Tuesday, June 30, 2020

పాషండుడా నీదెంత పాషాణ హృదయం.

(1) కల్లుపెంట అనగా ?

(A) కల్లు అమ్మెడి చోటు
(B) కల్లు తీసేసమయంలో కల్లు నుండి వేరుచేసిన చెత్త
(C) కల్లు అంటేరాయి,పెంట అంటే కుప్ప కాబట్టి కల్లుపెంట అంటే రాళ్ళకుప్ప
(D) కణేకల్లు, గుంతకల్లు, నకిరేకల్లులాగా ఇదో ఊరు

(2) తెరువరి అనగా ?

(A) పాదాచారుడు
(B) దారి కానక తిరిగేవాడు
(c) ఉపాయాలు చెప్పేలాడు
(D) దారిదోపిడిలు చేసే దొంగ

(3) పంబ అంటే ?

(A) పంబ రేగిపోతోంది అంటాం కదా ! పంబ అంటే ఓ చర్మవాయిద్యం.కొట్టినపుడు రేగిపోతుంది.
(B) బాన కడవ కుండలాగా పంబ అంటే ఓ కుమ్మరిచేసిన మట్టి పాత్ర
(C) శ్రీకాకుళం జిల్లాలో ఒకనది (కేరళలో కూడా పవిత్రమైన నది పంబ )
(D) పంబ అంటే దుమ్ము, అందుకే పంబ రేగిందంటారు

(4) పాషండుడు అనగా ?

(A) రాయిలాగా కఠిన హృదయం కలవాడు.
(B) పాషాణం ఒక విషం , పాషాణం ద్వారా విషప్రయోగం చేయువాడు
(C) పాషండమనేది ఒక మతం, వేదాలను తృణికరించింది
(D) పాషండమంటే అత్యంత కఠినమైన గదాయుద్ధం

(5) ముచ్చే బంగారమంటే ?

(A) బంగారు జాతులలో హీనమైనది.కల్తీ బంగారు
(B) కాకిబంగారం
(C) వడ్లలో(బియ్యంలో ) ఒక ప్రాచీనరకం
(D)  ముచ్చు వారిచే దొంగలింపబడిన బంగారం.

(6) శూన్యవాద సిద్ధాంతకర్త

(A) ఆదిశంకరుడు
(B) మధ్వావాచార్యుడు
(c) కుందకుందనాచార్యుడు (జైనుడు, జంబూద్వీపం ఉన్నగ్రామం ఇతని పేరు మీదుగానే ఏర్పడింది)
( D)  ఆచార్య నాగార్జునుడు
 
(7) మాయావాద సిద్ధాంతకర్త ?

(A) 12వ శతాబ్దంలో మంత్రతంత్రాలు నేర్చిన  కాశీపురవాసి జంబీరుడు
(B) ఆదిశంకరుడు
(C) బౌద్ధమతంలో తాంత్రికవిద్యను ప్రవేశపెట్టిన లీలామాలుడు
(D) మధురరాజు విజయరాఘవుని ఆస్థాన పురోహితుడు తాడంకి వెంకన్న

(8) సమాధి (ఒలికిలి) నుండి శవాలను బయటకు తీసి అంగాంగ పరీక్షలు చేసిందెవరు ?

(A) శుశ్రుతుని శిష్యులు
(B) ఇప్పటికి 2500 సం|| క్రిందటి భిషగర్వులు (భిషగర్వులంటే వైద్యులు)
(C) అఘోరాలు (శివశక్తి ఆరాధకులు, స్మశానంలో తిరిగారు, శవంపై కూర్చున్నారు, కపాలంలో తిన్నారు)
(D) టిబెట్టు నుండి శ్రీపర్వత విశ్వ విద్యాలయంలో విద్య నేర్చుకొన్న లామాలు. శ్రీపర్వతమంటే నాగార్జున కొండ)

(9) గోసాయి అంటే ?

(A) గోవుల రక్షణాధికారి
(B) గోవులను కాచేవాడు
(C) శైవ సన్యాసి
(D) వైష్ణవ సన్యాసి

(10) భారత ముస్లీం తత్వవేత్తల నుండి జనించిన సూఫితత్వం

(A)  ముస్లీంలు కాని వారిపై విధించిన జిజియాపన్నును తిరస్కరించింది
(B) హింసాత్మక మార్గాన్ని తిరస్కరించింది
(C) హిందువులను అవమానించరాదని ఆదరించాలని చెప్పింది.
(D) అన్ని మతాలసారం ఒకటేనని చెప్పింది.

Be thankful. Be patient

A movie theater announced that an 8-minute movie won the title of Best Short Film in the World ...

So, it was decided to display this movie in the cinema for free, so that the largest crowd could gather to watch it ...
 
    The movie began with a snapshot of a room ceiling that is devoid of any decoration and of any details;  Just a white ceiling ...

    3 minutes passed without the camera moving and it did not move to any other scene, or any other part of the ceiling in the same room ...

    Another 3 minutes passed without the camera moving and without changing the scene ...

    After 6 boring minutes, the viewers started grumbling;  Some of them were about to leave the theater hall;  And some of them objected to the officials of the house because they wasted their time watching a ceiling ...

    Suddenly, before the majority became concerned and starting to leave, the camera lens slowly moved on a wall without any details as well until it reached down towards the floor, there a child appeared on a bed, who seems to be totally handicapped due to the spinal cord tare in his little body ...

    The camera slowly moved to the side of the handicap bed, showing a wheelchair without a back ...

    The camera moved to the boredom location of the ceiling again;  To show a sentence: *"We showed you only 8 minutes of this child's daily activity, only 8 minutes from the scene that this handicapped child watches at all hours of his life, and you complained and weren’t patient for only six minutes, you couldn't bear to watch it ..!* ...
   
    So know the value of every second of your life that you spend in wellness, and thank your Lord for every blessing bestowed on you, and you will not feel its existence unless you lose it ...

    We suffer from quarantine and the curfew, which is, God willing, for a limited time, and we do not know that there are millions who lived their entire lives in quarantine ...

    Covid-19 has forced us to have the time to think about many privileges , and we thank God for the blessing of the freedom of movement and out of the house to see life, breathe the air, and practice activity in its various colors ...

Thank God and have gratitude for being blessed with all that, which we have not realized... in many occassions.
Lead life counting the blessings but not the problems or troubles or challenges.

Life is a One Time Opportunity.. Daily one more time.. Every day to think better, feel better and do better.

May god bless you in abundance.

Sunday, June 28, 2020

శ్రీమన్నారాయణ వృత్తాంతము - 5

🌻. తమ భక్తులను రక్షించు నాగులను చంపుటకు ప్రయత్నించిన వారికి శ్రీపాదుల వారి గుణపాఠము.

నాగులచవితినాడు మా గ్రామమునకు మంత్రగాడు ఒకడు వచ్చియుండెను. 

ఆ మంత్రగానిని మా దాయాదులునూ, గ్రామపెద్దయు సాదరముగా ఆహ్వానించిరి. అతడు ఎంతటి విషసర్పమునయిననూ తన మంత్రశక్తితో స్తంభింపజేసి వశమొనరించుకోగలగినవాడు. పాము కరచిన ఏ వ్యక్తిని అయినా తన మంత్రశక్తితో జీవింపజేయగలగినవాడు. అతనిచేతిలో గరుడరేఖ కూడా యుండెను. 

గరుడరేఖ కలిగిన మానవులకు సర్పములు స్వాధీనములగునని శాస్త్రవచనము. ఆ సర్పములను హతమార్చవలెనని గ్రామపెద్దయు, మంత్రగాడును తలపోయుచుండిరి.

పుట్టకు దరిదాపులలోనున్న ప్రాంతమంతయునూ మంటలు ఏర్పాటు చేయబడెను. మంత్రగాడు తన ఆసనమునందు కూర్చొని వింత వింత పద్ధతులతో తంత్రములనుచేయుచూ మంత్రములను బిగ్గరగా చదువుచుండెను. 

జాతి సర్పములను వధింపబూనుట పాపహేతువని మేము బాధపడుచుంటిమి. మేము నిస్సహాయస్థితిలో నుంటిమి. అమాయకములయిన జాతిసర్పములను ఆ శ్రీపాదుల వారే రక్షింపవలెనని ప్రార్థించుచుంటిమి. 

మంత్రశక్తికి లోబడినవో అనునట్లు ఆ సర్పములు పుట్టనుండి బయటకు వచ్చినవి. మంత్రగానికిని, వాని అనుచరులకునూ యిదిఎంతయో సంతసము కూర్చుచుండెను. అయిననూ వారికి ఆ సంతసము ఎక్కువసేపు నిలువలేదు. 

బయటకు వచ్చిన సర్పములు క్షణక్షణమునూ ఆకారములో పెద్దవగుచుండెను. మంత్రగాడు బిగ్గరగా మంత్రములు చదువుచుండెను. మంత్రశక్తికి లోబడినవో అన్నట్లు ఆ సర్పములు అగ్నికీలలవైపు పయనించుచుండెను. 

ఆశ్చర్యము! అగ్నిదేవుడు వాటికి దారి విడిచెనో అన్నట్లు అవి వచ్చు మార్గము నందు మాత్రము అగ్ని చల్లారుచుండెను.తుదకు అగ్ని అంతయునూ ఆరిపోయెను. ఆ సర్పరాజములు యధేచ్చగా అచ్చటనుండి వెడలిపోయెను. మంత్రగాడును, అతని అనుచరులునూ బిత్తరపోయిరి.

ఇంతలో గ్రామపెద్ద పెద్దకుమారునికి పాము కరచిన వానికుండు లక్షణములు కన్పింపసాగెను. రెండవ కుమారుని నేత్రములకు చూపు బాగుగా తగ్గిపోయెను. 

పాము కరవకుండగనే సర్పదష్టునకుండు లక్షణములు ప్రాప్తించి శరీరము విషపూరిత  మగుట విడ్డూరము. ఉన్నట్టుండి అంధత్వము ప్రాప్తించుటయూ విడ్డూరమే! మంత్రగాడు మంత్రములనెన్నింటినో పఠించెను. కాని ఫలితము లభింపలేదు. 

అతని చేతిలోని గరుడరేఖ క్రమక్రమముగా తన ఆకారమును కోల్పోయి పూర్తిగా అదృశ్యమాయెను. గ్రామపెద్ద మనసులో మహాభయము తోచెను. అనాధ రక్షకుడగు శ్రీపాదుడు తప్ప వేరేవ్వరునూ దిక్కులేరు. మంత్రగానిలో మంత్రశక్తి పూర్తిగా క్షీణించెను. కొద్ది నిముషములలో అతడు విగతజీవుడాయెను. 

శ్రీపాదుల వారి లీల ఏ సమయములో ఎట్లుండునో ఎవరికెరుక? గ్రామపెద్ద మా వద్దకు పరుగెత్తుకొని వచ్చి గోలుగోలున ఏడువసాగెను. మేము మాత్రము ఏమి చేయగలము? అనన్యచింతతో శ్రీపాదుల వారిని స్మరించిన యెడల నీ యిద్దరు కుమారులును స్వస్థత పొందగలరని మాత్రము చెప్పితిమి.

మాంత్రికుని కళేబరము గ్రామపెద్ద యింటివద్ద నుండెను. గ్రామపెద్ద కుమారులు యిద్దరునూ విధి వైపరీత్యమునకు లోనయిరి. మా దాయాదులు భయముతో వణకిపోసాగిరి. వాతావరణమంతయునూ విషాద భరితముగా నుండెను. 

చనిపోయిన మాంత్రికుని శవమును స్మశానమునకు  తీసుకొనిపోయిరి. కట్టెలు పేర్చబడి చితికి నిప్పంటించబడెను. నిప్పంటించిన శవాములో ఆకస్మాత్తుగా చైతన్యము కలిగెను. శవము తనను అగ్నిబాధ నుండి రక్షించమని కేకలు వేయుచుండెను. 

కాటికాపరివాండ్రు  చనిపోయిన మాంత్రికుడు దయ్యమై తిరిగి శరీరములో ప్రవేశించినాడనియు, వానిని రక్షించినచో యిదే శరీరముతో అతడు ప్రేతార్మ చేయు దుష్ట కార్యములన్నియునూ చేయుననియూ, అతని శవము కాలి బూడిద అయిన యెడల కేవలం ప్రేతాత్మ గానే యుండి తనకి వశమైయుండెడి వారి దేహములందు ప్రవేశించి కొంతమందిని బాధించుననియూ, అందుచేత శవమునకు నీళ్లుపోయు ప్రయత్నమును మానుకొనిరి. 

విగతజీవుడై ఉపాధిరహితుడుగా నున్న ప్రేతాత్మకంటే సజీవుడై తన స్వంత ఉపాదిలోనే ప్రవేశించెడి ప్రేతాత్మ ఎక్కువ శక్తులని కలిగియుండి సమాజమునకు విశేష వినాశనమును, దుఃఖములను కలిగించి తీరుననియు వారు తలపోసిరి. 

ప్రారబ్ధానుసారముగా ఆయా వ్యక్తుల మానసములందు ఆయా భావములను కలిగించి ఆయా కర్మఫలములను అనుభవింపజేసి ప్రత్యక్షముగా తన అవతారతత్త్వము యొక్క నిజస్వరూపమును బోధపరచుట శ్రీపాద శ్రీవల్లభుల వారి విచిత్ర విధానము. 

చెరువును ఎలా నిర్మించాలో చెప్పిన పోరుమామిళ్ళ శాసనం.

చెరువును త్రవ్వించడం ఓ పుణ్యకార్యంగా మనపూర్వీకులు భావించారు. పుణ్యకార్యమేకాదు అదో ప్రజాహిత కార్యక్రమం. అందుకే దక్షిణాపథంలో మనరాజులు చక్రవర్తులు సామంతులు దండనాయకులు చివరకు సామాన్యుడు కూడా చెరువులను నిర్మించి తమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశారు.

ఈనాడైతే మనవద్ద ఆధునిక శాస్త్రపరిజ్ఞానం అత్యంత సాంకేతిక పనిముట్లు యంత్రాలున్నాయి.కనుక జలాశయ నిర్మాణాలు సులభంగా చేపట్టగలుగుతున్నాము.

ఇప్పటికి 2300 సంవత్సరాల క్రిందటనే మనవారు ఉత్తమోత్తమ పరిజ్ఞానంతో చెరువులు నిర్మించారు.ఉదాll సుదర్శన తటాకాన్ని మౌర్యబిందుసారుడి కాలంలో పుష్యగుప్తుడు అనేవాడు గుజరాతులో నిర్మించాడు. ఈ తటాకం తెగిపోతే  శకరాజు రుద్రదమనుడు మరమ్మత్తు చేసాడు. ఈ తటాకగొప్పతనాన్ని జునాఘడ్ శాసనంలో రుద్రదమణుడు పెర్కొన్నాడు.

అలాగే ఇప్పటికి 1800 సం|| క్రిందట కరికాలచోళుడు కావేరినదిపై నిర్మించిన కల్లాడై / కల్లానై ఆనకట్ట ఈనాటికి చెక్కుచెదరలేదు. సింధు నాగరికతలోని నీటిపారుదల వ్యవస్థ మనకు తెలిసిందే.

భాస్కరభావదుర అనే యువరాజు విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన ఒకటవ హరిహరరాయలకుగల ఐదుమంది సంతానంలో ఒక్కడు. నెల్లూరుజిల్లాలోని ఉదయగిరిని కేంద్రంగా ఓ రాష్ట్రాన్ని పాలించేవాడు.

ఇతను శాలివాహనశకం 1291 లో అనగా 1369లో కడపజిల్లా పోరుమామిళ్ళలో చెరువును త్రవ్వించి చెరువు నిర్మాణం ఎలా వుండాలో అక్కడే ఓ శాసనం చెక్కించాడు. మంచి తటాకాన్ని నిర్మించాలంటే పన్నెండు అంగాలు సాధనాలు వుండాలి. అవి

(1)  చెరువును నిర్మించే వ్యక్తి సంపన్నుడు, ఆనందితుడు సచ్ఛీలుడైవుండాలి.

(2) పాత:శాస్త్ర ప్రవీణులుండాలి. పాత: శాస్త్రమంటే చెరువును త్రవ్వే కళ.

(3) చెరువు నిర్మాణానికి కఠినమైన, దృఢమైన నేలను ఎన్నుకోవాలి.

(4) మూడుయోజనాల దూరం లోపల చెరువుకు నీటిని అందించే  వాగులు వంకలు కాలువలు నదులు ఉండాలి.

(5) చెరువుకట్టకు అటువైపు ఇటువైపు కొండగుట్టలుండాలి.

(6)  చెరువుకట్ట కట్టడాన్ని మరి పొడుగుగా కట్టరాదు. (అలా కట్టవలసిన పరిస్థితులు ఎదురై మధ్యలో కూడా ఒక మరవను (అలుగు) ను ఏర్పాటుచేయాలి)

(7) అటువైపు ఇటువైపున్న కొండగుట్టలు మెత్తగా మృదువుగా ఉండక దృఢంగా ఉండాలి.

(8) చెరువుగర్భం (మధ్యభాగం) లోతుగా వుండెట్టుగా చూచుకోవాలి.

(9) చెరువు నిర్మాణానికి  కఠినమైన రాళ్ళు ఉపయోగించాలి.

(10) చెరువుతూములనుండి పారే నీరు పల్లపు ప్రదేశానికి వెళ్ళేవిధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. పంటలకు అనువైన సారవంతమైన నేలలు ఉండాలి.

(11) చెరువులో బలమైన అలలు సుడులు వగైరాలు వస్తే వాటిని కొండగుట్టలు అడ్డుకొనేలా ఉండాలి.

(12) తటాకనిర్మాణానికి సిద్ధహస్తులు నిపుణులైన పని వారు పనిముట్లు ఉండాలి.

చెరువు నిర్మాణానికి  అనువుకాని పరిస్థితులను కూడా పోరుమామిళ్ళ శాసనం పెర్కొంది.

(1) చెరువుకట్ట నుండి నీరు ఊరరాదు, ఉబకరాదు.

(2) చౌడు, ఉప్పునీటి నేలలు చెరువు నిర్మాణానికి పనికిరావు.

(3) రెండు రాజ్యాల మధ్య తటస్థంగా వున్నచోటు చెరువు నిర్మాణానికి పనికిరాదు.(ఎందుకంటే జలకలహాలు వస్తాయి. యుద్ధసమయంలో చెరువునీటిని విషపూరితం చేస్తారు.)

(4) చెరువుమధ్య భాగం ఉబ్బుగా (మెరక / ఎత్తు ) ఉండరాదు.

(5) సాగుభూమి చెరువులోని నీటిపరిమాణం ప్రకారమే సరిగా వుండాలి. చెరువు నీరు తక్కువగా వుండి సాగునేల ఎక్కువగా వుండరాదు.

(6) చెరువులో నీరు పుష్కలంగా ఉండి సాగుభూమి తక్కువగా వుండరాదు.

ఈ సూత్రాలు అప్పటికేకాక ఇప్పటికి కూడా అనుసరణీయమే.

ప్రశ్నలు...

(1) మనదేశంలో చెరువులు  అధికంగావున్న రాష్ట్రమేది ?

(2) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోగల పెద్దచెరువు ఏది ?

ఒక నాన్న కు తన‌ కూతురే బంగారం

ఒక నాన్న కు తన‌ కూతురే బంగారం 💛 ...✍🏻
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
అలాంటి నాన్న‍ తన కూతురు  ను గుండెళ్ళే పెట్టుకుంటాడు,
భుజాలపై‌ ఎక్కించుకుంటాడు, తన హృదయం పైన‌ నడిపించుకుంటూ‌ తన‌ పాదాలకు చెప్పులౌతాడు,
తన బంగారు ‌భవిష్యత్తు గురించి ఎవరూ కనని కలలు కంటాడు, కంటికి రెప్పలా కాపాడుకుంటాడు....
అలాంటి తండ్రి ఒకటి అడిగితే రెండు కొనిస్తాడు
రెండు అడిగితే నాలుగు కొనిస్తాడు

యుక్త వయసుకు రాగానే తన ఉన్నత చదివుల కొరకు  రాత్రింబవళ్ళు కష్టపడుతాడు తన బాధ కష్టం కనబడకుండా గుండె లోనే దాచుకుంటాడు...

ఒక మంచి జీవిత భాగస్వామికొరకు వెతుకుతునే ఉంటాడు
కూతురు సుఖం సంతోషం కొరకు దేనికైనా సిద్దపడుతాడు...
తను కోరుకున్నది జరిగితే ఈ ప్రపంచాన్నే జయించినంతగా సంబరపడుతాడు

కాని ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ ఉన్న‌ యువత స్వేచ్చ స్వతంత్ర్యం  పేరు సొంత నిర్ణయాలతో తల్లిదండ్రులను ఎదిరిస్తున్నారు...

తమ తల్లిదండ్రులకు ఏమీ తెలియదని కించపరుస్తున్నారు..
పెళ్ళి వయస్సు కు రాగానే ఎవరో ముక్కు మొఖం తెలియని వారికి కట్టబెడుతున్నారని అంటున్నారు...

నిజంగా ఏ తల్లిదండ్రులు అంత నీచంగాఆలోచించరు .. పెళ్ళంటే నూరేళ్ళ పంటగా భావిస్తారు.. అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలను తల్లిదండ్రులు పరిశీలిస్తారు..
అప్పుడైనా నచ్చితేనే ఆ అమ్మాయికి కూడా ‌నచ్చితే ఒప్పుకుంటారు...

ఏ తండ్రి కూడా ‌తన కూతురు ఏమైనా‌ ఫర్వాలేదని అనుకోడు తన కూతురు ఏలాంటి కష్టాలు పడకూడదని కోరుకుంటాడు..

📌 కాని నేటి అమ్మాయి లు అలా ఆలోచించడం లేదు.
📌 పెళ్ళి వయస్సు వచ్చే వరకు తన తల్లిదండ్రులను విలన్లు గా చూస్తున్నారు.

 ప్రేమ అనే మత్తులో పడి మోసమేదో.. మోదమేదో తెలియని వయస్సులో మేము ఒకరినొకరం అర్థం చేసుకున్నాం మాది నిజమైన ప్రేమ అనే మైకంలో తల్లిదండ్రులను ఎదురిస్తున్నారు... ఐతే మీరు లేదా తల్లిదండ్రులను బలి చేస్తున్నారు..

నిజంగా మీకు అర్థం చేసుకోనే శక్తి‌ ఉంటే నీకు జన్మనిచ్చిన‌ నాటి‌ నుండి నీ కోసం తన‌ తపన అర్థమయ్యేది .. నీ గురించి కన్న కలలు అర్థం అయ్యేది.. నీ కోసం పడ్డ కష్టం అర్థం అయ్యేది..

నీ చిన్ని కాళ్ళ సరిపడే సైజు కోసం పది షాపులు తిరిగింది....
నీ పుట్టిన రోజుకి‌ నీ సరిపడే డ్రస్ కోసం తిరిగిన ఇరవై షాపులు తిరిగింది...నా కూతురు అందరికంటే ముందుండాలనే ఉబలాటం..నీవు బయటకు వెళ్ళినప్పుడు మళ్ళీ‌ వచ్చేవరకు‌ తపించే హృదయం.. అర్థం అయ్యేది

నీ బంగారు భవిష్యత్తు కొరకు ఇరవై ఏళ్ళు గా తపించే నీ తండ్రి నే‌ అర్థం చేసుకోలేని నీవు గతమేంటో భవిష్యత్తు ఏమిటో తెలియని ఒక వ్యక్తి గురించి ‌ఎలా అర్థం చేసుకుంటావు...??

 నాలుగు రోజులు ‌ఉండే నీ‌ పాదరక్షల కొరకే పది షాపులు తిరిగిన నాన్న నిండు నూరేళ్ళు జీవించే నీకు తగిన జీవిత భాగస్వామిని‌ ఇవ్వడని ఎలా అనుకొంటారు..

తన కొడుకులను ఒక డాక్టర్... ఇంజినీరింగ్..IAS, IPS చేస్తాడో లేదో కాని...తన కూతురికి మాత్రం   అలాంటి భాగస్వామిని  తేగలడు...

కూతురు ఉన్న ఏ తండ్రి యైనా ఎక్కువ గా‌ ఆలోచించేది తన కూతురు గురించే అంగ రంగ వైభవంగా కూతురు వివాహం చేయాలని ఎన్నో కలలు కంటాడు...ఆ కలలను సాకారం చేసుకోని గర్వంగా చెప్పుకోవాలనుకుంటాడు..

అలాంటి తండ్రి యొక్క కలలను భగ్నం చేయకండి

💞 ప్రేమను గెలవండి.
💞 నాన్న ను గెలిపించండి.

ప్రేమంటే...✍🏻

💜 ఇద్దరు 🧝‍♀️🧝‍♂️ మనుషులు కలవడమే కాదు.
🧡 రెండు ‌మనస్సులు 💑‌ కలవడమే కాదు.
💚 రెండు కుటుంబాలు  👨‍👩‍👧👪 కూడా ‌కలవాలి.

అదే నిజమైన ప్రేమ 💛

ఇది ప్రతి అమ్మాయి 👱🏼‍♀️‌ అర్థం చేసుకోవాలి

*ఇది ఒక తండ్రి 💁🏼‍♂️ భయం
*ఇది ఒక తల్లి 🤱 వేదన.

నేను చేస్తున్నాను

"నేను చేస్తున్నాను" అనే కర్తృత్వ భావన ఏ విధంగా ఏర్పడుతుంది ?

మన పరిధి విషయంలో అవగాహన లేకపోవటం వలన కర్తృత్వ భావన ఏర్పడుతుంది. ముక్తేశ్వరపురం (ముక్త్యాల) అనే పుణ్యక్షేత్రం కృష్ణానది ఒడ్డున ఉంది. ఆ గ్రామంలోని పిల్లలు ఊరిని అనుకొని ప్రవహించే కృష్ణానదిని తమ చిన్నతనం నుండి చూస్తుంటారు. 

కృష్ణానది అనగానే వారికి తన ఊరే గుర్తుకు వస్తుంది. వారి దృష్టిలో ముక్త్యాల ఒడ్డున ఉన్నదే కృష్ణానది అనే భావన ఉంటుంది. ఇక్కడ ఏం జరిగిందంటే కొన్ని వందల మైళ్ళు ప్రవహించే కృష్ణానదికి వారి మనసులో ఒక పరిధి ఏర్పడింది. వయసు పెరిగిన తర్వాత గాని కృష్ణానది ఒడ్డున ఉన్న అనేక గ్రామాల్లో తమ గ్రామం ఒకటన్న విషయం అర్థమవుతుంది. మనలో కర్తృత్వ భావన కూడా అలాగే ఏర్పడుతుంది.

 చైతన్యశక్తి అనంతంగా నిండి ఉంది. ఆ చైతన్యశక్తికి దేహం అనే పరిధి ఏర్పడింది. ఆ కారణంగానే ప్రతీదీ "నేను చేస్తున్నాను" అనే కర్తృత్వ భావన ఏర్పడటానికి కారణమైంది. అదే మన సుఖదుఃఖాలకు దారితీస్తుంది !

Saturday, June 27, 2020

అగ్ని అమ్మవారు దీపం


సృష్టి మొత్తం ఆమె నుండి ఏర్పడినప్పుడు పంచభూతాలు, పంచతత్వాలు, పంచప్రణవాలు అన్ని ఆ తల్లి రూపమే, అలా అగ్ని రూపంలో అమ్మవారు సాక్షాత్తు శక్తి గా వ్యక్తం అవుతుంది. ఆ తల్లి చిదగ్ని నుండే రూపు దాల్చుతుంది..ఈ అగ్ని ద్వారానే హావిస్సు రూపంలో దేవతలకు శక్తి అందుతుంది.. ఈ నిత్య అగ్నిహోత్రం ఎంతో గొప్ప అనుష్ఠానం.. 

జీవుడిలో అగ్ని యొక్క స్థానం ఇలా ఉంటుంది ,అగ్ని వాక్కుగా ముఖమునందు, వాయువు ఘ్రాణముగా నాసిక యందు, ఆదిత్యుడు దృష్టిగా నేత్రములందు, దిశలు శ్రవణేంద్రియములుగా చెవుల యందు, జలము వీర్యముగా శిశ్న మందు, మృత్యువు అపానముగా నాభి యందు ప్రవేశించగా; ఈశ్వరుడు శరీరం నిలబడుటకు శిరస్సు ద్వారా పైనుండి బ్రహ్మ రంధ్రములోనికి ప్రవేశించెను. అగ్ని నుండి సమస్త ప్రపంచము ఏర్పడినది. సూర్యుడు కూడా అగ్ని స్వరూపుడే. రాత్రి, పగలు అగ్ని యొక్క సంతానము. 

అగ్ని రూపంలో అమ్మవారిని భావించి దీపం లో దర్శనం చేయాలి దీపం జోతిలోకి ఆ తల్లిని ఆవాహన చేసి ఆ దీపంలో ఉపాసించాలి అగ్నిలో ఆమె ప్రత్యక్షంగా దర్శనం ఇస్తుంది ఇది దీప దుర్గా ఉపాసనలో అనుభవం అవుతుంది.. దీపాలు వెలిగించి చేసే ప్రార్ధనకి అందుకే అంత శక్తి ఉంటుంది.. దీపాలతో దీప కాంతి రూపంలో అమ్మవారిని ప్రత్యక్షంగా ఉపాసన చేస్తారు..ఈ ఉపాసనలో ఆ కాంతి అమ్మవారి ఆకారంలోనే ప్రత్యక్షంగా పూజను స్వీకరిస్తుంది.. ఇది పద్దతిగా గురువును నుండి సాధన నేర్చుకుని చేయాలి.. అలా ఆవాహన చేసిన తల్లి ని దేవి మహత్యం స్ట్రోత్రాలతో, ఉపదేశం పొందిన మంత్రం యొక్క సంపుటికరణ స్త్రోత్రం అర్చనతో పూజించి ఆ స్వరూపం అంతర్ధానం అయే వరకు మనసులో నే మంత్రం జపిస్తూ ధ్యానం చేయాలి అలా చేయగా చేయగా ఆ శక్తి మనలోకి చేరిపోతుంది.. ఈ సాధన కోరికలతో చేయాకుడదు అమ్మవారి అనుగ్రహము పొందడానికి చేయాలి ఎందుకంటే ఆ స్థాయిలో అమ్మవారిని ప్రత్యక్షంగా ఆ కాంతిలో అనుభూతి చందుతూ ఒకరకమైన భయం తో కూడిన భక్తి ఏర్పడుతుంది వెన్నులో వణుకు పుడుతుంది నేరుగా ఆమెను చూసే ధైర్యం సరిపోక చూపు ఆమె పాదాలను వెతుకుతుంది.. అలా చూస్తూ చేసే శక్తి లేక ధ్యానంలో కి వెళ్ళిపోయి ఉపాసన కొనసాగిస్తారు లేకుంటే భయంతో మైకం వచ్చి పడిపోతారు.. నిదానంగా అలవాటు అయిన కొద్దీ ఆ భయం తగ్గక పోయిన ధైర్యంతో సాధన కొనసాగించడం అలవాటు అవుతుంది.. క్రమంగా ఈ సాధన సమయం కూడా పెరుగుతుంది. అఖండ దీపం లో అమ్మవారిని భావించి చేసే మండల దీక్షకు కూడా అంత శక్తి ఉంటుంది. 

ఈ ఉపాసన అంతా తెలియక పోయినా ప్రాతః కాలం సూర్యోదయానికి పూర్వం ఎక్కడ దీపం వెలుగుతుందో ఆ ఇంటిని ఆ దీపం రూపములో అమ్మవారు రక్షిస్తుంది దీపానికి ఒక్కో సమయానికి ఒక్కో దేవత అధిపతిగా ఉంటారు ఉదయం 5 గం దీపంలో వినాయకుడు అధిపతిగా ఉంటారు , 5.30 నుండి 6 గం సమయం వరకు లక్ష్మీ దేవి అధిపతిగా ఉంటుంది ఆ తల్లి దీపంలో కొలువై నరాయణుడిని ప్రార్థిస్తూ ఉంటుంది ఎక్కడ లక్ష్మీ కొలువై స్వామిని ఆరాధిస్తారో ఆ ఇంటిపైన  నారాయణుడి దృష్టి పడుతుంది. అగ్ని రూపం సాక్షాత్తు అమ్మవారే ఆ అగ్నిని దీపం రూపంలో ఆరాధిస్తే అంతకంటే గొప్ప ఉపాసనా సాధన ఏముంటుంది. 

ఉదయం సాయంత్రం దీపారాధన చేయండి, అగ్నిహోత్రం అలవాటు ఉన్నవాళ్లు క్రమం తప్పకుండా  సాధన చేస్తే ఆ తల్లిని ప్రత్యక్షంగా ఆరాధించినట్టు..దీపాలు వెలిగించండి అమ్మవారిని మీ ఇంటికి ఆహ్వానించండి..ఆ తల్లి మీ ఇంటికి దీపమై చీకటిని మాపి వెలుగును నింపుతుంది.

🌷శ్రీ మాత్రే నమః🌷

ఏడు కొండలు పేర్లు విశిష్టత


 
*తిరుమలలోని ఏడుకొండల పరమార్థం గురించి తెలుసుకొందామా..!*
☘☘☘☘☘☘☘
1. వృషబాద్రి    2. వృషాద్రి   3. గరుడాద్రి 
4. అంజనాద్రి   5. శేషాద్రి.    6. వేంకటాద్రి 
7. నారాయణాద్రి.
🌸🌸🌸🌸🌸🌸🌸
మనలోని ఏడు చక్రాలు దాటితే ఆనందానుభూతి కలుగుతుంది. ఆనంద నిలయం ఎక్కడ ఉంటుంది అంటే బ్రహ్మ స్థానంలో ఉంటుంది. అందుకనే ఆయన 7 కొండలు పైన ఉంటాడు. ఈ 7 కొండలు ఎక్కడం కూడా ఒక రహస్యం ఉంటుంది. 
ఆ 7 కొండలు సాలగ్రామాలే. ఆ 7 కొండలూ మహర్షులే. అక్కడి చెట్లు, పుట్టలు, పక్షులు ఏవైనా మహర్షుల అంశలే. తిరుమలలో పుట్టింది ఏదీ సామాన్యమైనది కాదు. 
🌸🌸🌸🌸🌸🌸🌸
అంజనాద్రి ర్వ్రుశాద్రిశ్చ శేషాద్రిర్గరుడాచలః |
తీర్థాద్రిః శ్రీనివాసాద్రి శ్చింతామణిగిరిస్తథా ||
వృషభాద్రి ర్వరాహాద్రిః జ్ణానాద్రిః కనకాచలః |
ఆనందాద్రిశ్చ నీలాద్రి స్సుమేరుశిఖరాచలః ||
వైకుంఠాద్రి: పుష్కరాద్రిః -- ఇతి నామాని వింశతిః
🌸🌸🌸🌸🌸🌸🌸

ఈ 20 నామాలు పఠించటంవల్ల సర్వ పాప బంధాలు నుండి విముక్తులు కాగలరు.
 ☘☘☘☘☘☘☘

*1. వృషభాద్రి - అంటే ఎద్దు :*
వృషభానికి ఋగ్వేదంలో ఒక సంకేతం ఉంది. ఎద్దు మీద పరమశివుడు కూర్చుంటాడు. దానికి 4 కొమ్ములుంటాయి. 3 పాదాలు (భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు)
వాక్కు అంటే - శబ్దం
శబ్దం అంటే - వేదం
వేదం అంటే - ప్రమాణము
వేదమే ప్రమాణము. వేదము యొక్క ప్రమాణాన్ని అంగీకరించిన వాడు మొదటి కొండ ఎక్కుతాడు.
 🌸🌸🌸🌸🌸🌸🌸

*2. వృషాద్రి - అంటే ధర్మం :*
ధర్మం అంటే నువ్వు వేదాన్ని అనుసరించి చేయవలసిన పనులు. నీకు భగవంతుడు ఇచ్చిన వాటితో మంచివి వినడం, చూడడం, మంచి వాక్కు మొదలైనవి. దాని వల్ల ఇహంలోను, పరలోకంలోను సుఖాన్ని పొందుతాడు. అవి చెయ్యడమే వృషాద్రిని ఎక్కడం.
 🌸🌸🌸🌸🌸🌸🌸

*3. గరుడాద్రి - అంటే పక్షి :*
ఉపనిషత్తుల జ్ఞానాన్ని పొందడం.
షడ్ - అంటే జీర్ణం కానిది. ఒక్క పరమాత్మ మాత్రమే జీర్ణంకానిది. పరమాత్మ ఒక్కడే ఉంటాడు. మిగిలిన వాటికి 6 వికారాలు ఉంటాయి. పుట్టినది, ఉన్నది, పెరిగినది, మార్పు చెందినది, తరిగినది, నశించినది. ఇవన్నీ పుట్టిన వాడికి జరుగుతూనే ఉంటాయి. ఆ ఆరు లేని వాడు భగవానుడు.
భగవ : ఐశ్వర్య బలము, వీర్య తేజస్సు మరియు అంతా తానే బ్రహ్మాండము అయినవాడు.
అన్ : ఉన్నవాడు, కళ్యాణగుణ సహితుడు, హేయగుణ రహితుడు. అటువంటి భగవానుణ్ణి జ్ఞానం చేత తెలుసుకోవడమే గరుడాద్రి.
🌸🌸🌸🌸🌸🌸🌸

*4. అంజనాద్రి :*
అంజనం అంటే కంటికి కాటుక. ఈ కంటితో చూడవలసినవి మాత్రమే చూసినపుడు. ఈ కంటితో చూసిన దాంట్లో అంతటా బ్రహ్మమే ఉందని తెలుసుకోవడం కంటికి కాటుక. ఇదంతా పరమాత్మ సృష్టియే. అప్పుడు అంజనాద్రి దాటుతాడు.
🌸🌸🌸🌸🌸🌸🌸

*5. శేషాద్రి :*
ప్రపంచం అంతా బ్రహ్మమే అని చూసాడనుకోండి వాడికి రాగద్వేషాలు ఉండవు. వాడికి క్రోధం ఉండదు. వాడికి శత్రుత్వం ఉండదు. భగవద్గీతలో గీతాచార్యుడు చెప్పినట్లు "తుల్య నిందా స్తుతిర్ మౌని" (శ్లోకం చెప్పారు) తాను కాకుండా ఇంకోటి ఉంది అన్న వాడికి భయం. అంతా బ్రహ్మమే అనుకునేవాడికి భయం ఉండదు. ఎప్పుడూ ఒకేలా ఉండడమే బ్రహ్మం. ఆ స్థితికి ఎక్కితే శేషాద్రిని ఎక్కడం.
 🌸🌸🌸🌸🌸🌸🌸

*6. వేంకటాద్రి :*
వేం : పాపం, కట : తీసేయడం. కాబట్టి పాపాలు పోతాయి. అంతా బ్రహ్మమే చేయిస్తున్నాడు, అందుకనే మనకి బ్రహ్మం తెలిసినవారు పిచ్చివాళ్ళలా కనవడుతారు. రామకృష్ణ పరమహంస ఈ పిచ్చి నాకు ఎప్పుడు వస్తుందో అంటూ ఉండేవారు. అందుకే జ్ఞాని, పిచ్చివాడు ఒకలా ఉంటారు. ఆయనకే అర్పణం అనడం, అటువంటి స్థితిని పొందడం వెంకటాద్రి ఎక్కడం.
🌸🌸🌸🌸🌸🌸🌸

*7. నారాయణాద్రి :*
 అంటే తుల్యావస్థని కూడా దాటిపోయి, తానే బ్రహ్మముగా నిలబడిపోతాడు. అటువంటి స్థితిని పొందడం నారాయణాద్రి. 
🌸🌸🌸🌸🌸🌸🌸
కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటాచల తిరుమల శ్రీనివాసున్నీ మనసారా కొలవడం అంటే నాభూతో నాభవిష్యత్. ఆయన చెంత ఉంటే వైకుంఠమేగా ఇక.
🌸🌸🌸🌸🌸🌸🌸

వరాహస్వామిని ఎందుకు దర్శించుకోవాలి

వెంకటేశ్వర స్వామి కంటే ముందుగా వరాహస్వామిని ఎందుకు దర్శించుకోవాలి? 

చాలామంది భక్తులకు అసలలా ఎందుకు చేయాలో తెలియదు కానీ చేసేస్తుంటారు. తిరుమలలో శ్రీనివాసుడు వెలసి 5000 సంవత్సరాలవగా, అప్పటివరకూ తిరుమల శిఖరం వరాహస్వామి సొంతం.


 అప్పటిలో వరాహ స్వామి వద్ద శిఖరంపై వంద చదరపు అడుగుల స్థలాన్ని బహుమతిగా తీసుకున్నాడు వెంకటేశ్వరస్వామి. దానికి బదులుగా శ్రీనివాసుడు ఒక హామీ ఇచ్చాడు వరాహస్వామికి.

అదేమిటంటే… తనకోసం వచ్చే భక్తులు ముందుగా వరాహస్వామిని దర్శించుకు వచ్చేలా చూస్తానని చెప్పాడు. తిరుమలలో వెలసిన తొలి దైవం వరాహ స్వామి, అందువల్లనే వేంకటాచలం వరాహ క్షేత్రంగా ప్రసిద్ధి కెక్కింది.

తిరుమల శ్రీవారి ఆలయ పుష్కరిణికి వాయువ్య మూలలో తూర్పు ముఖంగా శ్రీ వరాహ స్వామి ఆలయం వుంది. వెంకటేశ్వరస్వామికి ఇక్కడ స్థలం ఇచ్చినందుకు వరాహస్వామికి తొలిదర్శనం, మొదటి అర్చన, మొదటి నివేదన జరిగేట్లు తామ్రపత్రం (రాగిరేకు) పైన వేంకటేశ్వరుడు రాసి ఇచ్చాడు. ఈ తామ్ర పత్రం మీద బ్రాహ్మీ లిపిని పోలిన అక్షరాలు దానిమీద ఉన్నాయి.

ఈ రాగిరేకును నేటికీ రూ.3 హారతి టిక్కట్టు కొన్న భక్తులకు హారతి సమయంలో చూపిస్తారు. భక్తులు ముందుగా వరాహ స్వామిని దర్శించుకుంటే ఆ శ్రీనివాసుడు సంతోషిస్తాడని పెద్దలు చెబుతుంటారు. ఒకవేళ వరాహస్వామిని దర్శించుకోకుండా గాని భక్తులు తిరమల నుండి వస్తే, ఆ యాత్ర ఫలం దక్కదని చెబుతారు. కనుక తిరుమల శ్రీవారిని దర్శించుకునే ప్రతి భక్తుడు వరాహ స్వామి దర్శనం సంపూర్ణసిద్ధిని కలిగిస్తుంది.

అశ్వని నక్షత్రం - గుణగణాలు, ఫలితాలు


    అశ్విని నక్షత్ర అధిదేవత అశ్వినీ దేవతలు. సూర్య భగవానుడి భార్య సజ్ఞాదేవికి, సూర్య భవానుడికి పుట్టిన వారు అశ్వినీ దేవతలు. ప్రాథమికంగా అశ్వనీ నక్షత్రం సన్య నక్షత్రంగా పురుష లక్షణంతో క్షిపుతారగా గుర్తింపు పొందింది. దీనికి అధిపతి కేతువు. ఈ నక్షత్రంలో జన్మించినవారు శివుడి అర్చన చేసి వైడూర్యాన్ని ధరించవలసి ఉంటుంది. 

అశ్వని నాలుగు పాదాలు మేష రాశిలోనే ఉన్నాయి. మొదటి పాదం :- అశ్వినీ నక్షత్రం మొదటి పాదంలో పుట్టిన వారి నక్షత్ర అధిపతిగా కుజుడు. వీరు శక్తికి మించిన సామర్థ్యం ప్రదర్శించాలని ప్రయత్నిస్తారు. అస్థిర చిత్తంతో ఉంటారు. కొన్ని సార్లు రాజీ ధోరణితో ఉండాల్సి ఉంటుంది. అనవసర విషయాలపై దృష్టి పెట్టడం జరుగుతుంది. పనికి రాని ఆలోచనలు బుర్రను తొలుస్తుంటాయి. సమాజంలో మంచి గుర్తింపు, గౌరవం పొందాలన్న తాపత్రయపడతారు. గ్రహ దశలు :-పుట్టినప్పటి నుంచి కేతు మహర్దశ ఏడు సంవత్సరాలు, శుక్ర మహర్దశ ఇరవై సంవత్సరాలు, రవి మహర్దశ ఆరు సంవత్సరాలు, చంద్ర మహర్దశ పది సంవత్సరాలు, కుజ మహర్దశ ఏడు సంవత్సరాలు అనుభవిస్తారు.రెండో పాదం:- అశ్వినీ నక్షత్రం రెండవ పాదంలో పుట్టిన వారి నక్షత్ర అధిపతిగా కుజుడు నవాంశ రాశ్యధిపతి శుక్రుడు. దీంతో వీరు పట్టుదల గల వారు. ఎదుటి వ్యక్తుల స్వభావాన్ని త్వరగా గ్రహిస్తారు. చాలా విషయాల్లో చురుగ్గా వ్యవహరిస్తారు. తలపెట్టిన కార్యాన్ని సాధించడంలో అనుకూలమైన మార్గాన్ని ఎంచుకుంటారు. ప్రాజ్ఞులు, దక్షులుగా గుర్తింపు పొందుతారు. మంచి ఆత్మవిశ్వాసం గలవారై ఉంటారు. గ్రహ దశలు:- వీరు పుట్టినప్పటి నుంచి కేతు దశ ఐదు సంవత్సరాల మూడు నెలలు. శుక్ర మహర్దశ ఇరవై సంవత్సరాలు. రవి మహర్దశ ఆరు సంవత్సరాలు. చంద్ర మహర్దశ పది సంవత్సరాలు, కుజ మహర్దశ ఏడు సంవత్సరాలు అనుభవిస్తారు. మూడో పాదం:-  అశ్వని మూడో పాదంలో జన్మించిన వారికి ప్రాచీన శాస్త్రాలను ఇష్టపడుతారు. ముఖ్యంగా జ్యోతిష్య, తర్క శాస్త్రాలపై మక్కువ ఉంటుంది. చక్కటి సలహాలు ఇవ్వడంలో నేర్పరులు.  అయితే ఆ సలహాల వల్ల తమకు తాము ఎలాంటి లాభాన్ని పొందలేరు. నలుగురిలో కలిసేందుకు ఇష్టపడరు. గ్రహ దశలు  
పుట్టినప్పటి నుంచి కేతు మహర్దశ మూడున్నర సంవత్సరాలు, శుక్ర మహర్దశ ఇరవై సంవత్సరాలు. రవి మహర్దశ ఆరు సంవత్సరాలు. చంద్ర మహర్దశ పది సంవత్సరాలు, కుజ మహర్దశ ఏడు సంవత్సరాలు, రాహు దశ 18 సంవత్సరాలు అనుభవిస్తారు. నాలుగో పాదం:- అశ్వని నాలుగో పాదంలో జన్మించిన వారు కళాత్మకంగాను, అలంకార ప్రియులుగానూ, నిదానమైన ప్రవర్తనతోనూ ఉంటారు. గాఢమైన ఆలోచనలు కలిగి మేధావులుగా గుర్తింపు పొందుతారు. నిరంతరం కొత్త విషయాలపై ఆసక్తి కనబరుస్తారు. లక్ష్యసాధనలో వెనుకడుగు వేయరు. అయితే వీరికి ఫలితం సునాయాసంగా అందదు. శ్రమ పడాల్సిన అవసరం ఉంటుంది. గ్రహ దశలు:- పుట్టినప్పటి నుంచి కేతు మహర్దశ 7 సంవత్సరాల 9 నెలలు, శుక్ర మహర్దశ ఇరవై సంవత్సరాలు. రవి మహర్దశ ఆరు సంవత్సరాలు. చంద్ర మహర్దశ 10 సంవత్సరాలు, కుజ మహర్దశ ఏడు సంవత్సరాలు, రాహు దశ 18 సంవత్సరాలు అనుభవిస్తారు.  
ఈ నక్షత్ర జాతకుల గుణగణాలు
అశ్వినీ నక్షత్ర జాతకులు అశ్వం వలే ఉరిమే ఉత్సాహంతో కనిపిస్తారు. తెలివి, జ్ఞాపకశక్తి, సామర్థ్యం, చైతన్యవంతమైన, విశాలమైన కళ్ళు కలిగివుంటారు. పోటీ మనస్తత్వం ఉంటుంది. క్రీడల యందు ఆసక్తి అధికం. అశ్వినీదేవతలు శసత్రచికిత్స, ఆయుర్వేద వైద్యములో నిపుణులు కనుక అశ్వినీ నక్షత్రజాతకులు ఆయుర్వేదం వంటి వైద్యం యందు ఆసక్తితో ఉంటారు. వీరు ఉద్రేకపూరిత మనస్తత్వం కలిగి ఉంటారు. రాశ్యాధిపతి కుజుడు కనుక వీరికి ధైర్యసాహసాలు అధికం. ఎటువంటి పరిస్థితులనైనా మనోస్థైర్యంతో ఎదుర్కొనగలరు. ఓర్పు, నేర్పు, సామర్ధ్యంతో కార్యనిర్వహణ పూర్తి చేస్తారు. తనను నమ్ముకున్న వారిని ఆపదలో కాపాడుట వీరి విశిష్ట గుణం.ఈ నక్షత్ర జాతకులు వీరు ఇతరుల సలహాలు స్వీకరించినా.. చివరకు తమకు నచ్చినట్లు నిర్ణయం తీసుకుంటారు. ఈ నక్షత్రము దేవగణ నక్షత్రము కనుక న్యాయం, ధర్మము పాటిస్తారు. వీరికి నాయకత్వ లక్షణాలు అధికం కనుక రాజకీయనాయకులుగా, అధికారులుగా చక్కగా రాణిస్తారు. నక్షత్రాధిపతి కేతువు కనుక వైరాగ్యం, దైవోపాసనా, భక్తి వంటి లక్షణాలు వీరికి అధికం. కొంత అలసత్వము కలిగి ఉండడము సహజమే. తాము అనుకున్నది సాధించాలన్న పట్టుదల ఉంటుంది. ఇతరులకు కింద పనిచేయడం వీరికి నచ్చదు. అన్ని విషయాలలో ఆధిపత్య మనస్తత్వం కలిగి ఉంటారు. క్రీడాకారులుగా, వైద్యులుగా, సైనికపరమైన ఉద్యోగులుగా చక్కగా రాణించగలరు. ఇవి అశ్వినీ నక్షత్రజాతకుల సాధారణ గుణాలు. అయితే జాతకచక్రం, లగ్నం, పుట్టిన సమయం, మాసముల వలన గుణగణాలలో కొద్దికొద్దిగా మార్పులు ఉంటాయి. ఈ నక్షత్ర జాతకులకు 45 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా జరుగుతుంది. బాల్యము నుంచి యుక్తవయస్కులు అయ్యే వరకు వీరికి జీవితం వీరికి ఆనందదాయకముగా జరుగుతుంది. అశ్వనీ నక్షత్ర జాతకులకు కృత్తిక, మృగశిర, పునర్వసు, చిత్త, అనూరాధన, జ్యేష్ట నక్షత్రములు ఏ కార్యమునకు పనికి రావని శాస్త్రం చెబుతోంది.!
Taken from Astrological book.

Seeds Of Consciousness - 52

🌴. YOU PEOPLE DON’T KNOW HOW MUCH YOU MISS BY NOT KNOWING YOU TRUE SELF  🌴

Q: While in theory I am ready to pay any price, in actual life again and again I am being prompted to behave in ways which come in between me and reality. Desire carries me away.

M: Increase and widen your desires till nothing but reality can fulfil them. It is not desire that is wrong, but its narrowness and smallness. Desire is devotion. By all means be devoted to the real, the infinite, the eternal heart of being. 

Transform desire into love. All you want is to be happy. All your desires, whatever they may be, are expressions of your longing for happiness. Basically, you wish yourself well.

Q: If I am free, why am I in a body?

M: you are not in the body, the body is in you! The mind is in you. They happen to you. They are there because you find them interesting. Your very nature has the infinite capacity to enjoy. 

It is full of zest and affection. It sheds its radiance on all that comes within its focus of awareness and nothing is excluded. It does not know evil nor ugliness, it hopes, it trusts, it loves. 

You people do not know how much you miss by not knowing your own true Self. You are neither the body nor the mind, neither the fuel nor the fire. They appear and disappear according to their own laws.

That which you are, your true Self, you love it, and whatever you do, you do for your own happiness. To find it, to know it, to cherish it is your basic urge.

Since time immemorial you loved yourself, but never wisely. Use your body and mind wisely in the service of the self, that is all. 

Be true to your own self, love your self absolutely. Do not pretend that you love others as yourself. Unless you have realised them as one with yourself, you cannot love them. 

Don't pretend to be what you are not, don't refuse to be what you are. Your love of others is the result of self-knowledge, not its cause.

Without self-realization, no virtue is genuine. When you know beyond all doubting that the same life flows through all that is and you are that life, you will love all naturally and spontaneously. 

When you realize the depth and fullness of your love of yourself, you know that every living being and the entire universe are included in your affection. But when you look at anything as separate from you, you cannot love it for you are afraid of it. 

Alienation causes fear and fear deepens alienation. It is a vicious circle. Only Self-realization can break it. Go for it resolutely.

- Nisargadatta Maharaj

రాజ ధర్మం-భక్తి ధర్మం

ధర్మం నాలుగు పాదాలుగా నడిచిన త్రేతాయుగంలోని రామాయణకాలంలో రాజధర్మానికి, భక్తిధర్మానికి మధ్య జరిగిన సంఘర్షణ, వాటివల్ల పొడసూపిన భావవైరుధ్యాన్ని వారు ఆనుభవించిన తీరు చాలా ఆశ్చర్యం కలిగించేలా ఉండి, సగటు మనిషికి ఎన్నో జీవితపాఠాలు నేర్చుకునే అవకాశం కలిగిస్తుంది. పరిస్థితులు ధర్మసంకటాన్ని సృష్టించినా, తాము నమ్మిన సిద్ధాంతాల కోసం తమ జీవితాలను సమర్పించి పునీతం చేసుకున్న రెండు వైవిధ్యమైన వ్యక్తిత్వాల మధ్య ఉన్న అపురూపమైన అనుబంధాన్ని వాల్మీకి మలిచిన తీరు మనం రామలక్ష్మణుల వృత్తాంతాలను అవలోకిస్తే అవగతమవుతుంది.

మర్యాదా పురుషోత్తముడిగా మన్ననలందిన శ్రీరాముడి ధర్మజిజ్ఞాస రామాయణమంతా మనకు అగుపడుతుంది. అందుకే ‘రామో విగ్రహవాన్‌ ధర్మః’ అని శత్రువైన మారీచుడి ద్వారా వర్ణితమైన ఉత్తమోత్తముడు శ్రీరాముడు. అడుగడుగు నా ఎన్ని పరీక్షలు ఎదురైనా కేవలం తండ్రికిచ్చిన మాట కోసం స్వంతవారి ని, ప్రజలను ఐశ్వర్యాన్ని రాజ్యాధికారాన్ని తృణప్రాయంగా వదిలి అడవిబాట బట్టిన త్యాగశీలి. కైకేయి వరం వల్ల దశరథుడు తాను తలపెట్టిన పట్టాభిషేకానికి బదులు ఉన్నఫలాన రాజ్యాన్ని భరతుడికి వదిలేసి వెళ్ళమని అన్నప్పుడు, ఒక్కమాట కూడా ఎదురుచెప్పకుండా, తల్లి కౌసల్య వద్దని వారిస్తున్నా, అన్యాయం జరుగుతుందని లక్ష్మణుడు వారిస్తున్నా, ఎన్నో కష్టాలు అనుభవించి,  ఆ ప్రస్థానంలో, ఏకపత్నీ వ్రతాన్ని, సుగ్రీవుడి విషయంలో స్నేహధర్మాన్ని, విభీషణుడి విషయంలో రాజధర్మాన్ని, భరతుడు తన పాదుకలు స్వీకరించడానికి వచ్చినపుడు రాజ్యపాలనా రహస్యాలను వివరించి తన భాతృధర్మాన్ని నిర్వర్తించిన సౌహార్ద్ర శీలి ఆ పురుషోత్తముడు.

అటువంటి రాముడి అత్యంత ప్రియమైన సోదరుడు, అరివీర భయంకరుడు, పేరుకి సవతి తమ్ముడైనా, రాముడి కోసం ప్రాణత్యాగం కూడా చేయడానికి వెనుకాడని భక్తిధర్మం లక్ష్మణుడిది. ఇద్దరి మనస్తత్వంలో ఎంతో వైరుధ్యం ఉంది. తాను స్వతహాగా రాముడికి ధీటైన వాడైనా, అన్నమాట దాటని సేవకుడు. లక్ష్మణుడు, రాముడికి ఏ కష్టం వచ్చినా తట్టుకోలేడు. ఎంతటి సాహసానికైనా వెనుకాడడు. తన దృష్టిలో రాముడికి కష్టం కలిగించిన వారెవరూ తన మిత్రులు కారు. రాముణ్ణి బాధపెట్టే అవకాశం ఉన్న ఏ సంఘటనా ఆయనకు రుచించదు. లక్ష్మణుడు నమ్మిన ఏకైక ధర్మం రామభక్తి. మిగతా అన్నీ అధర్మాలే. ఎంతటి ఆవేశాన్నయినా ఒక్క రాముడి కంటిచూపుతోనే తగ్గించుకొని, రామసేవలో నిద్రాహారాలు మాని, తన సర్వసుఖాలు వదులుకొని ఒక సేవకుడిగా మారి, తన భక్తిని చాటుకున్న ధర్మశీలి లక్ష్మణుడు.

రాముడిని నిత్యం అనుసరిస్తూ గడిపిన లక్ష్మణుడి దృష్టిలో, రాముడిని వనవాసానికి వెళ్ళమన్న తండ్రి దశరథుడు, కైకేయి ఇద్దరూ పెద్ద మోసగాళ్ళు. వారి నిర్ణయంపై ఆగ్రహంతో, వారిని, అయోధ్యనంతటినీ నాశనం చేయడానికి కూడా ఉద్యుక్తుడైన సాహసవంతుడు, నిరంతరం తన ఆవేశాన్ని సీతారాముల సేవలో అణిచివేసుకొని, కేవలం అన్న వెంటే ఉండాలన్న భక్తితో, తన సతీ వియోగంలో పధ్నాలుగేండ్లు వనవాసంలో గడిపిన ధర్మమూర్తి. లక్ష్మణుడికి రాముడి మాటంటే ఎంత గురి అంటే, రాముడి ధర్మవాక్కులు ఎక్కడైనా నచ్చినా, నచ్చకపోయినా ఒక్కమాట కూడా అనక భాతృప్రేమను చాటిన ఉత్తముడు సౌమిత్రుడు. లక్ష్మణుడి తల్లి సుమిత్ర ఎంతో ఉత్తమురాలు. తన సవతి కొడుకుతో పాటు భార్యను, రాజ్యాన్ని వదిలి వనవాసానికి సిద్ధమైన పుత్రుడిని వారించకుండా, పైగా ‘రాముని క్షేమం పూర్తిగా నీ బాధ్యతయే’ అన్నదిగానీ, ‘నువు జాగ్రత్త’ అనలేదు. అంతటి ఉత్తమోత్తమమైన తల్లికి పుత్రుడు. కాబట్టే, లక్ష్మణుడు (సౌమిత్రుడు) అంతటి సౌశీల్యుడయ్యాడు. చివరకు యుద్ధంలో ఇంద్రజిత్తు ఏ అస్ర్తానికీ లొంగకపోతే రాముడిని, రాముడు పాటించిన ధర్మాన్ని మనసులో తలుచుకొని బాణం వేసి వధించి, రాముడి రాజధర్మాన్నీ, తన భక్తిధర్మాన్ని ఒకేసారి నిరూపించిన సౌజన్యశీలి లక్ష్మణుడు.

మనస్తత్వంలో ఇంతటి వైరుధ్యం ఉన్నా, తాను నమ్మిన రాజధర్మం కోసం రాముడు, తాను నమ్మిన భక్తి కోసం అన్నను తప్ప అన్నీ త్యాగం చేసిన తమ్ముడు లక్ష్మణుడు. అటువంటి రామలక్ష్మణ అనుబంధం అజరామరం. మనందరికీ ఆదర్శప్రాయం, ఆచరణీయం. ఇప్పుడు అరుదైనా, మన ఉమ్మడి కుటుంబాల్లో ఇటువంటి అనుబంధాలను ఇంకా మనం చూడవచ్చు. దీనికి ఇంకా ఆస్కారం ఉంది కూడా. ధర్మో రక్షతి రక్షితః

Friday, June 26, 2020

ఋణానుబంధం

పువ్వు తొడిమనుండి విడిపోతుంది, పండు చెట్టునుండి రాలిపోతుంది, కానీ ఎన్ని కష్టాలు ఎదురైనా తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లలను విడిచిపెట్టరు.. అని మహాభారతం చెబుతోంది.

పిల్లలపై తల్లిదండ్రులకున్న అనుబంధం ఎలాంటిదో కృష్ణుని ఎడబాటును భరించలేని యశోదానందుల హృదయావేదనను ఒక్కసారి తెలుసుకుంటే అర్థమవుతుంది.

శ్రీకృష్ణుడు మధురకు వెళ్ళినప్పుడు ఆ ఎడబాటును సహించలేక తల్లి యశోద దుఃఖసాగరంలో మునిగిపోయింది. దుఃఖంతో కుమిలిపోతున్న యశోదను చూసి నందుడు కూడా ’కన్నయ్య లేకుండా మేము బ్రతకలేం’ అని కన్నీరు మున్నీరు కాసాగాడు. అలాగే శ్రీకృష్ణుడు కూడా తల్లిదండ్రులను వదిలి మధురకు వచ్చినప్పుడు అవ్యక్తావేదనతో యశోదమ్మను తలచుకుంటూ ఉద్ధవునితో, "ఉద్ధవా! నాకన్నయ్య భోజనం చేస్తే గానీ నేను పచ్చి మంచినీళ్ళైనా ముట్టను’ అని మొండి పట్టుదలతో కూర్చొనే నాతల్లి యశోదమ్మను నేను మరువలేకున్నాను" అని చెబుతూ కృష్ణుడు విలపించసాగాడు.

కంసుని చెరాల నుంచి దేవకీ వసుదేవులను విడిపించిన తరువాత బలరామకృష్ణులు వారికి పాదాభివందనాలు చేసి, వారి పట్ల కృతజ్ఞతాభావాన్ని ఇలా వ్యక్తపరిచారు..

"మాకు నిన్నాళ్ళు లేదయ్యె మరియు వినుడు
నిఖిల పురుషార్థ హేతువై నెగడుచున్న
మేనికెవ్వార లాఢ్యులు మీరు కారె
యా ఋణము దీర్ప నూరేండ్లకైన జనదు" (దశమస్కంధం, పోతన భాగవతం).

’అమ్మా.. నాన్నా..  మేము ఇన్నాళ్ళూ మీ ప్రేమ, ఆప్యాయతలను పొందే అదృష్టానికి నోచుకోలేదు. ధర్మార్థ కామ మోక్షాలనే పురుషార్థాలు సాధించడానికి అవసరమైన ఈ దేహాన్ని ప్రసాదించిన వారు మీరు. అలాంటి దుర్లభమైన మానవ దేహాన్ని ఇచ్చిన మీ ఋణం తీర్చడానికి మాకు నూరేళ్ళైనా సాధ్యం కాదు.’ అని. 

బలరామకృష్ణులు పలికిన మాటల వల్ల తల్లితండ్రుల స్థానం ఎంతటి మహోన్నతమైనదో మనం అర్థం చేసుకోవచ్చు. నిరంతరం తల్లిదండ్రులు మన చెంత ఉండడం వల్ల వారి విలువ ఏమిటో మనం గుర్తించ లేకపోతున్నాం. అందువల్ల వారిపట్ల నిర్లక్ష్య వైఖరినీ, నిర్దాక్షిణ్యాన్నీ చూపుతున్నాం. తల్లిదండ్రులే ఇలలో ప్రత్యక్ష దైవాలనీ, వారి ఋణం ఎన్ని జన్మలైనా తీర్చలేనిదనీ నిరూపించిన వినాయకుడు, శ్రీకృష్ణుడి జీవితాలు మనకు ఆదర్శం కావాలి...

ఆ తల్లికి మనోవేదన

ఆ తల్లికి కూడా భరించలేని మనోవేదన ఎందుకు ఆమె దేవత కదా ఆమెకు కూడా వేదన ఉంటుందా అంటే ఉంటుంది ఆ తల్లిలో లేని గుణాలు మనలో కూడా ఉండదు అయితే అందులో మంచికి జరిగే స్పందన చెడుకు కలిగే స్పందన మన గుణాన్ని బట్టి ఉంటుంది.. ఆమెకు ఎందుకు వేదన చూద్దాము..

బిడ్డను కని చెత్తకుప్పలో వేస్తే ఆ బిడ్డ ఆకలికి ఏడుస్తునప్పుడు ప్రకృతి మాతకు మనో వేదన..

కన్న తల్లితండ్రులను అనాధాలుగా వదిలి వేస్తునప్పుడు ఆమెకు వేదన..

క్షణకాలం సుఖం కోసం వరసలు మర్చిపోయి పాప బీతి లేకుండా పసిబిడ్డలను బలిచేస్తే ఆమెకు వేదన

నోరు లేని జీవాలను హింసించి ఆనందిస్తే ఆమెకు వేదన

నమ్మక ద్రోహం చేసే వారు, దోపిడీలు దొంగతనాలు ఆస్థి కోసం అయిన వాళ్లనే చంపుకోవడం చూసి ఆమెకు వేదన

భార్యాభర్తల సంబందంకి విలువ లేకుండా ప్రవర్తిస్తూ మోసం చేసుకుంటూ విలువలు లేకుండా ప్రవర్తిస్తే ఆమెకు వేదన..

కష్ట పడ్డ వాడికి తగిలి మూల్యం ఇవ్వకుండా శ్రమ దోపిడీ చేస్తే ఆమెకు వేదన...

అపద్దపు వాక్ధానం తో నాయకులు చేసే మోసాలకు ఆమెకు వేదన..

అన్నిటికన్నా ముఖ్యంగా అడ్డదారుల్లో డబ్బు సంపాదన కోసం వ్యక్తిత్వం కోల్పోయి చేసే పాపపు పనులకు ఆమెకు వేదన...
అతల్లి కూడా కన్నీరు పెట్టె సంఘటన ఉంది అది దేవుడి పేరుతో చేసే దోపిడీలు, మోసాలు, పాపపు పనులు దేవుడి పేరుతో బిడ్డలను బలి ఇవ్వడం ఆడవాళ్ళని మోసం చేయడం సమాజంలో సాధువు గా దోపిడీలు చేస్తూ వికృతంగా ప్రవర్తించే వారికి చూసి ఆ తల్లి కన్నీరు కారుస్తుంది అందరూ ఆ తల్లి బిడ్డలే అందులో కొందరు ఆమె పేరుతో మోసం చేస్తే తల్లిని అనాధగా వదిలేస్తే ఎలా ఆమె హృదయం రోధిస్తుందో అలా తాము చడిపోతూ సమాజాన్ని చెడగొడుతున్న వారిని చూసి రోదిస్తుంది..

లంచాలు తినే వారిని, వైద్యం పేరుతో రక్తం తాగే వాళ్ళని చూసి రోధిస్తుంది..

ఆకలితో ప్రాణాలు కోల్పోయే వారిని చూసి , అహకరంతో కన్నుమిన్ను కానక ప్రవర్తించే వారిని చూసి వేదన పడుతుంది..

దేవుడు ఇచ్చిన స్వచ్ఛమైన గాలి నీరు వాతావరణం కలిషితం చేస్తే రోదిస్తుంది..

ఎందుకు వేదన పడుతుందో తెలుసా ఈ పాప భారాన్ని మోయలేక ప్రకృతి చేసే విలయతాండవము దానికి బలి అయిన వారిని చూసి రోదిస్తుంది..చేసిన కర్మకు అనుభవిస్తున్న శిక్షని చూసి ఆవేదన పడుతుంది.. 

ఎందుకంటే అందరూ ఆమె నుండి వచ్చిన బిడ్డలే..పాపం చేసి కర్మను అనుభవించక తప్పదు అది తప్పితేనే ఆమెను చేరుకోగలరు..

మేము బాధలో ఉన్నాము మా కష్టాలు దేవుడు తీర్చలేదు అంటారు, మా పిల్లలు స్థిరపడాలి పెళ్లి కావాలి అంటూ ఏవేవో కొరికలతో అవి జరగక పోతే తల్లితండ్రుగా బాధ పడతారు .మరి ఆ తల్లి బిడ్డలు కష్టాలు పడుతుంటే, తప్పుడు పనులు చేస్తుంటే, జీవితం అడ్డదారిలో నాశనం చేసుకుంటూ ఉంటే ఆమె రోదించదా ఆమెకు బాధ ఉండదా..మనము ఆమెను కష్టపెట్టడం లేదా...

మనము బాధ పడుతూ ఆ తల్లిని బాధ పెడుతున్నాము... అని గమనించాలి.. అనుక్షణం మనల్ని రక్షిస్తూనే ఉంది అని తెలుసుకోవాలి. మనవైపు నుండి మనము ధర్మ బద్దంగా ఉంటే ఆమె వైపు నుండి వచ్చే అనుగ్రహం దక్కుతుంది పాత్ర శుద్దిగా లేకుండా అందులో పానకం పోసిన రుచి ఉండదు ఆమె పానకం పాయసము ఇస్తుంది మనము పాత్ర అనే మన మనసుని ఆలోచనని శుద్ధంగా ఉంచి స్వీకరిద్దాము...మన వైపు  నుండి మనము ధర్మగా ఉందాము.. క్రమశిక్షణతో ఉందాము కొంతైనా ఆ తల్లికి ఆనందాన్ని ఇద్దాము..

ప్రకృతి అంటే అమ్మవారు ఆ ప్రకృతి ని కాలుష్యం చేయకుండా ఉంటాము అని ప్రమాణం చేసుకుందాము ప్రకృతి రూపంలో ఉన్న తల్లిని దర్శిద్దాము..

జ్ఞాన సౌందర్యం

 🌷 ధనం గురించి ,అది లభించే మార్గాల గురించి , ఎంతసేపు ఆలోచించినా కోటీశ్వరుల భజన చేసినా  ఒక్క రూపాయి కూడా లభించదు.
      
 🌷జ్ఞానం గురించి మాట్లాడుతూ,  చర్చిస్తూ, ఆలోచిస్తూ, జ్ఞానుల సాంగత్యం లో ఉంటేనే , జ్ఞానుల ని ఆరాధిస్తే  వారి  నుండి జ్ఞానం మన లోకి  ప్రవహిస్తుంది.
      
 🌷జ్ఞానం ఒక అగ్ని,  మనలోని సమస్త మాలిన్యాలని దహిస్తుంది. అహంకారం కరిగి పోతుంది.

 🌷జ్ఞానం ఒక ఐశ్వర్యం.  క్రమంగా పెరుగుతూ  జన్మ జన్మ కి వెంట వస్తుంది.
  
🌷జ్ఞానం  ఒక ప్రేమ స్వరూపం.  జ్ఞానం ఉన్నవారే
తమని ప్రేమించే వారి  హృదయాన్ని. గుర్తించగలరు. స్వయంగా అందించగలరు.

  🌷జ్ఞానం  ఒక సౌందర్యం.    జ్ఞానం పొందిన వారి
మాటల్లో. ,ప్రవర్తన లో ,  వ్యక్తిత్వం లో,  విశ్వాసాల్లో, కోరికల్లో,   వారి  ప్రతి అణువు లో  జ్ఞానమే కనిపిస్తుంది..

       ఈ కారణం గానే  శ్రీ కృష్ణుడు భగవద్గీత లో 
". *నహి జ్ఞానేన. సదృశం "*  అన్నాడు. 

Thursday, June 25, 2020

భగవంతుడు భక్త సులభుడు

సీతమ్మ గురంచి విన్నప్పుడు, తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి జీవితంలో జరిగిన ఒక ఘటన గుర్తుకు వస్తుంది.

*భగవంతుడు భక్త సులభుడు*...

శ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి జీవితంలో జరిగిన ఓ అద్భుత సంఘటన .

వారు పూజ చేసే టప్పుడు ఆవాహయామి అనగానే ఆ దేవత వచ్చి ఎదురుగా బుద్ధిగా కూర్చునేదిట . అది వారి అనుభవం.

ఒకసారి ఒకామె వచ్చి తనకు సీతా మంత్రం అనుగ్రహించమని కోరిందట .
ఆశ్చర్యంతో , ఆనందంతో వారు చాలా కాలం సీతా మంత్రోపాసన చేసి , తరువాత ఆవిడని రమ్మని 
మంత్రోపదేశం చెసారట . 
ఆవిడ వెళ్ళిపోతూ ఈ మంత్రం చేస్తే చాలా కస్టాలు వస్తాయని వింటున్నాను . నిజమేనా అని అడిగిందట . 
వారు అలాటప్పుడు ఆ మంత్రం కావాలని ఎందుకు అడిగావు ? సందేహాలుండకూడదు. అంటే, ఆమె అదేమీ లేదంటూ వెళ్ళిపోయిందట .
కొంత కాలానికి ఆవిడ తిరిగి వచ్చి తనకి ఆ మంత్రం వద్దనీ , ఇక చేయలేననీ, చాలా కష్టాల బారిన పడుతున్నాననీ వాపోయిందిట . 
ఆమె ప్రారబ్దానికి బాధపడుతూ , ఆమె ప్రారభ్దానికి జాలి పడి , సందేహాస్పదమైన మనసుతో, పరిపూర్ణ విశ్వాసం లేకుండా చేస్తే ఇలాగే ఉంటుందేమో అనుకుంటూ 
దయతో శ్రీ శాస్త్రి గారు దానికి కావలసిన జపాలు ముందు ఆయన చేసుకుని ఆవు కుడి చెవిలో మంత్రం చెప్పి వదిలెయ్యి . 
ఇకనించీ మళ్ళీ దాని గురించి ఆలోచించవద్దు అని చెప్పేరట . 
ఆవిడ అలాగే చేసి వెళ్ళిపోయిందట .

ఆ రాత్రి కలలో సీతమ్మ వారు గురువుగారికి కనిపించి , అర్హత లేని వారికి నా మంత్రం ఎందుకు ఇచ్చావు ? 
ఇకనించీ నువ్వు పిలిస్తే రాను అన్నారుట . 
గభాలున లేచి వారు కన్నీరు మున్నీరు గా విలాపించారుట .

కాలం గడుస్తోంది . కొన్నాళ్ళకి వారింట్లో శ్రీరామనవమిని రామపట్టాభిషేకం ప్రతిసారిలాగే నిర్వహిస్తున్నారు . తండోపతండాలుగా శిష్యులు వచ్చి ఉన్నారుట . 
గురువుగారు శ్రీరామచంద్రుని ఆవాహన చేసి , తరువాత సీతమ్మను ఆవాహన చేయబోయి ఆగిపోయారట . 
తల్లి రానని చెప్పిందిగా . ఏ మొహంతో పిలవగలను ? అని పాత జ్ఞాపకాలతో అశ్రుధారలు ప్రవహిస్తూంటే అలాగే చాలా సేపు ఏడుస్తూ ఉండిపోయారట .

చివరకి అతి కష్టం మీద సీతాం ఆవాహయామి అని అనగలిగేరట . 
వెంటనే వచ్చి తల్లి అక్కడ కూర్చున్నదట . 
ఆయన సంతోషానికి హద్దులు లేవు . 
గద్గద స్వరం తో 'రానన్నావు కదా తల్లీ . ఈ దాసుని మీద అంత దయా?' అని ఆనంద బాష్పాలు రాలుస్తున్నారట .

ఏం చెయ్యనురా ! శ్రీ రాములవారిని పిలిచావు ముందు . వారొచ్చి మాట్లాడకుండా కూర్చున్నారు నీ యెదుట . 
నేను రాకేం చెయ్యను ? అన్నదట .

బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు చెప్పినది. 

ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటుంది... అందరికీ మంత్రోపదేశం పొందాలని కుతూహలం. కానీ అది పొందిన తర్వాత జపం చేసే ఓపిక గానీ, ఆ నియమాలు పాటించాలన్న తపన గానీ చాలామందికి ఉండదు. అప్పుడు ఆ మంత్రదేవతకు ఆగ్రహం వస్తుంది. మీకు ఉపదేశం ఇచ్చిన పాపానికి ఆ గురువు కష్టాలపాలవుతారు. కనుక ఉపదేశం పొందాలనుకునే ముందు అన్నిటికి సిద్ధపడే తీసుకోవాలి.

Tuesday, June 23, 2020

శ్రీ కృష్ణ పరమాత్మకు 8 సంఖ్యకు ఉన్న సంబంధం ఏమిటో తెలుసా....?

శ్రీ కృష్ణ పరమాత్మకు 8 సంఖ్యకు ఉన్న సంబంధం ఏమిటో తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదవాల్సింది. శ్రీ కృష్ణుడు పుట్టిన తిథి  అష్టమి. దశావతారాల్లో ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణుడు. 

దేవకీ వసుదేవులకు అష్టమ గర్భం. ఆయనకు భార్యలు ఎనిమిదిమంది. కృష్ణుని జన్మనక్షత్రమైన రోహిణి నక్షత్ర క్రమంలో నాలుగవది. అంటే అష్టమ సంఖ్యలో సగం. పదహారు వేలమంది గోపికలు. పదహారు సంఖ్యను, ఎనిమిది సంఖ్యతో భాగించవచ్చును.
 
ఇక జ్యోతిష్యశాస్త్రం ప్రకారం అష్టమం ఆయఃస్థానం. లగ్నం నుండి ఆరవస్థానం మేనమామ. అష్టమత్‌ అష్టమం కూడా ఆయువును చూస్తుంది. అంటే అది మేనమామకు తృతీయం అన్నమాట. 'అష్టమి అష్టకష్టాలు' అన్న నానుడి ఉంది. కానీ జయ తిథికి దుర్గాదేవి అధిష్ఠాన దేవత. విజయసూచిక ఎనిమిది సంఖ్య శని గ్రహాన్ని సూచిస్తుంది. శని ఆయుఃకారకుడు. ఎనిమిది సంఖ్యను రాయటం మొదలుపెడితే ఆ సంఖ్యను ఆపకుండా రాయవలసి వస్తుంది.
 
రోహిణి నక్షత్రం చంద్రుడికి ఉచ్ఛస్థానం. సహజ చతుర్ధాధిపతి చంద్రుడికి ప్రాధాన్యం రోహిణి నక్షత్రం. అంటే మనఃకారకుడు. చంద్రుడు మాతృ, ఆహార, వాహన, గృహభోగాన్ని సూచిస్తాడు. ఆత్మకారకుడు రవి. అగ్నిని మానవుడికి తానే ఇస్తానని సూచించాడు. సహజ ఆరవ స్థానం శత్రు, రోగ, రుణాలను సూచిస్తుంది. దానికి అధిపతి బుధుడు (అంటే నారాయణుడన్నమాట). అందుకే 'వైద్యో నారాయణో హరిః' అనమని పెద్దలు చెప్తున్నారు. అందుచేత శ్రీకృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుడిని స్మరించుకుంటే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.

బ్రహ్మ జ్ఞానానికి మూలము

త్రిపురాలు..మనిషిని మింగేస్తున్నా మూడు వికారాలు-నేను,నాది,నాదికానిది.
'నేను' అంటే -నా శరీరం,నా మనసు.

'నాది' అంటే-నా ఆస్తి, నా జ్ఞానం, నా కుటుంబం, నా అధికారం.
'నాది కాదు'అంటే-నాకు అందనిది,అందుబాటులో లేనిది,నేను అందుకోవాలని ఆరాట పడుతున్నది...ఏదయినా కావచ్చు..

'నాది' అనుకోవడములో బాధ ఉంది.'నాది కాదే'!అనుకోవడములోను బాధ ఉంది.మొత్తంగా 'నా...'అనే ఆలోచనే వద్దు అంటుంది "నీ తత్వము"..ఈ మూడు దుఃఖ కారకాలే..ఆ త్రివిధ వికారాలకి ప్రతీకలైన ముగ్గురు రాక్షసులు మూడు ఎగిరే నగరాలని సృష్టించుకొని ముల్లోకాలని అల్లకల్లోలం చేస్తుంటారు.

ఆ మూడు నగరాలని ఒకే బాణంతో నేలకూల్చాలి. లేదనంటే లేదు.అది వారి ధైర్యము,వారికున్న వరము.ఒకే సరళరేఖలో ఎగురుతున్నప్పుడే దుష్టశిక్షణ సాధ్యమవుతుంది... త్రిపురాల్ని నాశనం చేయడమంటే...నేను,నాదీ, నాదికాదు అన్న భావనల్ని తొలగించుకోవడమంటే... ఎంత కష్టం! 

మనలోని సమస్త శక్తుల్ని కూడగట్టుకోవాలి.నువ్వు చేసింది అదే కదా....
"భూమిని రథము చేసుకున్నావు,(భూమి వాస్తవిక దృక్పథానికి ప్రతీక)సూర్యచంద్రుల్ని చక్రాలుగా అమర్చకున్నావు(ఆ రెండు జీవితములో ఎత్తుపల్లాల్ని ప్రతిబింబిస్తాయి).బ్రహ్మ సారథ్యం  వహించాడు(బ్రహ్మ జ్ఞానానికి మూలము)..మేరుపర్వతము వింటి చాపమైంది(కొండ ఆత్మబలానికి రూపము),శేషుడు వింటినారి అయ్యాడు,సర్పం శరము అయ్యింది.(సర్పాన్ని సంధించడమంటే కోరికల్ని జయించడము) పరిపూర్ణ ఆత్మవిశ్వాససముతో వెన్నంటి తరమగా..త్రిపురాలు ఒకే సరళరేఖ మీదకి వచ్చాయి.నీ బాణం దెబ్బకి కాలి బూడిద అయిపోయాయి.. నాలోను తిష్టవేసుకున్న త్రిపురాసుల్ని సంహారం చేసేటంతటి శక్తిని ప్రసాదించు ప్రభు....

సాలగ్రామములు-పుట్టు పూర్వోత్తరాలు

సాలగ్రామము విష్ణుప్రతీకమైన ఒక శిలా విశేషము. సర్వకాల సర్వ్యావస్థలయందు విష్ణువు సాక్షాతూ సాన్నిధ్యం కలిగి ఉండేది సాలగ్రామంలో మాత్రమే. అందుచేతే గృహదేవతార్చనలలోగానీ, దేవాలయాలలోగానీ సాలగ్రామము (మూర్తి) లేకుండా పూజలు కొనసాగవు. ద్వైతులు, విశిష్టాద్వైతులు, అద్వైతులు తమతమ దేవతార్చనలలో సాలగ్రామములను పూజకు ఉపయోగిస్తారు.
భారతదేశంలో సాలగ్రామ పూజ బహు పురాతనమైనది. క్రీస్తు కంటే ప్రాచీనుడైన అపస్తంబుడు సాలగ్రామ పూజను పేర్కొన్నాడు. త్రిమతాచార్యులు తమతమ భాష్యాలలో సాలగ్రామాలు విష్ణురూపాలని వివరించారు. దేవాలయాలలో పంచాయతన మూర్తులకు శిలా ప్రతిమలు ఉంటే గృహస్థులకు మణి, స్వర్ణ నిర్మితమైన మూర్తులు, సాలగ్రామములు ఉంటాయి. సాధారణంగా ప్రతిమలకు నిత్య పూజా సమయంలో ఆవాహనాది షోడశోపచారాలు చేయాలి. సాలగ్రామాలలో దేవత నిత్యం సన్నిహితమై ఉండడం వల్ల వాటికి పూజా సమయంలో అవాహనాది ఉపచారాలు అవసరం లేదు.
హిందువులందరికీ తులసి, శంఖం, సాలగ్రామం పూజనీయమైనవి. తులసి హిందువుల ఇహపర సాధనానికి భూలోకంలో అవతరించిన వనదేవత. ఈ తులసి అపూర్వమైన మూలిక కూడా. శంఖం అత్యంత పవిత్రమైనది. శంఖారావం వ్యాపించినంత దూరం సూక్ష్మక్రిములు నశిస్తాయి అంటారు. నీరు శంఖంలో పూరిస్తే తీర్థం అవుతుంది. వట్టివేళ్ళు, ఏలకులు, లవంగాలు, పచ్చ కర్పూరం మొదలైన సుగంధ ద్రవ్యాలు చేర్చిన నీటిని శంఖంలో పోసుకుంటూ సాలగ్రామాలకు పురుషుసూక్తం పఠిస్తూ అభిషేకం చేసిన తీర్థం సర్వశక్తివంతం. ఇటువంటి తీర్ధాన్ని భక్తితో సేవిస్తే ప్రాయశ్చిత్తం, పాపక్షయం కలుగుతుంది. తీర్ధాన్ని మూడుసార్లు తీసుకుంటారు. మొదటిది కాయసిద్ధి కొరకు, రెండవది ధర్మసాధనకు,మూడవది మోక్షం పొందడానికి. అసలీ తీర్ధం అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షయం కలుగుతాయి.
సాలగ్రామాలు ఉన్న ఇల్లు గొప్ప పుణ్యక్షేత్రంతో సమానం. సాలగ్రామ దర్శనం వల్ల, స్పర్శవల్ల, అర్చనవల్ల అంతులేని పుణ్యం లభిస్తుంది. సాలగ్రామాలు శిలాజాలు. శాస్త్రజ్ఞులు ఈ శిలలను ఒక విధమైన ప్రాణి నిర్మిస్తుందని అంటారు. ఆలి అనే ఒక విధమైన మత్స్యం శీతాకాలంలో తన శరీరం నుంచి వెలువడే ఒక విధమైన రసాయనిక పదార్ధంతో శిలామయమైన కవచాన్ని నిర్మించుకుని దానిలో నివశిస్తుందని అది మరణించినప్పుడు లేక వదిలి వెళ్ళినప్పుడు అవి సాలగ్రామాలుగా మనకు లభిస్తాయని అంటారు. సాలగ్రామాల మీద వివిధ దేవతా చిహ్నాలు ఉంటాయి. ముఖ్యంగా చక్రం, పద్మం ప్రధాన చిహ్నాలు. విష్ణు భక్తులైన మాధ్వులకు, వైష్ణవులకు ఇవి పూజకు ఎంతో విలువైనవి. వైష్ణవ పురాణాలు, ఇతవ వైష్ణవ గ్రంధాలు వీటిని గురించి సవిస్తరంగా వివరిస్తాయి.

నేపాల్ దేశంలో ఖట్మండుకు సుమారు 197 మైళ్ళు దూరంలో ముక్తినాధ్, గండకీ నదీ తీరంపై ఉన్న మహాషేత్రంలో ఇవి లభిస్తాయి. ఇవి సాధారణంగా స్థలజాలు, జలజాలు అని రెండు రకాలు. గండకీ నదీ తీరాన్ని ఆనుకుని ఉన్న సాలగ్రామ గిరిపైన స్థలజాలు, గండకీ నదీ గర్భంలో జలజాలు లభిస్తాయి.

 సాలగ్రామాలలో బంగారం ఉంటుంది. అందుకే వాటిని హిరణ్యగర్భ అని కూడా అంటారు. సాలగ్రామాలు అమోనైట్ శిలామాలు. ఇండియాలో ఈ సాలగ్రామాలు సముద్రంలో నివసించే టెథైస్ అనే ప్రాణి వల్ల ఏర్పడతాయి. ఇటువంటి శిలాజాలు అనేక రకాలు ఉన్నాయి. 250 మిలియన్ సంవత్సరాలలో ఇండియా ఉత్తర దిక్కుగా 9,000 కి.మీ. జరిగిపోయింది. హిమాలయాలు ఏర్పడ్డాయి. వీటి నుండి అనేక నదులు ప్రవహించాయి. ఇండో మైదానంలోకి ప్రవహించిన అటువంటి నదులలో ఒకటి గండకి. సాలగ్రామములు మన శాస్త్రం అనుసరించి కొన్ని సౌమ్యమైనవి. కొన్ని ఉగ్రమైనవి. శాస్త్ర సమ్మతంగా చక్రశుద్ధి, వక్త్రశుద్ధి, శిలాఉద్ధి, వర్ణశుద్ధి గల వాటినే పూజించాలి. రకరకాల రంగులు గలిగిన కారునలుపు, భగ్నమైన, మొక్కవోయిన సాలగ్రామాలను పూజించకూడదు. నారసింహ పాతాళ నారసింహ, గండభేరుండ, మహాజ్వాల మొదలైనవాటిని సన్యాసులు, బ్రహ్మచారులు పూజించాలి. విష్ణు, సీతారామ, గోపాల వంటి శాంతమూర్తులనే గృహస్థులు పూజించుకూవాలంటారు. పరిమాణాన్నిబట్టి కూడా పూజార్హతను నిర్ణయించుకుంటారు.. సాధారణంగా ఇవి ప్రతి గృహంలోనూ వంశపారంపర్యంగా సంక్రమిస్తుంటాయి. సాలగ్రామ శిలామహత్మ్యం గురించి వేరే చెప్పనక్కరలేదు. తిరుపతిలో శ్రీ వేంకటేశ్వరునికీ, మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్ర స్వామి వారికీ అంతటి మహిమ ఉండడానికి కారణం అక్కడ ఉండే సాలగ్రామాలు అంటారు. 

సాలగ్రామాన్ని పూజిస్తే ఎంత పుణ్యం లభిస్తుందో దాని దానం వలన కూడా అంతటి ఫలం లభిస్తుంది.
2 )పూర్వం విదేహరాజ్యంలో ప్రియంవద అనే స్ర్తీమూర్తి ఉండేది. అత్యంత రూపవతి, గుణవతి అయిన ఆమె, శ్రీమన్నారాయణుని ప్రసన్నం చేసుకుని, ఆయన తన కుమారునిగా జన్మించాలని కోరుకుంటుంది. ఆమె కోరి కను మన్నించిన స్వామివారు, మరుజన్మలో ఆమె గండ కీ నది రూపాన్ని ధరించేటట్లుగా చేసి, తాము సాల గ్రామ రూపంలో ఆ నది నుంచి ఉద్భవిస్తున్నారని కథ.సాలగ్రామ శిలయందు, చరాచరాత్మకమగు మూడు లోకాలు అణిగి ఉన్నాయి. ఆ కారణంగా సాలగ్రామాన్ని భక్తిశ్రద్ధలతో, పరిపూర్ణ విశ్వాసంతో, శాస్త్ర ప్రకారం అభిషేకిస్తే, కోటి యజ్ఞాలు చేసినంత పుణ్యఫలానికి సమానమవుతుంది. మరియు కోటి గోవులను దానం చేసినంత ఫలితాన్ని పొందుతారు. సాలగ్రామ పూజచే, శివకేశవులని పూజించిన ఫలితం కలుగుతుందిట.

సాలగ్రామం వున్న ప్రదేశాలలో స్నానం చేసినా, దానం చేసినా, కాశీ క్షేత్రంలో పవిత్ర గంగానదీ స్నానంకంటే, ఆ పుణ్యక్షేత్రంలో చేసిన దానం కంటే, నూరె రెట్లు అధి క ఫలము కలుగుతుంది. సాలగ్రామమును అభిషేకిం చిన పుణ్య బలాలను ప్రోక్షించుకొనినచో, సర్వపాపాల ను నశింపజేస్తుంది. సర్వరోగాలు తొలగిపోతాయి. సక ల సంపదలు కలుగుతాయి, సర్వశుభాలను కలిగించి, మోక్ష సామ్రాజ్యమును సిద్ధింపజేస్తుంది. సాలగ్రామ మును అభిషేకించిన జలాలను ప్రోక్షించుకొనిన యెడల, పవిత్ర గంగానదీ స్నానమాచరించిన యెడల సర్వ తీర్థాలలో స్నానమాచరించిన పుణ్యఫలం కలిగి, సర్వదేవతలను ఆరాధించిన ఫలితం కలుగుతుంది.

ఒక్కసారి భక్తిశ్రద్ధలతో సాలగ్రామాన్ని శాస్త్ర ప్రకారం పూజించి, అభిషేకించితే కోటి లింగాలను దర్శించి, పూజించి, అభిషేకించిన ఫలితం కలుగుతుంది. సాల గ్రామ తీర్థం సేవించినచో, వెయ్యిసార్లు పంచామృత మును సేవించిన ఫలితముకంటే, ప్రాయశ్చిత్తముల యందు ఆచరించు దానాలు ఫలితం కంటే అధిక ఫలి తం ఉంటుంది. కనీసం, సాలగ్రామాన్ని అర్చించు టకు మంత్రాదులు తెలియకున్నప్పటికీ, శక్తిననుసరించి పూర్తి భక్తివిశ్వాసాలతో పూజిస్తే, కొన్ని ఫలితాలైనా కలు గుతాయి. సాలగ్రామ శిల యందు ఉంచిన అన్ని పదార్థములు పవిత్రములవుతాయి. సాలగ్రామమును ముందుంచు కుని పితృదేవతలకు తర్పణాలను ఇచ్చన ఎడల, ఆ పితృదేవతలు స్వర్గంలో శాశ్వత సుఖాలను పొందు తారు. అన్ని విధాలైన పుణ్యాలకు పరిమితులున్నాయి గాని, ఈ సాలగ్రామశిల పూజచే కలుగు పుణ్యానికి పరిమితులు లేవు. అతల, వితల, రసాతల, పాతాళాది పధ్నాలుగు లోకాలలో ఈ సాలగ్రామ శిలకు సరిపడునట్టి వేరొక శిల లేదన్నదే శాస్తవ్రచనం.
కార్తీక మాసంలో సాలగ్రామ శిలపై ‘స్వస్తిక’ మండల మును రచించినచో అనంతమైన పుణ్యఫలము కలుగు తుంది. సంవత్సరకాలం గృహంలో ‘నిత్యాగ్ని హోమం’ చేసిన ఫలితానికి సమానమైన ఫలితాన్ని పొందుతారు. సాలగ్రామంపై శుద్ధమైన మట్టితో గాని, రంగులతో గాని, ఏ కొద్దిపాటి కేశవనామాలను వ్రాసినా, కోటి కల్పాల వరకూ స్వర్గంలో నివసించే భాగ్యం కలుగు తుందిట. పూజాపీఠంలో సాలగ్రామమును ఉంచితే, సమస్తమైన పూజలు సక్రమంగా సాగి పరిపూర్ణ ఫలితాలను పొందుతారు. సాలగ్రామాలు ఎంత చిన్నవిగా ఉంటే అంత మంచిది. సాలగ్రామాలు పగిలి నప్పటికీ, పెచ్చు పూడినప్పటికీ కూడా పూజార్హత కలిగి ఉంటాయి. కొన్ని సాలగ్రామాలు ఇంట్లో పెట్టుకుని పూజించుటకు అర్హత కలిగి ఉండవు. విపరీత పరి మాణామాలు కలుగుతాయి, కాబట్టి ఇంట్లో పెట్టుకుని పూజించాలనుకుంటే, సాలగ్రామములను గురించి క్షుణ్ణంగా తెలిసిన పండితుల అమూల్యమైన అభిప్రా యాలను తెలుసుకుని ఆచరించటం శ్రేయస్కరం.
సాలగ్రామంపై గల చక్రాలను బట్టి వాటికి వివిధము లైన పేర్లు ఉన్నాయి.

1 చక్రం ఉంటే - సుదర్శనం అని,

2 చక్రములు ఉంటే - లక్ష్మీనారాయణ అని,

3 చక్రములు ఉంటే - అచ్యుతుడు అని,

4 చక్రములు ఉంటే - జనార్ధనడు అని,

5 చక్రములు ఉంటే - వాసుదేవుడు అని,

6 చక్రములు ఉంటే - ప్రద్యుమ్నుడు అని,

7 చక్రములు ఉంటే - సంకర్షణుడు అని,

8 చక్రములు ఉంటే - పురుషోత్తముడు అని,

9 చక్రములు ఉంటే - నవ వ్యూహము అని,

10 చక్రములు ఉంటే - దశావతారము అని,

11 చక్రములు ఉంటే - అనిరుద్ధుడు అని,

12 చక్రములు ఉంటే - ద్వాదశాత్ముడు అని,

12 చక్కముల కన్నా ఎకువ ఉంటే ‘అనంతమూర్తి’ అని అంటారు. సాలగ్రామాలు తెల్లనివైతే సర్వపాపాలను హరిస్తాయి. పసుపుపచ్చనివి అయితే సంతానభాగ్యాన్ని కలిగిస్తాయి. నీలవర్ణంగలవి అయితే సర్వసంపదలను ఇస్తాయి. ఎరుపురంగు గలవి అయితే రోగాలను కలిగిస్తాయి, వక్రముగా వున్న సాలగ్రామాలు దారి ద్య్రాన్ని కలిగిస్తాయి.నలుపు రంగు కలిగి, దానికి గల చక్రం మధ్య భాగంలో కొద్దిగా ఉబ్బినట్లుగా వుండి, రేఖపొడవుగా ఉంటే, దానిని ‘ఆదినారాయణ సాలగ్రామం’ అని అంటారు.

తెలుపురంగు కలిగి రంధ్రంవైపున రెండు చక్రాలు ఒక దానితో ఒకటి కలిసిపోయినట్లు ఉంటే, దానిని ‘వాసు దేవ సాలగ్రామం’ అని అంటారు. ఇది సర్వ శ్రేష్టమై నది. ఇది ఆధ్యాత్మికతను పెంపొందిస్తుంది.

పసుపు పచ్చ రంగు కలిగి గుండ్రంగా వుండి, రంధ్రం వైపున మూడు రేఖలు ఉండి, ‘పద్మ చిహ్నం’ పైముఖం గా ఉంటే దానిని ‘అనిరుద్ధ సాలగ్రామము’ అని అం టారు. ఇది చాలా మంచిది. కపిలవర్ణం కలిగి, చక్రం పెద్దదిగా ఉంటే, దానిని ‘నర సింహ సాలగ్రామం’ అని అంటారు. దీనిని బ్రహ్మచర్య దీక్షతోనే పూజించాలి. బంగారు వర్ణంతో పొడవుగా వుండి మూడు బిందువులతో వున్నదానిని ‘మత్య్సమూర్తి సాలగ్రామం’ అని అంటారు. ఇది భక్తిని పెంచి ముక్తిని కలిగిస్తుంది. సంపదలను ఇస్తుంది. నలుపు రంగుతో, మెరుస్తూ వుండి ఎడమవైపున గద, చక్రాలు, కుడి వైపున రేఖ వున్నదానిని ‘సుదర్శనమూర్తి సాలగ్రామం’ అని అంటారు. శత్రుబాధలు నుండి రి స్తుంది. వివిధ వర్ణములతో వుండి, అనేక చక్రాలు, అనేక రేఖలు వున్నదానిని ‘అనంతమూర్తి సాలగ్రామ ము’ అని అంటారు.

ఈ సాలగ్రామం సకలాభీష్టాలను తీర్చుతుంది. 3 ముఖాలు, 6 చక్రాలు కలిగి నేరేడు పం డు ఆకారంలో ఉన్న దానిని ‘షట్చక్రసీతారామ సాల గ్రామం’

అని అంటారు. ఇలాంటి సాలగ్రామం దొర కటం దుర్లభం. ఈ సాలగ్రామాన్ని పూజించనవారికి అష్టైశ్వర్యములు కలుగుతాయి. ఇంకా కొన్ని అపురూప మైన సాలగ్రామాలు కూడా ఉన్నాయి. ఇంట్లో పూజిం చు సాలగ్రామానికి నిత్యనైవేద్యం తప్పనిసరిగా పెట్టాలి.

 కుటుంబ సభ్యులు మినహా అన్యులు సాలగ్రామాన్ని దర్శించరాదు.సర్వపాపపరిహారమైనది, సర్వవిధాలైన కష్టాల నుండి రక్షించేది, సర్వ పుణ్యణఫలాలను ఇచ్చేది, సర్వదేవతా పూజాఫలితాలను ఇచ్చేది, సర్వశ్రేయస్కరమైనది, సర్వో త్కృష్టమైనది, సర్వాంతర్యామి యొక్క ప్రతీక అయిన ‘సాలగ్రామాన్ని’ పూజించుకునే భాగ్యం ఈ కలియుగం లో మానవులమైన మనకు కలగటం, నిజంగా అపూర్వ మైన అదృష్టం. అటువంటి అవకాశాన్ని వినియోగించు కుని, జీవితాన్ని ధన్యం ఒనర్చుకుని, శాశ్వతానందాన్ని పొంది ముక్తిని పొందటం భక్తిపరుడైన మానవునికి ముఖ్యకర్తవ్యం అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అవకాశం దొరికితే, ఆ పుణ్యఫలాన్ని దక్కించుకు నేందుకు ప్రయత్నించాలి.
మరోకథ ప్రకారం, ఒకానొకసారి సృష్టిలోని జీవులన్నీ విపరీతమైన పాపపు చేష్టలను చేస్తుండేవి. ఆ దృశ్యా లను చూసిన బ్రహ్మదేవుడు, ఇంతడికీ కారణం తన సృష్టే కదా! తాను చేసిన సృష్టిలో 
ోపం ఉండబట్టే కదా, జనం ఇలా పాపకృత్యాలలో మునిగిపోతున్నారని బాధపడు తుండగా, ఆయన కళ్ళెంబడి రెండు కన్నీటి చుక్కలు రాలిపడ్డాయట. ఆ కన్నీటి చుక్కలే గండకీనది గా మారాయని కథనం. ఇలా సాలగ్రామాన్ని గురించిన అనేక కథలు మన పురాణాలలో కనబడుతున్నాయి.
సాలగ్రామాలను ఆవుపాలతో గాని, పంచామృముతోగాని శుద్ధి చేయాలి. 

‘రుద్రాక్షధారణ’ నియమాలనే, సాలగ్రామ పూజలోనూ పాటించాలి. ప్రత్యేక సమయాలలో, సంక్రమణకాలాలలో, గ్రహణ సమయాలలో 
ఆయా సాలగ్రామాలననుసరించి ఆయా 
దైవజపాలను 1008 సార్లు చేసినా, 
చేయించుకున్నా, ఆ సాలగ్రామము యొక్క శక్తి ద్విగుణీకృతమవుతుంది.
సాలగ్రామశిలను షోడశోపచార 
పూజావిధానం ద్వారా అర్చించిన భక్తులకు యావత్‌ కల్పాంతముల వరకు 
వైకుంఠంలో నివసించే భాగ్యం కలుగుతుంది. 
కనీసం సాలగ్రామంకు భక్తిశ్రద్ధలతో 
నమస్కరించి, యథావిధిని పూజిస్తే, మరుజన్మ లేకుండా ముక్తి పొందుతారని ప్రతీతి.

 సాలగ్రామ మును స్మరించినా, దర్శించినా, నమస్కరించినా, సర్వపాపాలు పరిహరింపబడతాయి.

వినయం వివేక లక్షణమ్

శ్రీమద్రామాయణం లోని కథ
పరమాత్ముడైన శ్రీ రామ చంద్రుడు అమిత పరాక్రమశాలి మహావీరుడు ధనుర్విద్యానిపుణుడు. శ్రీ రాముడు బ్రహ్మర్షి అగు వసిష్ఠ మహర్షి వద్ద సకల శాస్త్రములు ధనుర్విద్య అభ్యసించినాడు. గాయత్రీ మంత్రద్రష్ట అగు విశ్వామిత్ర బ్రహ్మర్షి వద్ద బల అతిబలాది విద్యలు మఱియు ఎన్నెన్నో అతి రహస్యములైన అస్త్రములను నేర్చినాడు. ఈ అస్త్రములు కేవలము విశ్వామిత్రులవారికే తెలియును. ఇదియే కాక పరమపూజనీయుడగు అగస్త్య మహర్షి శ్రీ రామ చంద్రునకు దివ్య ధనువు అక్షయ తూణీరము రత్నఖచిత ఖడ్గమును ప్రసాదించెను.

ఒక్క బాణముతో శ్రీ రామ చంద్ర మూర్తి మహాబలశాలియైన తాటకను నేలకూల్చెను
ఒకేమాఱు రెండు బాణములు వదిలి సుబాహు సంహారము చేసి మారీచుని సప్తసముద్రాలకు అవతల పారవేశను
మహాభారవంతమైన శివచాపమును అవలీలగా ఎత్తి ఎక్కుపెట్టిన అది విరిగెను
శ్రీ రాముడొక్కడే ప్రహరార్ధకాలములో (90 min.) ఖర త్రిశిర దూషణాదులను వారి సేనలను సంహరించెను
ఇంత ప్రతాపవంతుడైనప్పటికీ శ్రీ రాముడు ఎప్పుడూ తనకుతానుగా బలప్రదర్శనము చేయలేదు. ఆ దయార్ద్ర హృదయుడు సర్వదా వినయవంతుడై వర్తించెను. దీనికి తార్కాణము సముద్రుని గర్వభంగ ఘట్టము.

శ్రీ రాముని సైన్యము సముద్ర లాంఘనము చేయుసమయము వచ్చెను. సర్వజ్ఞుడైన రాముడు ఉపాయము ఎఱిగియు సహజ వినయవంతుడగుటచే పరమభాగవతోత్తముడైన విభీషణుని సలహా అడిగెను. విభీషణుడు ఇట్లు పల్కెను “ఓ రఘునాయకా! మీ బాణమొక్కటే కోటి సముద్రములనైనను శుష్కింప చేయగలదు. ఐనను సముద్రునే ఉపాయమడుగ ఉత్తమమని నా యోచన”.

రావణుడు తనను వివాహమాడమని హెచ్చరించి సీతమ్మవారికి నెల రోజుల గడువు ఇచ్చెను. భరతుడు పదునాలుగేండ్లపై ఒక్క నిమిషము కూడా శ్రీ రామునికి దూరంగా ఉండజాలక శ్రీ రాముడు ఆలస్యమైన పక్షంలో శరీరత్యాగం చేసెదనని ప్రతిజ్ఞబూనెను. ఈ రెండు కారణముల వలన శ్రీ రాముని వద్ద అప్పటికి పట్టుమని ౩౦ రోజులుకూడాలేవు. ఐనను రఘురాముడు తన బలప్రదర్శనము చేయక వినయముతో సాగరుని ప్రార్థింప నిశ్చయించెను.

శ్రీ రాముడు ఉదధిని సమీపించి సముద్రునకు శిరసా ప్రణమిల్లెను. పిదప తీరమున దర్భలు పరచి ఆ దర్భాసనం పైన కూర్చుని తదేక దృష్టితో సముద్రుని ప్రార్థించెను. ఇట్లు ౩ దివసములు సముద్రునికై ప్రార్థించినను ఆ సముద్రుడు రాడాయె. చివరకు శ్రీ రాముడు “ఈతనికి సామముగా చెప్పిన వినడాయె. ఇటువంటి వారికి దండోపాయయే సరియైనది” అని సముద్రునిపై అస్త్రం సంధించెను. శ్రీ హరి కోపమును భరింపగలవారెవ్వరు? వెంటనే సముద్రుడు ప్రత్యక్షమయ్యెను. అంత దయాళువైన శ్రీ రాముడు సముద్రుని క్షమించి తాను ఎక్కుపెట్టిన అమోఘ బాణము దేనిమీద ప్రయోగింపవలెనని అడిగెను. సముద్రుడు ఉత్తరాన దుష్టులైన కాలకేయ రాక్షసులు ఉన్నారని సూచించెను. అంతట శ్రీ రాముడు ఆ అస్త్రముతో ఆ రాక్షసుల సంహారముచేసి ఆ కాలకేయులుండే పర్వతం ఔషధాలకు నిలయమై ప్రజాహితం చేకూర్చునని ఆశీర్వదించెను.

నామస్మరణం

నవవిధ భక్తిమార్గాల్లో స్మరణం చాలా ముఖ్యమైనది. పరమాత్మతో ఆత్మానుసంధానానికి, భక్తికి నామస్మరణమే కీలకమైనది. దైవ నామస్మరణ వల్ల భక్తుడి హృదయంలో భక్తిభావన వెల్లివిరుస్తుంది. మనసు ప్రశాంతంగా ఉండాలన్నా, నిర్మలత్వం సంతరించుకోవాలన్నా భగవంతుణ్ని స్మరించాలని పురాణాలు చెబుతున్నాయి.

ఈ భారతావనిలో ఎందరెందరో భక్తులు భగవంతుణ్ని స్మరిస్తూ తమ కర్తవ్యాన్ని నిష్ఠతో చేసి జన్మను సార్థకం చేసుకున్నారు.

రామనామం జపిస్తూ హనుమంతుడు సముద్రాన్ని ఆకాశమార్గంలో దాటి లంకానగరం చేరాడు. హరినామ సంకీర్తన చేసిన ప్రహ్లాదుణ్ని ఎన్ని బాధలు పెట్టినా ఏ విధమైన హానీ జరగలేదు. కృష్ణనామస్మరణం చేసిన మీరాబాయికి విషం        అమృతతుల్యమైంది.

ఎంత చెడ్డవాడైనా, అనన్యమనస్కుడైనా తనను ఆరాధించి సేవిస్తే వాణ్ని సజ్జనుడిగానే పరిగణించాలని బోధించాడు శ్రీకృష్ణపరమాత్మ.

ఉత్తమకులంలో పుట్టి, చెడిపోయిన అజామీళుడు ప్రాణావసాన సమయంలో ‘నారాయణ’ పేరును స్మరించినంతనే మోక్షప్రాప్తి కలిగిందంటుంది భాగవతం.

దైవనామ స్మరణ మనిషిలోని మాలిన్యాన్ని క్షాళన చేసి ధర్మమార్గం వైపు నడిపిస్తుంది. సర్వశక్తిమంతుడు, సర్వాధీశుడు అయిన భగవంతుడి నామస్మరణ వల్ల ‘నేను’ అనే అహంకార గోడ అడ్డు తొలగిపోతుంది. మనసు భగవంతుడి పాదపద్మాలపై నిలుస్తుంది.

కర్తవ్యాన్ని నిష్ఠతో ఆచరిస్తూ ప్రాతఃకాలం, సాయంకాలాల్లో ఒక్కసారి భగవత్‌ స్మరణ చెయ్యడం కూడా గొప్పతనమేనని వివరించే కథ ఉంది.

ఒకరోజు నారదుడు వైకుంఠంలో శ్రీమహావిష్ణువు సన్నిధిలో ఉన్నాడు. తనకంటే గొప్ప భక్తుడెవరూ లేరనే అహంకారం నారదుడికి కలిగింది. తానెప్పుడూ నారాయణ నామస్మరణ చేస్తాడు కనుక తానే ఉత్తమ భక్తుడు అనుకున్నాడు. ఆ భావాన్ని మహావిష్ణువు ముందు వ్యక్తీకరించాడు. నీకంటే గొప్పభక్తుడు ఫలానా గ్రామంలో ఉన్నాడు. నువ్వు అక్కడికి వెళ్ళు అని నారదుడిని పంపాడు విష్ణుమూర్తి. నారదుడు ఆ గ్రామం వెళ్ళి ఆ భక్తుణ్ని చూశాడు. అక్కడ ఒక రైతు తెల్లవారుజామున లేవగానే ‘నారాయణ’ అనుకుని తన పనుల్లో నిమగ్నమయ్యాడు. తిరిగి రాత్రి ‘నారాయణ’ అనుకుని పడుకున్నాడు. రోజుకు రెండుసార్లు మాత్రమే నారాయణ స్మరణ చేస్తున్న ఇతడు గొప్ప భక్తుడా అనుకుని, నారదుడు తాను చూసినది చూసినట్లుగా మహావిష్ణువుకు చెప్పాడు.


అప్పుడు మహావిష్ణువు నారదుణ్ని పరీక్షించదలచి ‘నీకు ఒక నూనెగిన్నె ఇస్తాను. అది పట్టుకుని ఒక్కబొట్టు కిందపడకుండా వైకుంఠం అంతా తిరిగిరావాలి’ అన్నాడు. నారదుడు ఆ గిన్నె తీసుకుని వైకుంఠం అంతా తిరిగి మహావిష్ణువు దగ్గరికి తిరిగివచ్చాడు. ‘నారదా! నువ్వు ఎన్నిసార్లు భగవన్నామం స్మరించావు?’ అని అడిగాడు విష్ణువు. దానికి జవాబిస్తూ నారదుడు ‘గిన్నెలో నుంచి నూనె బొట్టు కిందపడకుండా చూస్తున్నాను. మీ నామాన్ని ఒక్కసారి కూడా స్మరించలేదు’ అన్నాడు. అప్పుడు  నిజమైన భక్తుడెవరో గ్రహించాడు నారదుడు.

భగవంతుడి నామస్మరణ ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనే సందేహాలు చాలామందిలో కలుగుతుంటాయి. భగవంతుణ్ని స్మరించడానికి ఎలాంటి నియమాలు లేవు. సర్వకాల, సర్వావస్థల్లోనూ స్మరించుకోవచ్చు. మన పనులు నిత్యం చేస్తూనే శుద్ధ భక్తితో భగవంతుణ్ని స్మరించాలి.

అసలు స్మరణ ఎందుకు చేయాలంటే భగవదనుగ్రహం కోసమే. వార్థక్యంలో మాత్రమే భగవంతుణ్ని స్మరించుకుందాం అనుకోకూడదు. దైవచింతనకు వయసుతో నిమిత్తం లేదు.

Miracle Lakshmi Narasimha stotram

ఈ  స్తోత్రం  రోజూ భక్తితో పటించండి.........
శ్రీ నృసింహ స్వామి వారి ద్వాదశ నామ స్తోత్రం మహా మహిమాన్వితం శక్తివంతం,ఈస్తోత్రాన్ని భక్తిగా పఠిస్తే స్వామివారు మనకు రక్షా కవచంలా ఉండి కాపాడతారు.అతి భయంకర వ్యాధులు రుగ్మతులు నశిస్తాయి,భయంతొలగుతుంది,

 *శ్రీ నృసింహ ద్వాదశ నామ స్తోత్రం.......* 

ప్రథమంతు మహాజ్వాలో ద్వితీయం తు ఉగ్రకేసరీ ।

తృతీయం తు వజ్రదంష్ట్రశ్చ చతుర్థం తు విశారదః ॥

పంచమం నారసింహశ్చ షష్ఠః కశ్యపమర్దనః ।

సప్తమో యాతుహంతా చ అష్టమో దేవవల్లభః ॥

నవమం ప్రహ్లాద వరదో దశమోऽనంత హస్తకః ।

ఏకాదశో మహారుద్రో ద్వాదశో దారుణస్తదా ॥

ద్వాదశైతాని నామాని నృసింహస్య మహాత్మనః ।

మంత్రరాజ ఇతి జ్ఞాతం సర్వపాప వినాశనమ్ ॥

క్షయాపస్మార కుష్ఠాది తాపజ్వర నివారణం ।

రాజద్వారే మహాఘోరే సంగ్రామే చ జలాంతరే ॥

గిరిగహ్వర అరణ్యే వ్యాఘ్ర చోరామయాదిషు ।

రణేచ మరణేచైవ శమదం పరమం శుభమ్ ॥

శతమావర్తయేద్యస్తు ముచ్యతే వ్యాధి బంధనాత్ ।

ఆవర్తయత్ సహస్రం తు లభతే వాంఛితం ఫలమ్ ॥

 ||  *ఓం శ్రీ లక్ష్మి నృసింహాయ నమః. ||*

Importance of Ganesha

వినాయకుడినే.....గణపతి, గణేశుడు, బొజ్జ_గణపయ్య అని పిలుస్తారు. ఆది దేవుడిగా, మొదట పూజలు అందుకునే దేవుడిగా వినాయకుడికి హిందూ సంప్రదాయంలో చాలా ప్రాధాన్యత ఉంది. భక్తులు కోరుకునే సంపద, శ్రేయస్సు అందించే గొప్ప దేవుడు వినాయకుడు. 
హిందూ పురాణాల ప్రకారం.. ఏ పూజ అయినా, ఎలాంటి కార్యమైనా.. ముందుగా వినాయకుడిని పూజించడం ఆనవాయితీ. చాలామంది ఇంట్లో లేదా ఆఫీస్ లో వినాయకుడి విగ్రహం పెట్టుకుంటూ ఉంటారు.

అయితే చాలామందికి ఎలాంటి విగ్రహం లేదా ఎలాంటి ఫోటో లేదా ఏ రంగు విగ్రహం, ఎక్కడ పెట్టుకోవాలి అనే విషయం తెలియదు. సరైన పద్ధతిలో, సరైన వాస్తు ప్రకారం వినాయకుడి విగ్రహం లేదా ఫోటోని పెట్టుకోవడం వల్ల.. పాజిటివ్ ఎనర్జీ మరింత పెరుగుతుంది. ఆ దేవుడి అనుగ్రహం మరింత మిన్నగా ఉంటుంది. సరైన ప్లేస్ లో వినాయకుడి విగ్రహం పెట్టుకుంటే.. సంతోషం, సక్సెస్, సంపద జీవితంలో పొందుతారు. మరి ఎలాంటి విగ్రహం, ఎక్కడ పెట్టుకోవాలో చూద్దామా..

👉#వాస్తు_దోషం..

👉ఇంట్లో వాస్తు దోషంతో బాధపడేవాళ్లు.. వినాయకుడు, స్వస్తిక్ కలిసి ఉండే విగ్రహాన్ని లేదా ఫోటోని ఇంట్లో పెట్టుకోవాలి. అప్పుడు ఎలాంటి వాస్తు దోషమైనా తొలగిపోతుంది.

👉#ఆఫీస్ లో..

ఆఫీస్ లో నిలబడి ఉండే వినాయకుడి విగ్రహాన్ని పెట్టుకోవాలి. ఇలాంటి విగ్రహం వర్క్ ప్లేస్ లో పెట్టుకోవడం వల్ల వర్క్ విషయంలో ఎనర్జీ, ఉత్సాహం పెరుగుతాయి.

👉#కూర్చున్న_వినాయకుడు..

కూర్చుని, తొండం ఆయన ఎడమ చేతివైపు తిరిగి ఉన్న వినాయకుడి విగ్రహం పెట్టుకుంటే.. సక్సస్ తో పాటు, అదృష్టం మీ సొంతమవుతుంది.

👉#సంతోషం..

సంతోషం, ప్రశాంతత, ఐశ్వర్యం పొందాలనుకునేవాళ్లు తెలుపు వర్ణంలోని వినాయకుడి విగ్రహాన్ని లేదా ఫోటోని ఇంట్లో పెట్టుకోవాలి.

👉#పూజ_గదిలో..

మీ పూజ గదిలో కేవలం ఒక వినాయకుడి విగ్రహాన్ని మాత్రమే పెట్టుకోవాలి. రెండు లేదా అంత కంటే ఎక్కువ వినాయకుడి విగ్రహాలను పెట్టుకుంటే.. ఆయన భార్యలైన రిధి, సిద్ధిలకు ఆగ్రహం వస్తుంది.

👉#అభివృద్ధి #పొందాలనుకునేవాళ్లు..

తమలో వృద్ధిని కోరుకునే వాళ్లు, సంపద పెరగాలని కోరుకునేవాళ్లు.. ఎరుపు, ఆరంజ్ కలిసిన (రెడిష్ ఆరంజ్) కలర్ వినాయకుడి విగ్రహాన్ని పూజించాలి.

బ్రహ్మరాత

ఒక మంచి ప్రతిభావంతుడైన ముని వుండేవారు. సకల శాస్త్రాలు, విద్యలు తెలిసినవారు. ఆ ముని భార్య సాక్షాత్తూ అన్నపూర్ణయే. ఆమె శిష్యులను తన కన్నబిడ్డల్లా చూసుకునేది. ఆకలితో ఎవరు వచ్చినా లేదనకుండా వారి ఆకలిని తీర్చేది. అలా, ఒక నాడు ఆ ముని దంపతుల వద్దకు వసంతుడు అనే ఒక అనాథ వచ్చి శిష్యుడిగా చేరాడు. అతడు బాగా చురుకైనవాడు, తెలివైనవాడు కావడంతో, అతనికి గురువుగారు నేర్పించే విద్యలన్నీ ఇట్టే అబ్బేవి.
వసంతుడు కొన్నాళ్ళకే తన గురువుకు తెలిసిన విద్యలన్నీ పూర్తిగా నేర్చేసుకున్నాడు. ఇక అతనికి నేర్పడానికి తనవద్ద ఉన్న జ్ఞానం సరిపోకపోవడంతో, తనకు గురువులైన వారి వద్దకు పంపించి మరీ విద్యాభ్యాసం చేయించాడు. ఆ గురువర్యుడు. అయితే కొన్నాళ్ళకే అతనికి నేర్పడానికి తమవద్ద ఉన్న విద్యలన్నీ పూర్తయ్యాయని ఆ పెద్ద గురువులైన వాళ్ళు కూడా చెప్పారు.

ఇదిలా వుండగా నిండు చూలాలైన గురుపత్ని ప్రసవించే సమయం రావడంతో, వసంతుడు ఆశ్రమంలో అన్ని పనులు తానే చూసుకుంటూ, తల్లితో సమానురాలైన గురుపత్నిని కాలు క్రింద పెట్టకుండా చూసుకుంటున్నాడు. ఆమెకు పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. ఆశ్రమంలోపల ప్రసవం జరుగుతుండగా వసంతుడు గుమ్మం బయటకు వచ్చి కూర్చున్నాడు.

కాసేపట్లో లోపలి నుండి చంటి బిడ్డల ఏడుపులు వినిపించ్చాయి. గురుపత్ని కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఒక మగపిల్లవాడు, ఒక ఆడపిల్ల. ఇంతలో దివి నుండి భువికి దిగివచ్చిన ఒక దివ్యపురుషుడు వడివడిగా ఆశ్రమంలోకి వెడుతూ, గుమ్మం ముందు కూర్చున్న వసంతుడికి కనిపించాడు. మామూలు మనుషులకైతే అతను కనిపించి వుండేవాడు కాదు. కాని వసంతుడు దేవరహస్యాలు కూడా నేర్చుకున్నాడు కాబట్టి ఆ వచ్చిన అతనెవరో ఇట్టే కనిపెట్టేశాడు వసంతుడు.

అతడు ''బ్రహ్మ''. అప్పుడే పుట్టిన పిల్లలకు నొసటి రాత రాయడానికి వచ్చాడని అర్థం చేసుకున్న వసంతుడు ఓపిగ్గా బయట కాచుకుని కూర్చున్నాడు వసంతుడు. బ్రహ్మ బయటకు రాగానే ఆయనకు ప్రణామం చేసి ''స్వామి'' మా గురువుగారి పిల్లల నుదుట ఏమి రాశారో దయచేసి సెలవివ్వగలరు అని వినమ్రపూరితంగా అడిగాడు.

బ్రహ్మ తనను చూడగలిగిన ఈ పిల్లవాడు సామాన్యుడు కాడు అని తెలుసుకొని, వసంతుడు అడిగిన విధానానికి ముచ్చటపడి, ఇతరులకు తెలియజెయ్యరాని రహస్యాన్ని అతనికి చెప్పడానికి నిర్ణయించుకున్నాడు. అప్పుడు ఇలా చెప్పాడు.. నాయనా.. ఈ అబ్బాయి నిరక్షర కుక్షి అవుతాడు. ఇతని జీవితకాలమంతా ఇతని వద్ద ఒక మూట బియ్యము, ఒక ఆవు, ఒక పూరిపాక తప్ప మరిక ఏమీ ఉండవు. ఇతడు రోజంతా కష్టపడినా తన రెక్కల కష్టంతో కనా కష్టంగా పెళ్లాన్ని, పిల్లల్ని పోషిస్తాడు అంతే అన్నాడు.

ఇక ఆ అమ్మాయి మాత్రం వేశ్య అవుతుంది. డబ్బుల కోసం రోజుకో పురుషుడితో సంభోగించే వారకాంత అవుతుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు బ్రహ్మ. అది వినిన వసంతుడు నిశ్చేష్టుడయ్యాడు. సాక్షాత్తూ దైవసమానులైన తన గురుదంపతులకి పుట్టిన పిల్లలకు ఇలాంటి రాత రాసాడేమిటా విధాత అని విచారంగా ఆలోచనలో మునిగిపోయాడు.

వెంటనే తన గురువు గారిని బ్రహ్మ రాత మార్చగలమా అని అడిగాడు వసంతుడు. దానికి, ఆయన అది సాధ్యం కాదు నాయనా. అది ఎవ్వరికీ సాధ్యం కాదు అని చెప్పాడు. పిల్లలు పెద్దవాళ్ళయ్యే కొద్దీ వాళ్ళ రాత నిజమవడం వసంతుడికి కనిపించసాగింది. ఆ ఇద్దరికీ చదువులు వంటపట్టడం లేదు.

ఎందరికో విద్యాబుద్ధులు నేర్పిన గురువుగారి పిల్లలు ఇలా అయ్యారేమిటా.. అనే దిగులుతో, వసంతుడికి దేనిమీద ఏకాగ్రత కుదరడంలేదు. దానికి తోడు ఆ పిల్లలిద్దరు వసంతుడి వెంటపడి అన్నయ్య, అన్నయ్య అని తిరుగుతూ వుంటే, అతడికి దుఃఖం మరింత ఎక్కువ కాసాగింది. ఒక రోజు గురువుగారితో చెప్పి, ఆయన అనుమతి పొంది దేశం చుట్టి రావడానికి బయలుదేరి వెళ్ళాడు. ఎన్నో చోట్లకు వెళ్ళి ఎందరో పండితులను కలిసాడు. 
వారందరిని వసంతుడు ప్రశ్నించాడు. బ్రహ్మ రాసిన రాతను మార్చగలమా... దానికి వసంతుడికి అందరు చెప్పిన సమాధానం బ్రహ్మరాత మార్చడం అసాధ్యం. అది ఎవరితరమూ కాదు అని.

అలా అక్కడా ఇక్కడా తిరుగుతూ, తన అన్వేషణను కొనసాగిస్తూ ఇరవై సంవత్సరాలకు పైగా గడిపాడు. అప్పటికి గురువుగారి పిల్లలకు పాతికేళ్ళు వచ్చాయి. వసంతుడికి వాళ్ళు ఎలా ఉన్నారో చూడాలనిపించసాగింది. ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. అప్పుడు అక్కడి పరిస్థితి గురువుగారి కుమారుడి పేరు శంకరుడు అని, ఆ ఊరిలోనే కూలిపని చేస్తున్నాడని, గురువుగారి కుమార్తె పేరు వసంతసేన అని దగ్గరలోని ఒక పట్టణంలో వ్యభిచార వృత్తిలో ఉందని తెలుసుకున్నాడు. తనకు పుట్టిన పిల్లల దుస్థితి చూసి దిగులుతో మంచం పట్టి, గురు దంపతులు మరణించారని కూడా వసంతుడు తెలుసుకున్నాడు.

వసంతుడు బాగా ఆలోచించాడు. ముందు శంకరుడిని వెతుక్కుంటూ వెళ్ళాడు. వసంతుడిని చూడగానే అన్నయ్యా.. అంటూ బావురుమన్నాడు శంకరుడు. చిన్న పూరిపాక, చిరిగిపోయిన దుస్తుల్లో భార్య, ఒక కొడుకు, ఇంట్లో ఎటు చూసినా విలయతాండవం చేస్తున్న కటిక దారిద్య్రం ఇదీ శంకరుడి దుస్థితి. తమ్ముడూ.. నువ్వు బాధపడకు. ఇప్పటి నుండి నేను చెప్పినట్లు చెయ్యి అన్నాడు వసంతుడు. దానికి శంకరుడు, ''సరే అన్నయ్యా.. ఇక నుండి నువ్వు ఎలా చెపితే అలానే చేస్తాను'' అన్నాడు శంకరుడు.

ముందు ఆ ఆవుని తోలుకుని పట్టణానికి వెళదాం పద అన్నాడు వసంతుడు. ఏమి మాట్లాడకుండా ఆవును తోలుకుని వసంతుడిని అనుసరించాడు శంకరుడు. ఇద్దరూ నేరుగా పట్టణంలోని సంత దగ్గరకు వెళ్ళారు. అక్కడ ఒక దళారి దగ్గరకు వెళ్ళి ఈ ఆవుని ఎంతకు కొంటావు అని అడిగాడు వసంతుడు. తరువాత అతను చెప్పిన ధరకు అమ్మేసాడు వసంతుడు. శంకరుడికి ఏమీ అర్థం కాకపోయినా, వసంతుడికి ఎదురు చెప్పలేదు.

ఆవును అమ్మగా వచ్చిన డబ్బుతో వంటకు అవసరం అయిన సరుకులను, శంకరుడి భార్యకు, పిల్లలకు కొత్త బట్టలు కొన్నారు. తిరిగి గ్రామానికి బయలుదేరారు. ఇంటికి రాగానే ఆ సరుకులతో వంట చేయించాడు వసంతుడు. శంకరుడి భార్య, పిల్లలు ఆవురావురుమని తిని ఆకలి తీర్చుకున్నారు. 
తర్వాత వసంతుడు శంకరుడితో తమ్ముడూ అన్నదానం చేద్దాం. ఆకలితో ఎవరు వచ్చినా లేదనకుండా వడ్డించు అని చెప్పాడు. శంకరుడు మారు మాట్లాడకుండా అలాగే చేశాడు. కాని శంకరుడు ఆ రోజు రాత్రి వసంతుడితో, అన్నయ్యా.. ఇంతవరకు ఆ ఆవు వుంది కదా అన్న ధైర్యం నాకు ఉండేది, ఇప్పుడు ఉన్న ఆ ఒక్క ఆధారం కూడా పోయింది. దాన్ని అమ్మగా వచ్చిన ధనం కూడా అన్నదానానికి ఖర్చయిపోయింది. తెల్లవారితే ఎలా గడపాలో అని భయంగా వుంది అని అన్నాడు.

దానికి వసంతుడు తమ్ముడూ.. నువ్వు ఏమీ ఆలోచించకుండా సుఖంగా నిద్రపో, ప్రొద్దునకంతా సర్దుకుంటాయి అని ధైర్యం చెప్పాడు. 
ప్రొద్దున్నే లేచి తలుపు తెరచి బయటికి వచ్చి చూసిన శంకరుడి ఆశ్చర్యానికి అంతులేకుండా పోయింది. శంకరుడి ఇంటిముందు ఒక ఆవు నిలబడి వుంది. శంకరుడి ఆస్తి ఎప్పుడూ ఒక్క ఆవే అని తను రాసిన రాత పొల్లుపోకుండా ఉండడానికి రాత్రికి రాత్రి బ్రహ్మయే స్వయంగా ఒక ఆవుని తీసుకొని వచ్చి అక్కడ కట్టేసాడు. ఆ రోజు కూడా ఆవును తీసుకెళ్ళి సంతలో అమ్మి, వచ్చిన ఆ డబ్బుతో అన్నదానం చేయించాడు వసంతుడు. తమ్ముడూ, ఇక ఇలాగే ప్రతిరోజూ క్రమం తప్పకుండా చేస్తూ ఉండు అని చెప్పి వసంతుడు అక్కడి నుండి వసంతసేనను వెతుక్కుంటూ బయలుదేరాడు. అన్ని దానాల్లోకెల్లా గొప్పదైన అన్నదానాన్ని క్రమం తప్పకుండా చేస్తున్నందున శంకరుడు తన జీవితంలో అనంతమైన పుణ్యాన్ని మూట కట్టుకున్నాడు.

వసంతుడు వాళ్ళని, వీళ్ళని అడుగుతూ వెళ్ళి వసంతసేనను కలుసుకున్నాడు. వసంతసేన ఒక అవ్వతో కలసి ఒక ఇంట్లో ఉంటోంది. ఆమె వసంతుడిని చూడగానే భోరుమని ఏడ్చేసింది. అన్నయ్యా.. నేను మహాపాపిని. ఈ పాపపంకిలంలో కూరుకుపోయాను. మీలాంటి ఉన్నతుడిని చూడటానికి కూడా నాకు అర్హత లేదు అని బావురు మంది. ఊరుకో చెల్లీ.. ఊరుకోమ్మా.. ఈ పాపపు పంకిలం నుండి నువ్వు బయటపడే మార్గం చెబుతాను. ఇక ఇవాల్టి నుండి నేను చెప్పినట్లు చెయ్యి అని ఆమెను ఓదార్చాడు వసంతుడు. దానికి సరే అని ఒప్పుకుంది వసంతసేన.

ఆ రాత్రికి విటులు ఎవ్వరు వచ్చినా లక్ష వరహాలు చెల్లిస్తేనే లోపలికి ప్రవేశం అని చెప్పమని అక్కడ వసంతసేనతో ఉన్న అవ్వకు చెప్పాడు వసంతుడు. ఆమె ఆశ్చర్యపడుతూ అయ్యా.. ఇది జరిగే వ్యవహారం కాదు అని ఏదో చెప్పబోయింది. వసంతుడు ఆమెను మధ్యలోనే వారించి నేను చెప్పినట్లు చెయ్యి అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్లుగా. ఆ రాత్రి ఇద్దరు, ముగ్గురు విటులు వచ్చి లక్ష వరహాలు అనగానే వెనుదిరిగి వెళ్ళిపోయారు. అది వాళ్ళు ఊహించలేని మొత్తం. కాని అర్ధరాత్రి సమీపిస్తూ ఉంది అనగా ఒక మహాపురుషుడు మాత్రం లక్ష వరహాలతో వచ్చి ఆ రాత్రి వసంతసేనతో గడిపి వెళ్ళాడు.

ఆ మరుసటిరోజు రాత్రి కూడా అలాగే జరిగింది. తన రాత తప్పకూడదని, లక్ష వరహాలు ఇచ్చి వసంతసేనతో సంభోగించింది సాక్షాత్తూ ఆ బ్రహ్మే నని వసంతుడికి తెలుసు. అలా బ్రహ్మ సంభోగం వలన అప్పటివరకు ఆమె మూటగట్టుకున్న పాపాలన్నీ పటాపంచలయ్యాయి. ఆమె జన్మ చరితార్థమైంది. అలా వసంతుడు వాళ్ళిద్దరి చేత పుణ్యకర్మలు చేయించి, గురుదంపతుల రుణం తీర్చుకున్నాడు. 

ఈ ప్రపంచంలో ప్రతి జీవి నుదుట తలరాత రాసేది బ్రహ్మే అయినా దానిని చక్కగా తీర్చిదిద్దుకునే శక్తిని, అవకాశాన్ని మాత్రం ప్రతి జీవికి ఇచ్చాడు అని గ్రహించాడు, దానిని నిరూపించాడు. అలా బ్రహ్మ రాతను సైతం బ్రహ్మాండమైన రాతగా మార్చి చూపాడు వసంతుడు...

|| ఓం నమః శివాయ ||

Thursday, June 18, 2020

మహాయోగి శ్రీ త్రైలింగ స్వామి

*అమృతస్య పుత్రాః*

పుట్టింది తెలుగు దేశంలో అయినా, ఆయన గడిపిన కాలమంతా కాశీలోనే. ఆయన చూపించిన మహిమలు అపారం. వారు పొందిన సిద్దులనేకం. వారి దివ్య విభూతి అనంతం. ఆయనే త్రైలింగ స్వామి. అసలు పేరు శివరామయ్య. విశాఖపట్నం జిల్లా విజయనగరం దగ్గరలో హాలియా గ్రామంలో జన్మించారు. తండ్రి నరసింహారావు, తల్లి విద్యావతి, సంపన్న బ్రాహ్మణ కుటుంబం. 

ఆయన జననం 19-12-1607. తల్లి పూజ చేసుకొంటుంటే శివలింగం నుంచి వింత కాంతి ఈ బాలుడిమీద పడటం ఆమెచూసి యోగ్యుడవుతాడు అనుకొన్నారు. చిన్నప్పటి నుంచి ఐహిక వాంఛల మీద కోరిక లేదు. నలభై ఏళ్ళకు తండ్రి, యాభై రెండో ఏట తల్లి చనిపోయారు.స్మశానాన్నే ఇల్లుగా చేసుకొని ఆస్తిని అంతా సవతి తమ్ముడు శ్రీధరుడికి ఇచ్చేసి, అక్కడే ఇంకో ఇరవై ఏళ్ళు గడిపాడు.

స్వగ్రామం వదిలి పాటియాలా సంస్థానంలో బస్తర్ చేరాడు. అక్కడ భాగీరధి స్వామితో పుష్కర తీర్ధానికి వెళ్ళాడు. ఆయన దీక్షను ఇచ్చి గణపతి స్వామి అనే దీక్షా నామం ఇచ్చాడు. అప్పటికి అయ్యగారి వయస్సు డబ్భై ఎనిమిది. గురు సమక్షంలో పదేళ్ళ సాధన చేసి, అద్భుత శక్తుల్ని సంపాదించుకొన్నాడు. గురువు మరణించిన తర్వాత తీర్థ యాత్రలు చేస్తూ రామేశ్వరం చేరాడు. 

అక్కడ స్వంత ఊరివారు కనిపించి ఇంటికి రమ్మని కోరినా వెళ్ళలేదు. రామేశ్వరంలో ఒక బ్రాహ్మణ బాలుడు చనిపోతే శవాన్ని తీసుకొని వెళ్తూ తలిదండ్రులు విలపిస్తుంటే, గుండె కరిగి కమండలం లోని నీరు వాడిమీద చల్లాడు. వెంటనే బాలుడు బ్రతికి అందర్నీ ఆశ్చర్యపరచాడు. ఆయన మహత్తు అందరికి తెలిసి సాక్షాత్తు శ్రీరామ లింగేశ్వరుడే గణపతి స్వామి అనుకొన్నారందరూ. అక్కడి నుండి నేపాల్ చేరాడు. అక్కడ అడవిలో తపస్సు చేస్తుంటే ఒక పులి వచ్చి ఆయనకు ఎదురుగుండా కదలకుండా కూచునిపోయింది. 

రాజుగారి బంధువు ఈ దృశ్యాన్ని చూసి చకితుడైనాడు. పులిని చంపటానికి ప్రయత్నిస్తే వారించాడు. ఆయన రాజుకు ఈ విషయం చెప్పాడు. నేపాల్ రాజు వచ్చి సాష్టాంగ పడి అనేక కానుకలిస్తే, తీసుకోకుండా జంతు హింస చేయవద్దని హితవు చెప్పాడు స్వామి. అక్కడి నుంచి టిబెట్, తరువాత మానస సరోవరం సందర్శించి, దారిలో ఎన్నో అద్భుతాలను చూపి, హిమాలయాలలో చాలాకాలం తపస్సు చేసే నర్మదా నదీ తీరంలో, మార్కండేయ ఆశ్రమంలో ‘ఖలీ బాబా” అనే అహోరాత్రాలు తపస్సు చేసే యోగిని దర్శించాడు. ఒకరోజు తెల్లవారు జామున నర్మదా నదిలో పాలు ప్రవహిస్తున్నట్లు, ఈ స్వామి దాన్ని తాగుతున్నట్లు ఖలీ బాబా చూశారు. గణపతిలోని మహిమేమిటో గ్రహించారు. 
విషయం తెలిస్తే ఆయన ఇక అక్కడ ఉండరు. 

1733లో ప్రయాగ చేరారు. తపో నిష్టలో ఉండగా ఒకసారి కుంభ వృష్టి కురుస్తోంటే శిష్యుడు రామ తరణ భట్టాచార్య ఆశ్రమంలోకి పోదామని చెప్పినా కదలలేదు. దూరంలో ఒక పడవ మునిగిపోతోందని దాన్ని రక్షించాలని సంజ్న చేశారు. అతడు అక్కడికి వెళ్ళే లోపున పడవ మునుగుతుంటే దిగంబర స్వామి అక్కడ పడవ మీద చేరి దాన్ని రక్షించాడు. శిష్యుడు ఆశ్చర్యం ప్రకటించగా ప్రతి వాడిలోను మహాశక్తులు అజ్ఞాతంగా ఉంటాయని వాటిని గుర్తించే వారు తక్కువ అని తెలిపారు. 

1737లో కాశీ చేరారు దిగంబర గణపతి స్వామి. అప్పటికి ఆయనకు 130 ఏళ్ళు. కాశీలో 150 యేళ్ళు గడిపారు. ఆయనది 300 పౌన్ల బరువైన భారీ విగ్రహం. గడ్డాలు, మీసాలు పెరిగి దీర్ఘ శరీరంతో దిశ మొలతో, మెడలో పెద్ద రుద్రాక్ష మాలతో, పెద్దబాన పొట్టతో కాశీ నగర వీధుల్లో సంచరించేవాడు. గంటలసేపు గంగా జలంపై పద్మాసనంలో తేలి ఉండేవాడు. అలాగే గంటల కొద్దీ కాలం నదీ గర్భంలో మునిగి ఉండేవాడు. అంటే కుంభక విద్యలో అద్భుతమైన నేర్పు ఉండేదన్న మాట... కుష్టు రోగులకు సేవ చేసి వారిని ఆదరించాడు బాబా. 

వేద వ్యాస ఆశ్రమం చేరి, అక్కడ సీతానాథా బందోపాధ్యాయుని క్షయ వ్యాధి పోగొట్టి, హనుమాన్ ఘాట్ చేరాడు.ఒక మహారాష్ట్ర స్త్రీ రోజు విశ్వేశ్వరుడి అభిషేకం చేసి వస్తు ఈ దిగంబర స్వామిని రోజు చూస్తూ ఏవగించుకొనేది. ఆమె భర్తకు రాచ పుండు. ఆమెకు అందరు దిగంబర స్వామిని అర్ధించమని కోరారు. కానీ తాను తూల నాడిన ఆయన దగ్గరకు వెళ్ళటానికి సందేహించింది. చివరికి వెళ్లి కాళ్ళమీద పడింది. ఆయన ఇచ్చిన విభూతితో జబ్బు మాయమైంది.

కాశీ మహానగరంలో ఎందరో తెలుగువారు ఉపాధ్యాయులుగా, అధ్యాపకులుగా ఉన్నారు. వారు ఈ దిగంబర స్వామి తెలుగు వాడని గుర్తించారు. ఆయనకు "త్రైలింగ స్వామి” అనే పేరు పెట్టారు. తెలుగు దేశం అంటే త్రిలింగ దేశమే కదా. అప్పటి నుంచి ఆ పేరే స్థిరపడిపోయింది. 1800లో తన మకాంను దశాశ్వ మేధ ఘాట్ నుండి బిందు మాధవంకు మార్చారు. ఎప్పుడూ మౌనమే, ధ్యానమే, తపస్సు, యోగ సమాధే. కనుకే ఆయన్ను “మౌన బాబా” అన్నారు. 

కాశీరాజు వీరిని తన పడవలోకి ఆహ్వానిస్తే వెళ్ళారు. రాజు బ్రిటిష్ వారు బహుమతిగా ఇచ్చిన కత్తిని స్వామి చూడాలని ముచ్చటపడితే ఇచ్చారు. అది పొరపాటున గంగలో జారిపడిపోయింది. రాజుకు కోపం వచ్చి తిట్టాడు. స్వామి తన చెయ్యి గంగా నదిలో పెట్టి ఒకే రకంగా ఉండే రెండు కత్తులను తీసి అందులో రాజుదేదో గుర్తించి తీసుకోమన్నాడు. రాజు గుర్తించ లేకపోతే తానే గుర్తించి చెప్పి ఇచ్చాడు. రెండోదాన్ని గంగలోకి విసిరేశారు స్వామి..

దిగంబరంగా తిరగటం కొంతమందికి
నచ్చక కేసు పెట్టరు. కోర్టులో కేసు నడిచింది. ఆయన్ను బంధించి తీసుకొని రమ్మని మేజిస్ట్రేట్ ఆర్డర్ వుశాడు. అలాగే గబ్బిట దుర్గాప్రసాద్ తెచ్చారు. ఈయన మహిమలను అధికారులు ఆయనకు వివరించారు. ఆయన తాను తినే మాంసం స్వామి తింటే శిక్షించను అన్నాడు అన్నాడు. స్వామి సైగలతో తాను తినే దాన్ని మేజిస్ట్రేట్ తింటారా అని ప్రశ్నించాడు. వెంటనే తన చేతిలో మల విసర్జన చేసుకొని నోట్లో వేసుకొని తినేశారు. మతి పోయింది మేజిస్ట్రేట్ కు. అయితే సుగంధ పరిమళం కోర్టు అంతా వ్యాపించింది. స్వామి మహిమ తెలిసి దిగంబరంగా తిరిగే హక్కు ఇచ్చాడు. 

ఒకసారి ఒక ఆకతాయి ఆయన బజారులో వెళ్తుంటే మర్మాంగాన్ని గుంజాడు. అది కొన్ని గజాలు సాగింది. వాడు భయపడి పారిపోయాడు. దుండగులు కొందరు సున్నపు తేట ఇచ్చి పాలు అని చెప్పారు. శుభ్రంగా తాగేశాడు స్వామి. వెంటనే మూత్ర రూపంలో దాన్ని అంతట్ని విసర్జించాడు. 

శ్రీరామ కృష్ణ పరమహంస 1868లో కాశీ వచ్చినప్పుడు తన మేనల్లుడు హృదయనాథ్తో కలిసి మౌనస్వామిని దర్శించారు. ఆయనకు బాబా నశ్యం వేసుకొనే కాయ కానుకగా ఇచ్చారు. స్వామిని “నడయాడే విశ్వనాథుడు” అని చెప్పారట పరమహంస.ఇంకోసారి అర్ధమణుగు పాయసం వండించి తీసుకొని వెళ్లి స్వామికి అందించి తినిపించారట. పరమహంస స్వామిని "ఈశ్వరుడు ఏకమా అనేకమా” అని ప్రశ్నిస్తే - సమాధి స్తితిలో ఏకం అనీ, వ్యావహారిక దృష్టిలో అనేకం అని సైగలతో చెప్పారు స్వామి. పరమహంస, స్వామిని తన ఆశ్రమానికి ఆహ్వానించి సత్కరించారు. ఇద్దరూ మహా పురుషులే. పరమహంసలే ఒకరి విషయం రెండో వారికి తెలుసు. ఎన్నో అద్భుతాలు చేసిన రామకృష్ణులు స్వామిని అంతగా గౌరవించారంటే బాబా ఎంత మహిమాన్వితుడో తెలుస్తోంది. 

ఒకసారి రాజఘాట్ నుండి విద్యానంద స్వామి అనే యతి వీరిని దర్శించటానికి కేదార్ ఘాట్లో ఉన్న మన స్వామి దగ్గరకు వచ్చారు. ఇద్దరు గాఢంగా ఆలింగనం చేసుకొన్నారు. కాసేపట్లో అందరు చూస్తుండగానే ఇద్దరు మాయమైనారు. అరగంట తర్వాత స్వామి తిరిగి వచ్చారు. తాను ఆయన్ను రాజ ఘాట్లో దింపి వచ్చాను అని స్వామి అందరి సందేహాల్ని తీర్చారు.

పంచగంగా ఘట్టంలో చిన్న భూగృహం నిర్మింప జేసుకొని 32 ఏళ్ళు సేవ చేసి, ఆయన విగ్రహాన్ని చేయించాలని రెండునెలల గడువు కావాలని కోరితే, మరణాన్ని వాయిదా వేసుకొని, భక్తుడైన మంగళదాస్ కోర్కె తీర్చి భూగృహం చేరి ఉదయం ఎనిమిది నుండి మధ్యాహ్నం మూడు వరకు యోగ సమాధిలో ఉండి, తానే బయటకు వచ్చి భక్తుల హారతులు అందుకొని యోగాసనంలో కూర్చుండి, బ్రహ్మ రంధ్రాన్ని ఛేదించుకొని 26-12-1887న సర్వజిత్ సంవత్సర పుష్య శుద్ధ ఏకాదశి సోమవారం త్రైలింగ స్వామి తమ ఇహ జీవితాన్ని చాలించు కొన్నారు. 

ఆయన శరీరాన్ని చెక్కపెట్టెలో పెట్టి ఆయన కోరిన విధంగానే తాళం వేసి అసి నది నుండి వరుణ నది దాక ఊరేగించి గంగా నదీ ప్రవాహంలో వదిలారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కాశీ విశ్వేశ్వరునికి ఎలా నిత్యం అభిషేకం, పూజా జరుగుతాయో స్వామి విగ్రహానికి కూడా కేదార్ ఘాట్లోన మఠంలో జరగటం విశేషం. పతంజలి యోగంలో విభూతి పాదంలో చెప్పిన అణిమాది అష్ట సిద్ధులు, కుంభక యోగంలో త్రైలింగ స్వామి సిద్ధింప జేసుకున్నారు. ఆయన సంస్కృతంలో రాసిన “మహా వాక్య రత్నావళి”కి వ్యాఖ్యను బెంగాలిలో రాశారు. కాని మన తెలుగు వారి దృష్టి ఇంకా దానిపై పడకపోవటం విచారకరం అంటారు బాధతో బి. రామరాజు గారు. (ఆంధ్ర యోగులు రచయిత). 

280 సంవత్సరాలు జీవించి, స్వచ్చంద మరణాన్ని పొంది, యోగ సిద్దులలో త్రివిక్రములై ఆశ్రిత జన కల్పవృక్షమై మౌన ముద్రాలన్కారులై తెలుగువారై ఉండి ఉత్తర దేశంలో, అందులోను కాశీ మహా క్షేత్రంలో బ్రహ్మ రధం పట్టించుకొన్న త్రిలింగ యోగి నామ ఉచ్చారణ చాలు మనం తరించటానికి.

Monday, June 15, 2020

Sucide is not the Educational stress

Don't teach them how to live an easy life teach them a difficult one so that they will always b prepared.
To all parents......

There was a very brilliant boy, he always scored 100% in Science.

Got Selected for IIT Madras and scored excellent in IIT.

Went to the University of California for MBA.
Got a high paying job in America and settled there.

Married a Beautiful Tamil Girl.

Bought a 5 room big house and luxury cars.
He had everything that make him successful but a few years ago he committed suicide after shooting his wife and children.

WHAT WENT WRONG?

California Institute of Clinical Psychology Studied his case and found “what went wrong?”

The researcher met the boy's friends and family and found that he lost his job due to America’s economic crisis and he had to sit without a job for a long time. 

After even reducing his previous salary amount, he didn't get any job. 

Then his house installment broke and he and his family lost the home. 

They survived a few months with less money and then he and his wife together decided to commit suicide. 

He first shot his wife and children and then shot himself.

The case concluded that the man was Programmed for success but he was not trained for handling failures.

Now let's come to the actual question.

What are the habits of highly successful people?

First of all, I want to tell you that if you have achieved everything, there is a chance to lose everything, nobody knows when the next economic crisis will hit the world. 

The best success habit is getting trained for handling failures.

I want to request every parent, please do not only program your child to be successful but *"teach them how to handle failures** and also teach them proper lessons about life. 

Learning high-level science and maths will help them to clear competitive exams but a knowledge about life will help them to face every problem.

Teach them about how money works instead of teaching them to work for money. 

Help them in finding their passion because these degrees will not help them in the next economic crisis and we don’t know when the next crisis will hit the world.

"Success is a lousy teacher. Failure teaches you more."