Monday, April 13, 2020

పిల్లలపెంపకం విషయంలో రామాయణం ఏం చెపుతున్నది?


    శ్రీరాముడు సీతాదేవి నగలను లక్ష్మణుడికి చూపించి ఇవి మీ వొదిన కేయూరాలే గద !   ఒక్కసారి నువ్వు కూడా గురుతు పట్టు అంటే అప్పుడు లక్ష్మణస్వామి అంటారు కదా .......

 *నాహం జానామి కేయూరే   నాహం జానామి కుండలే*             
*నూపురే త్యభి జానామి నిత్యం పాదాభివందనాత్* 

           దీనర్థం ఏమిటంటే ఓ అన్నా! వొదినగారు భుజానికి పెట్టుకునే  కేయూరాలు గానీ గానీ, చెవులకు పెట్టుకునే కుండలాలు గాని నే నెరుగను, కానీ  ఆవిడ పాదాలకు పెట్టుకునే నూపురాలను మాత్రం గుర్తు పట్టగలను. ఎందుకంటే ఆ తల్లి పాదాలకు నిత్యం నమస్కారం చేస్తాను కాబట్టి .
పరస్త్రీని కన్నులెత్తి చూడని సంస్కారం! 
అసలు ఆడువారి ముఖంలో ముఖంపెట్టి కళ్ళలోకి సూటిగా చూస్తూ ఎందుకు మాట్లాడాలి ?
ఈ విధమైన శీల సంపద లక్ష్మణుడికి ఎక్కడ నుండి వచ్చింది ? తల్లి సుమిత్రాదేవి పెంపకం!! 

   రాముడితో అడవికి వెళ్ళేటప్పుడు ఆ మహాతల్లి కొడుకుకు ఏమని చెపుతుందో తెలుసా?

 *రామం దశరథం విధ్ధి,  మాం విధ్ధి జనకాత్మజాం,*
*అయోధ్యాం అటవీం విధ్ధి  గచ్ఛ తాత! యథా సుఖం*

 *రాముణ్ణి దశరథుడనుకో, సీతను నన్ననుకో*
*అడవిని అయోధ్య అనుకో   హాయిగా వెళ్ళిరా నాన్నా!*
   ఇంత సంస్కారమున్న తల్లి పెంచింది కాబట్టే,   లక్ష్మణుడు అంత శీలవంతుడయ్యాడు; చీర తొలగి మత్తులో ఉన్న తారతో మాట్లాడవలసి వచ్చి నప్పుడు తల వంచుకుని మాట్లాడిన అద్భుత శీల సౌందర్యం లక్ష్మణస్వామిది !

నేడు ప్రతి తల్లీ తెలుసుకో వలసిన సత్యం ఇది కాదా?
పిల్లలను ఈ విధంగా పెంచితే దేశంలో ఏ ఆడబిడ్డయినా ఎందుకు బాధపడుతుంది? 
నిర్భయ లాంటి ఘటనలు ఎందుకు చోటు చేసు కుంటాయి? ప్రియాంక రెడ్డి లాంటి భవిష్యత్తు ఉన్న బంగారుతల్లుల జీవితాలు ఎందుకు చిదిమి వేయబడతాయి ?

  రామాయణం, రామకథలు విరివిగా ప్రచారం చేయండి ! పరస్త్రీని ఇష్టం లేకుండా చెరబడితే దండన ఏదో, స్త్రీలతో ఎలా మెలగాలో అన్నీ తెలుస్తాయి.

No comments:

Post a Comment