహ్మపర్యంతము నీకు ఎక్కడో ఒకచోట అవసరం వుంది అనే భావన వుందనుకోండి, మళ్ళా పుట్టాల్సిందే. మళ్ళా శరీరం ధరించవలసిందే.

కాబట్టి, తీవ్రవైరాగ్య సంపన్నుడు,తీవ్రమోక్షేచ్ఛ కలిగినటువంటి వాడు,ఆత్మనిష్ఠుడైనటువంటి వాడు... ఈ మూడు నియమాలను కలిగి వుంటాడు.
ఏమిటి?
“స్వధర్మే నిధనం శ్రేయః” - కేవలం స్వధర్మాన్నే పాటిస్తాడు.
మిగిలిన ఏ పాత్రోచిత ధర్మాలను నేను పాటించను. నాకు అవసరం లేదు.
ఎందుకని?

ఇకచాలయ్యా! చాలాకాలం ఆడాను... పాత్రోచిత ధర్మాలు. ఆట ఎంతోకాలం ఆడాను, ఎన్నో లక్షల జన్మల్లో ఆడాను. నాకంటవు ఇక. నేను ఎదిగాను. పాత్రచేత నేను ప్రభావితం కావడం లేదు. నాకు పాత్రోచిత ధర్మాలు లేవు.

కృష్ణ పరమాత్మ ఏం చేశాడు?తను అందరికీ బంధువేగా? యుద్ధంలో ఏం చేశాడు?
వరుసబెట్టి వేసేశాడు.
మరి ఇప్పుడు బంధువేగా? ఎలా వేశాడు?

నాకు పాత్రోచిత ధర్మాలేమిటి? నేను పరమాత్మను.
కాల ధర్మాన్ని పోషించడమే నా ధర్మం. నా ‘స్వధర్మం’ అది.

“కాలోస్మి లోకక్షయ కృత్ ప్రవృద్ధో
లోకాన్ సమాహర్తుమి హ ప్రవృత్తః
ఋతేపిత్వా నభవిష్యంతి సర్వే(అంటున్నాడా?లేదా?)
ఏవస్థితాః ప్రత్యనీకేషుయోధా” (గీత 11-32)

ఏమని చెబుతున్నాడు?
కాలంలో సమస్తలోకాలు పుడుతున్నాయి. పోషించబడుతున్నాయి. లయించ బడుతున్నాయి. పరమాత్మ కాలాతీతుడు. నేను బావా, నేను మరదలు, నేను మరిది, నేను అన్నయ్యా, నేను తమ్ముడు, నేను భర్త,నేను భార్యా... అవేవీ నాకు లేవు.

అర్జునుడు: బావా! ద్వారక మునిగిపోతుంది.
శ్రీకృష్ణుడు: సమయం అయిపోయింది.

ఒక్కటే మాట చెప్పాడు, సమయం అయిపోయింది అన్నాడు.
అర్జునుడు అన్నాడు: ‘ద్వారక మునిగిపోతుంది’.
‘Time అయిపోయిందయ్యా’! అర్థమైందా?
అంతేగాని పరమాత్మ ఎక్కడా వలవలా ఎడవలా.

ఏ సంఘటనలోనూ కన్నీళ్ళు పెట్టలేదు. కారణం?
‘ఇకచాలు’. ఆట చాలాసార్లు ఆడాను.
ఇప్పుడు పరమాత్మగా ఆడుతా.
కాలాతీతంగా ఆడుతా.
దేశకాలములకు అతీతంగా ఆడుతా.
ఆత్మనిష్ఠుడనై ఆడుతా.
బ్రహ్మనిష్ఠుడనై ఆడుతా.
పరబ్రహ్మ నిర్ణయంతో ఆడుతా…!! అప్పుడేమయ్యింది?
“పిల్లలాటల పోలికాయెను”.
ఆటలో ఆసక్తి వుంది.
పెద్దవాళ్ళు పిల్లల ఆటను ఎలా చూస్తున్నారు?
అలా చూస్తా! సృష్టి స్థితి లయాలను.
అప్పుడేమయ్యావు?

హరిదాసు అంటె పరమాత్మతో సమానం


శ్రీ మహవిష్ణువుకు ప్రతినిధులు హరిదాసులు  హరిదాసుల అక్షయ పాత్రలో బియ్యం పోస్తే మన తెలిసి తెలియక చేసిన ఎన్నో పాపలు తోలగిపోతాయి 

హరిదాసు అనగా పరమాత్మతో సమానం మనుషులు ఇచ్చే ధానధార్మలు అందుకోని వారికి ఆయురారోగ్యాలు భోగభాగ్యలు కలగలని దివించెవారు హరిదాసులు 

నెలరోజులు పాటు హరినామన్ని గానం చేసినందుకు చివరి రోజున స్వయంపాకానికి అందరు ఇచ్చే ధన,ధాన్య , వస్తు దానాలను స్వికరిస్తారు 

సూర్యభగవానుడు ప్రసాదించిన అక్షయ పాత్ర వారి శిరస్సుపై ధరించి పంచలోహ పాత్రగా బావిస్తారు 

ధనుర్మాసం నెలరోజులు సూర్యోదయానికి ముందే శ్రీకృష్ణ గోదాదేవిని స్మరించి, తిరుప్పావై పఠించి, అక్షయ పాత్రను ధరించి హరిదాసులు గ్రామ సంచారం ప్రారంభిస్తారు. 

ఇంటికి తిరిగి వెళ్లే వరకు హరినామ సంకీర్తన తప్ప మరేమి మాట్లాడరు. అక్షయపాత్రను దించరు. ఇంటికి వెళ్ళాక ఇల్లాలు ఆ హరిదాసు పాదాలు కడిగి, అక్షయపాత్రను దించుతుంది.  
శ్రీకృష్ణునికి మరోరూపం హరిదాసులని అంటారు పెద్దలు. గొబ్బెమ్మలను ఇంటి ముందు చక్కగా అలంకరించి, హరినామ స్మరణ చేసే వారిని అనుగ్రహించడానికి హరిదాసు రూపం వైకుంఠపురం నుండి శ్రీమహావిష్ణువు వస్తాడన్నది ఒక నమ్మకం. 

హరిదాసు పేద, ధనిక భేదం లేకుండా అందరి ఇంటికి వెళ్తాడు. ఎవరి ఇంటి ముందు ఆగడు. 

శ్రీమద్రమారమణ గోవిందో హరీ అంటూ.. ఇంటి ముందు ముగ్గు చుట్టూ ఒకసారి తిరుగుతాడు. గుమ్మంలో ఎవరూ లేకపోతే మరో ఇంటికి వెళ్తాడు. హరిదాసు ఉట్టి చేతులతో వెళ్ళిపోతే ఐ ఇంటికి అరిష్టమంటారు పెద్దలు. 
అందుకే గ్రామాలో హరిదాసుడు వస్తున్నాడంటే ఇంటి యజమానులు గుమ్మలలో ధాన్యంతో సిద్ధంగా ఉంటారు. అక్షయపాత్రలో బియ్యం పోయడాన్ని శ్రీమహా విష్ణువుకు కానుకగా బహుకరించినట్లుగా భక్తులు భావిస్తారు.

హరిదాసు తల మీద గుండ్రటి రాగి పాత్రను భూమికి సంకేతంగా శ్రీమహావిష్ణువు పెట్టాడనే కథ కూడా ప్రచారంలో ఉంది.

హరిదాసు వస్తే ఎన్ని పనులు ఉన్న ఇంటి ముందుకు వచ్చి అక్షయ పాత్రలో బియ్యం పోయండి. 

అహోబిల క్షేత్రము- నరసింహ స్వామి

హిరణ్య కశిపుడు తపస్సుకి వెళ్ళినప్పుడు నారదుని ఆశ్రమములో లీలవతికి కుమారుడు కలిగాడు. ప్రహ్లాదుడు అని పేరు పెట్టారు. ఇతరులు సంతోషిస్తే సంతోషించే వాడు ప్రహ్లాదుడు. తనకి ఉన్నది ఒకరికి పెట్టి వారు సంతోషిస్తే ప్రహ్లాదుడు సంతోషిస్తాడు. 

ఒకడు ఏడిస్తే చూచిసంతోషించి తానే అనుభవించి సంతోషిస్తాడు హిరణ్యకశిపుడు. లోకములో ఒక ధర్మము ఉన్నది. మంచి కొడుకు పుట్టాలి అంటే పుణ్యము చేసిన వాడి కడుపున పుడతాడా? పాపము చేసిన వాడి కడుపున పుడతాడా? 

అటువంటి వాడి కడుపున పుట్టడానికి ప్రహ్లాదుడు చేసిన పాపము ఏమిటి? ? అటువంటి కొడుకు పుట్టడానికి హిరణ్యకశిపుడు చేసుకున్న పుణ్యము ఏమిటి? అన్న ప్రశ్న వస్తుంది కదా? భాగవతములోనే దీనికి జవాబు చెప్పారు. పుట్టుకతో నారదుని ఆశ్రయము లభించి అంత గొప్ప భక్తి తత్పరుడు కావడానికి కారణము ఎక్కడ ఉన్నది అంటే ప్రహ్లాదుని గత జన్మలలో సత్సంగము ఉన్నది. 

ఏది ఉన్న లేకపోయినా సత్పురుషులతో కలసి ఉండి వారితో తిరిగి వారిని సేవించాడు. మనము ఎంత ధర్మము ఆచరించాము అన్నది పక్కన పెడితే సత్పురుషులతో కలసి ఉంటే చాలు ఈశ్వర అనుగ్రహము కలుగుతుంది. ఆయనతో మనము ఉన్నామన్నది ముఖ్యము కాదు. ఆయన మనను గుర్తుపట్టి పేరు పెట్టి పిలిచి పక్కన కూర్చోపెట్టుకోగలడా? ఏ కారణమునకైనా అలా ఉంచుకోగలిగితే వాడు ఉత్తర జన్మలలో మహాభక్తుడైపోతాడు. సత్సంగమే ప్రహ్లాదుడు అంతటి భక్తుడిగా పుట్టడానికి కారణము.

అహోబిల క్షేత్రములో నవనారసింహమై తొమ్మిదిమంది నరసింహులుగా ఉన్నాడు. 

1. జ్వాలానరసింహుడు -- ఆయనే ఉగ్ర నరసింహ స్వరూపము. మొదటగా వచ్చిన తేజో స్వరూపము. హిరణ్యకశిపుని పొట్ట చీలుస్తున్న స్వరూపములో ఉంటాడు. 

2. అహోబిలనరసింహస్వరూపము -- హిరణ్యకశిపుని సంహరించిన తరవాత కూర్చున్న స్వరూపము.

3. మాలోల నరసింహుడు -- లక్ష్మీదేవి చెంచు లక్ష్మిగా వస్తే ఆమెని స్వీకరించి ఎడమ తొడ మీద కూర్చో పెట్టుకున్న స్వరూపము. 

4. కరంజ నరసింహుడు అని నాలగవ నరసింహుడు. ఆయన చెట్టుకింద ధ్యాన ముద్రలో ఉంటాడు.

5. పావన నరసింహుడు -- ఆయన దగ్గరకు వెళ్ళి ఒక్కసారి నమస్కారము చేస్తే ఎన్ని పాపములనైనా తీసేస్తాడు. మంగళములను ఇస్తాడు. అందుకని ఆయనని పావన నరసింహుడు అనిపిలుస్తారు.

6. యోగ నరసింహుడు అంటారు. అయ్యప్పస్వామి ఎలా కూర్చుంటారో అలా యోగపట్టముకట్టుకుని యోగముద్రలో కూర్చుంటాడు. ఇప్పటికి అక్కడకి దేవతలు కూడా వచ్చి ధ్యానము చేస్తారు అని చెపుతారు. 

7. చత్రవట నరసింహస్వరుపము అంటారు. పెద్ద రావి చెట్టుకింద వీరాసనము వేసుకుని కూర్చుంటాడు. అక్కడకి హూ హ, హా హా అని ఇద్దరు గంధర్వులు శాపవిమోచనము కొరకు నరసింహస్వామి వద్దకి వచ్చి పాటలు పాడి నృత్యము చేసారు. ఆయన తొడమీద చెయ్యి వేసుకుని తాళము వేస్తూ కూర్చున్నారు. ఆ కూర్చున్న స్వరూపమును చత్రవట నరసింహస్వరూపము అంటారు అక్కడకు వెళ్ళి కొంతమంది పెద్దలు సంగీతము పాడుతుంటారు. 

8. భార్గవ నరసింహుడు పరశురాముడు నరసింహ దర్శనము చెయ్యాలని కోరుకుంటే అనుగ్రహించి దర్శనము ఇచ్చిన స్వరూపము

9. వరాహ నరసింహస్వరూపము భూమిని తన దంష్ట్రమీద పెట్టుకుని పైకి ఎత్తినటువంటి స్వరూపము ఆదివరాహస్వామి పక్కన వెలసిన నరసింహస్వరూపము మొదటగా వచ్చిన యజ్ఞ వరాహస్వరూపము, నరసింహ స్వరూపము రెండు ఉంటాయి వరాహ నరసింహము. తొమ్మిది నరసింహస్వరూపములు అహోబలక్షేత్రములో ఉంటాయి.