Saturday, July 25, 2020

Bhagavad Gita: Chapter 2, Verse 21

वेदाविनाशिनं नित्यं य एनमजमव्ययम् |
कथं स पुरुष: पार्थ कं घातयति हन्ति कम् || 21||

vedāvināśhinaṁ nityaṁ ya enam ajam avyayam
kathaṁ sa puruṣhaḥ pārtha kaṁ ghātayati hanti kam

veda — knows ; avināśhinam—
imperishable ; nityam — eternal ;
yaḥ— who ; enam — this ; ajam —
unborn ; avyayam — immutable ;
katham — how ; saḥ — that ;
puruṣhaḥ — person ; pārtha—
Parth ; kam — whom ; ghātayati—
causes to be killed ; hanti— kills ;
kam — whom

Translation

BG 2.21 : O Parth, how can one who knows the soul to be imperishable, eternal, unborn, and immutable kill anyone or cause anyone to kill?

Commentary

A spiritually elevated soul quells the ego that makes us feel that we are the doers of our actions. In that state, one can see that the soul seated within actually does nothing. Such an elevated soul, though doing all kinds of actions, is never tainted by them. Shree Krishna is advising Arjun that he must elevate himself to that enlightened level, seeing himself as the non-doer, free from egotism, and perform his duty rather than shirk from it.

The Story of Anand Sharma - 3

The description of the greatness of letters in Gayathri Mantra  Anand Sharma explained ‘Power of Gayathri is the power pervading the whole universe. 

If you establish a relationship with that power, the subtle nature will come under your control. Then, you will be able to possess all the riches in the areas related to physic, mind and soul. 

From different organs in the body, nerves spread throughout the body. When some nervous unite, it is called a ‘grandhi’ (knot). 

In the human body, different powers remain embedded in different ‘grandhis’. 

For those who are immersed in ‘japa yoga’, by chanting such mantras the power embedded in such ‘grandhis’ will be expressed. 

‘Aum’  : When chanted, power raises in an area of 6 inches on head.

 ‘Bhooh’  : When chanted, power raises in an area of 4 inches above the right eye. 

 ‘Bhuvah’ : When chanted, power raises in an area of 3 inches above the  human third eye.    

‘Swah’  : When chanted, power raises in an area 4 inches above the left eye.      

To raise the power 'saphalya' embedded in the grandhi by name 'Tapi' present in the area of Ajna Chakram - - Tat' 

To raise the power 'parakram' embedded in grandhi by name 'saphalata' in the left eye - - Sa' 

To raise the power 'palana' embedded in grandhi 'viswa' in the right eye - - Vi 

To raise the power 'mangalakara' embedded in grandhi 'tushti' in the left ear - - Thuh 

To have siddhi of power 'yogam' embedded in the grandhi 'varada' in right ear - - Va 

To have siddhi of power 'preme' embedded in the grandhi 'Revathi' at the root of nose - - Re 

To raise the power 'ghana' embedded in grandhi 'sookshma' in the upper lip - - Ni 

To raise the power 'Tejam' embedded in grandhi 'Jnana' in the lower lip - - Yam

To raise the power 'Rakshana' embedded in grandhi 'Bharga' in the neck - - Bhar 

To have siddhi of power 'Buddhi' embedded in the grandhi 'Gomathi' at the throat - - Go 

To raise the power 'Damanam' embedded in grandhi 'Devika' at the top portion of chest on the left side De 

To have siddhi of power 'Nishta' embedded in the grandhi 'Varaha' in the top portion of right side of chest - - Va 

To raise the power 'Dharana' embedded in grandhi 'Simhini' in the upper part of abdomen where last ribs join together - - Sya 

To raise the power 'Prana' embedded in grandhi 'Dhyana' in the liver  Dhee 

To raise the power 'Samyana' embedded in grandhi 'Maryada' in Pleeham - - Ma 

To raise the power 'Tapo' embedded in grandhi 'Sphuta' in Umbilicus - - Hi 

To raise the power 'Doora Darshita' embedded in grandhi 'Medha' at the end of spinal cord  - - Dhi 

To raise the power 'Antarnihitam' embedded in grandhi 'Yoga Maya' in the left shoulder - - Yo 

To raise the power 'Utpadana' embedded in grandhi 'Yogini' in the right shoulder  - - Yo 

To raise the power 'Sarasata' embedded in grandhi 'Dharini' in the right elbow  - - Nah 

To raise the power 'Adarsha' embedded in grandhi 'Prabhava' in the left elbow  - - Pra 

To raise the power 'Sahasam' embedded in grandhi 'Ooshma' in the right wrist  - - Cho 

To raise the power 'Vivekam' embedded in grandhi 'Drushya' in the left wrist - - Da

To  raise  the  power  'Seva'  embedded  in  grandhi 'Nirayana'  in  left hand - - Yaat 

One  should  chant  those  appropriate  letters  to  raise  those  respective  powers  embedded  in  the knots. 

Thus,  there  is  a  close  relation  between  24  letters  in  Gayathri  Mantra,  the  twenty  four ‘grandhi’  (knots)  in  different  parts  of  human  body  and  the  twenty  four  types  of  powers  embedded  in them.  

The  number  9  indicates  the  ‘para  brahma  tatwam’  which  is  not  affected  by  change.  

The number  8  indicates  ‘maya tatwam’.

శ్రీకృష్ణుడి అంత్యక్రియలు


రోజూ ఎన్నో మరణాలు సంభవిస్తుంటాయి. 
కోవిడ్ వచ్చింది కదా, లాక్డౌన్ ఉంది కదా అని ఇతర మరణాలు ఆగకుండా ఉండవు కదా. 

ఎంత గొప్ప వ్యక్తి అయినా, ఎంత బలగం ఉన్న మనిషి అయినా, ఎంత కీర్తిమంతుడైనా, సినీ ప్రముఖుడైనా, రాజకీయ నాయకుడైనా ఈ లాక్డౌన్ సమయంలో ప్రాణం విడిస్తే కుటుంబ సభ్యులు పడుతున్న బాధ "ఈ సమయంలో ఇలా ఏమిటి? అంతిమయాత్ర పట్టుమని పదిమంది కూడా లేకుండా ఏమిటి?" అని. చాలామంది ఇదే విషయానికి మరింతగా కృంగిపోతూ ఉండవచ్చు ప్రస్తుతం. సహజం. 
అంతేకాదు..కొందరికి ఉన్న కొడుకులు, కూతుళ్లు అందరూ విదేశాల్లో ఉన్నవారు ఉన్నారు. లాక్డౌన్లో ఏం జరిగా ఎవ్వరూ రాలేని పరిస్థితి. 
వారందరి కోసం "మహాభారతం" మౌసలపర్వంలోని శ్రీకృష్ణుని అంత్యక్రియల విషయం క్లుప్తంగా ఒక్కసారి చెప్పుకోవాల్సిన సందర్భం వచ్చింది.
 
ఎక్కడో ద్వారక. 
దానికి చాలా దూరంలో తపోవనం. 
ఆ తపోవనంలో శ్రీకృష్ణుడు తపస్సులో ఉన్నాడు. 
అక్కడ ద్వారకలో శ్రీకృష్ణుడి తండ్రి వసుదేవుడు ప్రాణం విడిచాడు. ఆ అంత్యక్రియలు వెనువెంటనే జరిపించాల్సి వచ్చింది. కానీ బలరాముడు కూడా లేడు. సమస్త బంధుగణం మధ్య ఘనంగా ఆ కార్యక్రమం అర్జునుడే జరిపించాడు. 
ఆ కార్యక్రమం ముగిసాక అర్జునుడు శ్రీకృష్ణుడికి ఈ వార్త నెమ్మదిగా చెప్పాలని వెతుక్కుంటూ ఒక్కడే తపోవనం దాకా ప్రయాణమై వచ్చాడు. వెతికాడు. దాదాపు రెండ్రోజులు కాళ్లరిగేలా తిరిగాడు. 
మొత్తానికి ఒకచోట శ్రీకృష్ణుడు కనిపించాడు...కానీ ప్రాణం లేకుండా..! అర్జునుడు హతాశయుడైపోయాడు. కుమిలిపోయాడు. రోదించాడు. అది శ్రీకృష్ణ కళేబరం కాదని కూడా నమ్మాలనుకున్నాడు. 
అర్జునిడితో పాటూ ఉన్న రథసారధి, ఇంకా ఇద్దరు ముగ్గురు మాత్రమే అర్జునుడిని ఓదార్చారు. 
అప్పటికే శ్రీకృష్ణుడు ఆ అరణ్యంలో బోయవాడి బాణం కాల్లో దిగడం వల్ల దేహాన్ని వదిలేసి 4-5 రోజులు గడిచాయి (ఇప్పటి కరోనాలాగనే అప్పుడు యాదవుల వినాశనానికి ముసలం పుట్టింది--అది వేరే కథ..ఆ కథంతా ఇక్కడ చెప్పట్లేదు). 
ఇక ఆ మృతదేహాన్ని ద్వారకకి తీసుకువెళ్ళే వీలు లేక (ఎందుకంటే ద్వారక సరిగ్గా అప్పుడే సముద్రంలో మునగడానికి సిద్ధంగా ఉంది), అక్కడే అర్జునుడొక్కడే అరగంటలో అంత్యక్రియలు పూర్తిచేసాడు ఏ అర్భాటమూ, ఏ శాస్త్రమూ లేకుండా.

అష్టభార్యలు, ఎనభై మంది సంతానం, మనుమలు, విపరీతమైన బలగం, అఖండమైన కీర్తి ఉన్న శ్రీకృష్ణుడికి అంత్యక్రియల సమయానికి బావ అయిన అర్జునుడు తప్ప ఇంకెవ్వరూ లేరు. 
శ్రీకృష్ణుడి తండ్రి వసుదేవుడికి ఇద్దరు కొడుకులున్నా వాళ్ల చేతులమీదుగా అంత్యక్రియలు జరుగలేదు.

అంతటి ఇతహాసపురుషులకే అటువంటి అంతిమఘడియలు తప్పలేదు. మహానుభావుల మరణాలు కూడా కాలక్రమంలో సందేశాలు, ఊరటలు, మార్గనిర్దేశకాలు అవుతాయి అనడానికి ఇదొక ఉదాహరణ. 
మనమంతా కూడా కాలంలో కొట్టుకుపోయే వాళ్లమే. ఆ కాలం ఎప్పుడు ఎవరికి ఎలా నిర్ణయిస్తుందో ఎవారూ చెప్పలేరు. 

ఈ కరోనా లాక్డౌన్ సమయంలో మరణాలు పొందినవారి కుటుంబ సభ్యులకి ఈ శ్రీకృష్ణుడి అంత్యక్రియల ఘట్టం కొంతైనా భారాన్ని దింపుకునే శక్తిని ప్రసాదించుగాక.

ఎవరు పేదవారు?

ఒక చాలా సంపన్న మహిళ చీరల షాప్ కి వెళ్లి , "బాబూ! కొన్ని చౌకగా చీరలు చూపించండీ! నా కుమారుడి వివాహం. కట్నంగా మా ఇంట్లో పని మనిషికి ఇవ్వాల్సి ఉంది."
అలాగే అని చౌక చీరలను చూపించాడు ఆ షాప్ అబ్బాయి .
అందులోంచి ఒక చౌక చీరను ప్యాక్ చేయించుకుని వెళ్లిపోయింది ఆ సంపన్న మహిళ.
కొంత సమయం తర్వాత ఆ చీరల షాప్ కి మరొక మహిళ వచ్చి, "అన్నా! కొన్ని ఖరీదైన చీరలు చూపించు! మా యజమానురాలి కొడుకు వివాహం. ఈ సందర్భంగా మా యజమానురాలుకు కట్నం పెట్టడం కోసం నెలనెల డబ్బులు కూడబెట్టాను. ఆమెకు ఒక మంచి చీరను కట్నంగా ఇవ్వాలి.
అలాగే అని ఖరీదైన చీరలను చూపించాడు ఆ షాప్ అబ్బాయి .
అందులోంచి ఒక ఖరీదైన చీరను ప్యాక్ చేయించుకుని వెళ్లిపోయింది ఆ పేద మహిళ.
ఈ ఇద్దరు స్త్రీలలో ఎవరు పేదవారు?
పేదరికం ఎక్కడ ఉంది ?
మనస్సులోనా?
గుణం లోనా?
సంపన్న మహిళకు ఇంట్లో పేదరికం లేకపోవచ్చు! కాని ఆమే వ్యక్తిత్వంలో పేదతనం ఉంది.
ఆ పేద మహిళకు ఇంట్లో పేదరికం ఉండోచ్చు! కాని ఆమే వ్యక్తిత్వంలో పేదతనం లేదు.
ఆ ఇద్దరు స్త్రీలను ఇల్లుతోనూ - దేనితోనూ సంబంధం లేకుండా ఒంటరిగా నిల్చోబెడితే ఎవరు పేదవారు ???
⭐ ⭐ ⭐
ఎవరు ధనవంతులు ???
🔯 🔯 🔯
ఒకసారి, తన కుటుంబం తో ఒక మహిళ టూర్ కు వెళ్లి అక్కడ ఒక త్రీస్టార్ హోటల్ లో బస చేసింది.. ఆ మహిళ ఒక ఆరు నెలల పాపకు తల్లి.
పాప పాల కోసం ఏడుస్తుంటే ఆ మహిళ త్రీస్టార్ హోటల్ మేనేజర్ వద్దకు వెళ్లి " దయచేసి ఒక కప్పు పాలు ఇవ్వగలరా? " అని అడిగింది.
"తప్పకుండా మేడమ్" అని ఆయన బదులిచ్చారు.
" కానీ మేడమ్ మా హోటల్లో ఒక కప్పు పాలు 100 రూ॥ మేడమ్!"
"పర్వాలేదు ఇవ్వండి!" అని ఆ మహిళ పాలు తీసుకుని పాపకు త్రాగించింది.
కొంత సమయం తర్వాత వారందరు అక్కడి ప్రదేశాలను చూడడానికి కారులో బయలుదేరారు.
మధ్యలో పాప ఆకలితో పాల కోసం ఏడుస్తుంటే...
వారు ఒక రహదారి ప్రక్కన ఉన్న టీ స్టాల్ వద్ద కారును ఆపుకున్నారు. ఆ టీ విక్రేత వద్ద ఒక కప్పు పాలు తీసుకుని పాపకు పట్టింది.
తరువాత "ఎంత?" అని ఆమె టీ స్టాల్ వ్యక్తిని అడిగింది.
"మేడమ్! మేము చిన్న పిల్లల పాలకు డబ్బు వసూలు చేయం" అన్నాడు టీ స్టాల్ వ్యక్తి నవ్వుతూ
ఎంత బలవంతపెట్టినా డబ్బులు తీసుకోలేదతను. అంతే కాదు ప్రయాణంలో పాపకు అవసరమౌతాయని మరో కప్పు పాలు పోసి ఇచ్చాడు.
ఆ మహిళ కారులో కుర్చున్న తరువాత ఆలోచించసాగింది.
నిజంగా ఎవరు ధనవంతులు ? త్రీస్టార్ హోటల్ నిర్వాహకుడా? లేక టీ స్టాల్ విక్రేత నా?
ధనవంతత్వం ఎక్కడ ఉంది?
మనస్సులోనా?
గుణం లోనా??
లేక దాచుకున్న డబ్బుకట్టలు - సంపదలలోనా???
చాలా సార్లు మనమందరం డబ్బు సంపాదన యావ లో పడి మనుషుల మన్న సంగతి మర్చిపోతుంటాము.
కాని ఇలాంటి అనేక సందర్భాలలో " తిరిగి ఏదో ఆశించకుండా చేసే చిన్న చిన్న సహాయాలు " డబ్బు ఇచ్చే కిక్ కన్న ఎన్నో రెట్లు అధికంగా మంచి అనుభూతిని ప్రసాదిస్తాయి.

మయూరధ్వజుడు ఎవరు?

 ప్రతిరోజూ మనం మయూరధ్వజుడ్ని చూస్తుంటాము.  కానీ అతను ఎవరో చాలామందికి తెలియదు.  అతడి ప్రాశస్త్యం తెలియదు.  అలాంటి వారికోసం ఈ కథ.

కురుక్షేత్ర యుద్ధానంతరం ధర్మరాజు సింహాసనం అధిష్టిస్తాడు.  ఆ ఆనందం లో గొప్ప దాతగా పేరు తెచ్చుకోవాలని తలచి విరివిగా దానధర్మాలు చేస్తుంటాడు.  శ్రీకృష్ణుడు ధర్మజునికి దాతృత్వం అంటే ఎలా ఉంటుందో పాఠం చెప్పాలని భావించి అశ్వమేధయాగం చేసి శత్రురాజులను ఓడించి సామ్రాజ్య విస్తరణ చెయ్యమని సలహా ఇస్తాడు.  ధర్మరాజు అంగీకరించి అశ్వమేధయాగం చేసి యాగాశ్వాన్ని దేశం మీదకి పంపిస్తాడు.  దాని వెంట నకుల సహదేవులను సేనలతో సహా పంపిస్తాడు.  ఏ రాజు అయితే అశ్వాన్ని బంధిస్తాడో ఆ రాజును ఓడించి రాజ్యం వశపరుచుకోవడం ఈ యాగం యొక్క లక్ష్యం.  అలాకాకుండా అశ్వం ఒక రాజ్యం లోకి ప్రవేశించగానే ఆ రాజు లొంగి పోయి సామంతానికి  ఒప్పుకుంటే పేచీయే లేదు.  

 ఆ విధంగా ఆ అశ్వం మణిపుర రాజ్యం చేరుతుంది.  ఆ రాజ్య అధినేత మయూరధ్వజుడు.  గొప్ప బలశాలి.  అతని కుమారుడు తామ్రధ్వజుడు మరింత గొప్ప పరాక్రమవంతుడు.  తామ్రధ్వజుడు యాగాశ్వాన్ని బంధిస్తాడు.అతనితో యుద్ధం చేసిన నకుల సహదేవులు ఓడిపోయారు.  వెంటనే భీమార్జునులు కూడా వచ్చి యుద్ధం చేస్తారు.  వారిని కూడా ఓడించి బంధిస్తాడు తామ్రధ్వజుడు. 

  దాంతో మయూరధ్వజుడు ని యుద్ధం లో ఓడించడం కష్టమని గ్రహించిన శ్రీకృష్ణుడు ధర్మరాజు తో కలిసి మాయోపాయంతో మయూరధ్వజుని ఓడించాలని వృద్ధ బ్రాహ్మణుల వేషాల్లో మణిపురం వెళ్తారు.  "దానం కావాలి"  అని అడుగుతాడు శ్రీకృష్ణుడు.  "ఏమి కావాలో కోరుకోండి విప్రోత్తములారా"  అడుగుతాడు మయూరధ్వజుడు. 

  "మహారాజా... మేము నీ దర్శనం కోరి వస్తుండగా అడవిలో ఒక సింహం ఈ బ్రాహ్మణుని సుతుడిని పట్టుకుని చంపపోయింది. బాలుడిని వదలమని మేము ప్రార్ధించగా మయూరధ్వజుని శరీరం లో సగభాగం కోసి తెచ్చినట్లయితే ఈ బాలుడిని విడిచిపెడతాను అన్నది.  కనుక మీ శరీరం లో సగభాగం కావాలి.  అది కూడా నీ భార్యా పిల్లలే నీ శరీరాన్ని కోసి ఇవ్వాలి"  అన్నాడు శ్రీకృష్ణుడు.  

  మయూరధ్వజుడు చిరునవ్వు నవ్వి "అలాగే విప్రులారా"  అని పడుకుని తనను రెండు భాగాలుగా కొయ్యమని భార్యను, తామ్రధ్వజుడ్ని ఆదేశిస్తాడు.  ఆ మాట విని ధర్మజుడు అతని దానగుణానికి నివ్వెరపోయాడు.  భార్య కొడుకు తన శరీరాన్ని ఖండిస్తుండగా మయూరధ్వజుని ఎడమ కంటినుంచి నీరు కారింది.  వెంటనే శ్రీకృష్ణుడు "నువ్వు బాధపడుతూ దానం చేస్తున్నావు.  కనుక మాకు వద్దు" అన్నాడు.  

  అందుకు మయూరధ్వజుడు "మహానుభావా... అది బాధ కాదు.  కుడి వైపు శరీరం దానానికి ఉపయోగపడుతున్నది.  నాకు ఆ అదృష్టం లేదు అని ఎడమ వైపు శరీరం బాధపడుతూ కన్నీరు కారుస్తున్నది."  అన్నాడు.  

  మయూరధ్వజుడి త్యాగానికి,  దానశీలతకు మెచ్చిన శ్రీకృష్ణుడు, ధర్మజుడు తమ నిజరూపాలను చూపించి మయూరధ్వజుడ్ని అనుగ్రహించారు.  "మయూరధ్వజా.. నీ దానగుణం నిరుపమానం.  ఏదైనా వరం కోరుకో"  అంటాడు శ్రీకృష్ణుడు.  అప్పుడు మయూరధ్వజుడు "మహాత్మా.  నా శరీరం నశించినా సరే.. నా ఆత్మ పరోపకారార్ధం ఉపయోగపడేలా అనునిత్యం నీ ముందు ఉండేలా వరం ఇవ్వు" అంటాడు.  

 అప్పుడు శ్రీకృష్ణుడు "తధాస్తు...నేటినుంచి ప్రతి దేవాలయం ముందు నీపేరున ధ్వజస్తంభాలు వెలుస్తాయి.  నిన్ను దర్శించి నీ చుట్టూ ప్రదక్షణం చేసిన తరువాతే భక్తులు తమ ఇష్టదైవాలను దర్శిస్తారు.  అలాంటి భక్తుల కోరికలే నేను తీరుస్తాను.  నీ ముందు దీపం వెలిగించిన తరువాతే నా ముందు దీపం వెలిగిస్తారు." అని వరం ఇచ్చాడు.  

  గుడి లోకి వెళ్ళినపుడు ముందుగా ధ్వజస్తంభానికి మొక్కి, ప్రదక్షణలు చేసిన తరువాత చేసుకున్న దైవదర్శనమే నిజమైన దర్సనంగా అప్పటినుంచి ఆచారంగా స్ధిరపడ్డది. దేవుడు లేని దేవాలయం ఉండొచ్చు కానీ ధ్వజస్తంభం లేని దేవాలయం మాత్రం ఉండదు.  ఇది జైమినీభారతం లోని గాథ. 

ఈ కథ ద్వారా నేర్చుకోవాల్సిన నీతి ఏమిటి?  

ప్రజలసొమ్ము ను ఇష్టారాజ్యంగా దానధర్మాలకు ఉపయోగించకూడదు.  కేవలం కీర్తికాంక్ష తో దానాలు చెయ్యకూడదు.  

 ఆడినమాట తప్పకూడదు.  ప్రాణం పోతుందని తెలిసినా, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలి. 

ఇలాంటి నీతి కథలు పిల్లలకు బోధిస్తే వారు విలువలు నేర్చుకుని వారి బుద్ధికుశలత ధ్వజస్తంభం లా నిటారుగా నిలబడుతుంది.  ప్రతిఒక్కరూ పూజిస్తారు.

అసలు భక్తి -ముక్తిని గురించి తెలుసుకుందాం!

శంకర భగవత్పాదులు ఇలా అంటారు. “మోక్షకారణ సామగ్ర్యాం భక్తిరేవ గరీయసీ స్వస్వరూపానుసంధానం భక్తి రిత్యభిదీయతే” అంటే మోక్షానికి కార​ణాలైన వాటిల్లో “భక్తి” ​గొప్పది​ అని ​. “స్వస్వరూప అనుసంధానమే” భక్తి అనబడుతుంది. భగవంతుడు దూరంగా ఉన్నాడనుకొంటే దూరంగానే ఉంటాడని, దగ్గర ​ఉన్నాడని ​అనుకొంటే దగ్గరే ​ఉంటాడని ​అని చెప్తారు! అవగాహన కానంతసేపూ దూరంగా ఉంటుంది​,​ అర్థమయితే దగ్గరే (లోపలే) ఉంటుందని అర్థం. 

చిత్త వృత్తులు పరమేశ్వరుని ​చేరి చేరి ఎల్లప్పుడూ ఉంట​మే భక్తి. ప్రమాణ, విపర్యయ, వికల్ప, నిద్రా, స్మృతి అనే ఐదూ చిత్త-వృత్తుల నిరోధమే “యోగ” మనబడుతుందనీ పతంజలి మహర్షి ​చెప్పాడు . అదే భక్తి ​అని శంకరుల వివరణ.

ఇలాంటి భక్తి వలనే మానవుడు తరిస్తాడు.​ ఒక్క మాటలో చెప్పాలంటే ​భగవంతుని పట్ల ప్రేమనే భక్తి ​అనొచ్చు. అటువంటి​ ​​భక్తుల పట్ల పరమేశ్వరుడు ​సంతృప్తిగా ఉండి ,వారి బాధ్యతలను తానే భరిస్తాడు.

 “అనన్యాశ్చింతయంతోమాం​ ​ యే జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం” ఎవరైతే నన్ను అనన్య భక్తితో సేవిస్తారో వారి యోగక్షేమాలు నేనే వహిస్తాను అన్నది భగవంతుడి ​హామీ!

ఇంతకన్నా మనకు ఏమి కావాలి? ఈ భక్తి ఎప్పుడైతే ​ఏమీ ఆశించదో అప్పుడే దానిని శరణాగతి అంటారు.

చాలా మంది భక్తి భావాన్ని వివిధ కారణాల చేత ఏర్పరుచుకుంటుంటారు.​ ​కొంత మంది పుణ్యం కోసం భక్తిని పెంచుకుంటే,​ ​కొందరు పాప ​భయంతో , మరికొందరు మన అవసరాలను భగవంతుడు తీరుస్తాడ​ని భక్తిని అలవరుచుకుం​టున్నారు. భక్తులలో నాలుగు రకాల
వారుంటారని ,ఈ నాలుగు రకాల వారు భగవంతుడితో సంబంధం పెట్టుకుంటారని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెబుతాడు.

ఆ​ ​నాలుగు రకాలవాళ్ళు–​కష్టాల్లో ఉన్నవాడు, కోరికలున్నవాడు​, జిజ్ఞాసువు (అంటే జ్ఞానం పొందాలనే ఆసక్తి ఉన్నవాడు​)​​, జ్ఞాని.​ 

నేటి ప్రపంచంలో మొదటి రెండు కోవలకు చెందినవాళ్లనే మనం ​ఎక్కువగా ​​చూస్తున్నాం!

భక్తి అనేది ఒక యోగం.​

దీన్ని గురించి రెండు ఉదాహరణలు చెప్పారు.

మొదటిది మర్కట కిశోర న్యాయం. మర్కట కిశోరం అంటే కోతిపిల్ల. ఇది తన తల్లి ఒక కొమ్మ నుంచి మరొక కొమ్మకు ఎగిరేటప్పుడు తల్లి కడుపును జాగ్రత్తగా పట్టుకునే ఉంటుంది. ఇది కష్టమైన పని. వేదాంత మార్గంలో ​నడిచేవాడు దీన్ని అనుసరిస్తాడు.

రెండవది మార్జాల కిశోర న్యాయం. మార్జాల కిశోరమంటే పిల్లిపిల్ల. దీన్ని దాని తల్లే నోటితో పట్టుకుని జాగ్రత్తగా తీసుకెళుతుంది. భక్తి మార్గంలో ​నడిచేవాడు దీన్ని అనుసరిస్తాడు.

ఎవరైతే మనసా, వాచా, కర్మణా భగవంతుని యందు భక్తి కలిగి ఉంటారో ,వారి యోగక్షేమాన్ని ​భగవంతుడే భరిస్తాడనేదానికి ​ఒక యదార్ధ సంఘటనకు ఉదాహరణ.

కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ చంద్ర​శేఖర​ ​సరస్వతుల​ ​వారికి ముందు పీఠాధిపతులుగా ​అదే పేరుతో ఇంకో స్వామి వారుండేవారు. వారు అమ్మవారి​కి​ ​గొప్ప ఉపాసకులు.

 వారితో వాదభిక్ష (వాదించాలని కోరుకోవడం) కావాలని ఒకసారి కొందరు వచ్చారు.

వారిని వాదం మొదలెట్టమన్నారు స్వామి వారు.

అందుకు ​వారన్నారు “స్వామీ మీ ఒళ్ళో కూర్చున్న ఆ అందమైన పాపను చూస్తుంటే మా నోట మాట ​రావటం లేదు. ఆ పాపను ​ మాకు కనిపించకుండా చేస్తే మేము మాట్లా​డగలం ” అన్నారు.

అప్పుడు స్వామి వారన్నారు “నేనొక సన్యాసిని. నా ఒళ్ళో పాప ఆడుకోవడం ఏంటి? మీరేదో పొరబడుతున్నారు” అన్నారు.

అప్పుడు వారన్నారు “కాదు స్వామీ! మీ ఒళ్ళో పాపను ​ప్రత్యక్షంగా ​మేం చూస్తున్నాం. ​అందువల్లే మేము మాట్లాడలేకపోతున్నాం! “

అప్పుడు ​ఆ ​స్వామి ​వారు ”ఆ పాప మరెవరో కాదు. నేను ఉపాసిస్తున్న కామాక్షి అమ్మవారే​! ఆమె​కు నామీద కల ​​దయ వలనే మీరు వాదించలేక పోతున్నారు.” అన్నారు.

శరణాగతి స్థితికి చేరుకున్న భక్తులతో ,భగవంతుడు ఇలా ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంటాడు​.​ భక్తి భావా​నికి అంతిమ ​లక్ష్యం ​ఏమిటంటే-జన్మరాహిత్యం.

దీనికోసం​ నిరంతరం ​భగవంతుడిపై భక్తిని ​కలిగివుండాలి . ఆ భగవత్ స్వరూపాన్ని మనలో నిక్షిప్తం ​చేసుకుంటే ​ఏదో ఒకరోజు ​ఈ జీవు​డు పరమాత్ముడితో అనుసంధానం ​అవుతాడు. దాన్నేఆత్మ సాక్షాత్కారమని అంటారు.

భగవంతుడికి కావలసింది భక్తి మాత్రమే.

మనకు ఎంత సంపద ఉందన్నది అనవసరం.​ ​భక్తితో​ ​ఎంత సమర్పించా​మన్నది మత్రామే ​ప్రధానం.

విజయమాల్యా లాంటి వాళ్ళు దేవునికి సమర్పించిన కొన్ని వేల కోట్ల కంటే​,​ బడుగుజీవి కష్టపడి కూలీనాలీ చేసుకొని సంపాదించి భక్తితో ఇచ్చిన ఒక్క రూపాయే భగవంతుడికి ప్రీతి.

కొన్ని బారువుల ​బంగారంతో సత్యభామ శ్రీ కృష్ణుడిని తూచలేకపోయింది. రుక్మిణీ దేవి అదే శ్రీ కృష్ణుడిని భక్తితో ఒక తులసీద​ళంతో ​తూచి దక్కించుకుంది. యశోద కృష్ణుడిని ఏకంగా భక్తి , ప్రేమ, అనురాగాలతో కట్టి పడేసింది!

ఎవరు జ్ఞాని?

భారతీయ జ్ఞానసంపద పురాతన కాలం నుండీ విలక్షణంగా విరాజిల్లుతున్నది. ప్రపంచ నాగరికతలు ప్రారంభమయ్యే సరికే భారతావని లో జ్ఞానసంపద సాగరమై విలసిల్లింది. ‘అతతి సర్వత్ర వ్యాప్నోతి ఇతి ఆత్మః’. ‘అంతటా వ్యాపించి ఉన్నదే ఆత్మ..’ అంటూ ఏనాడో ఆత్మకు నిర్వచన మిచ్చి ఆత్మసాక్షాత్కారం పొందిన పవిత్ర నేల ఇది. వేదాలు కర్మకాండల ద్వారా దేవతల దీవెన లు పొందేందుకు నిర్దేశించి ఉండగా, కొంతమంది ఋషులు తర్కమార్గంలో సమస్త చరాచరానికి హేతువు ఎవరనే ఆసక్తితో శోధన మొదలుపెట్టారు. వారు కనిపించే ప్రాకృతిక పదార్థాల మూలతత్త్వా న్ని ఆధారంగా చేసుకుని, కంటికి కనిపించని అనంతతత్వాన్ని పట్టుకున్నారు. ఆ జ్ఞానసంపదను ‘వేదాంతాలు’గా చెప్పబడే ఉపనిషత్తుల రూపంలో నిక్షిప్త పరిచారు. ప్రాకృతిక రూపాలకు హేతువైన సూర్యుడిని ఛేదించి, ఆ తేజస్సుకు ఆవల ఉన్న దానిని అన్వేషించి దాన్ని సాధించడం ఉపనిషత్తుల్లో కనిపిస్తుంది.

ఈ జ్ఞానఫలాలు జిజ్ఞాసి సాధన చేయనంత వరకు అర్థం కావంటే అతిశయోక్తి కాదు. ‘పూర్ణమదః పూర్ణమిదం’ అన్నది శాస్త్రం. అంటే, పూర్ణమైనటువంటి ఆత్మనుండే దృశ్యమాన ప్రపంచం ఉద్భవించింద నీ, ఆ పూర్ణం నుండి ఏ పూర్ణాన్ని తీసి వేసినా పూర్ణమే మిగులుతుందని ఓ అద్భుత నాందీ ప్రస్తావన ‘ఈశావాస్యోపనిషత్తు’లో కనిపిస్తుంది. ఈ శ్లోకార్థం ఖగోళ, గణితసూత్రాలను ప్రతిబింబిస్తుంది.

 జ్ఞానం అరిషడ్వర్గాలను హరించి వేస్తుంది. తపస్సు, ధ్యానం లాంటివి అరిషడ్వర్గాలకు తాత్కాలిక విరామాన్నే ఈయగలుగుతాయి. విశ్వామిత్రుడు, దుర్వాసుడులాంటి వారి చరిత్రలు నిరూపించింది కూడా ఇదే. కానీ, జ్ఞానమొక్కటే మేథలో ఆత్మతత్త్వాన్ని నిలుపగా అరిషడ్వర్గాలకు చోటులేకుండా పోతుంది. ఐతే, ఆత్మతత్త్వాన్ని అర్థంచేసుకోవడం అంత సులువైన విషయం కాదు. అర్థమైనా ఆచరించడానికి నిరంతర తపన అవసరం. ఆదిశంకరులు విశ్వనాథుని దర్శనార్థం గంగానదినుండి బయలుదేరగా, ఎదురైన అపరి శుభ్ర వ్యక్తిని పక్కకు తప్పుకోమంటాడు. 

ఆ తర్వాత ఆ వ్యక్తి ఆత్మ చైతన్య తత్త్వాన్ని ఈ అద్వైత సిద్ధాంతకర్తకే విడమర్చి చెప్పడం సదా స్మరణీయం. అంతుచిక్కని జ్ఞానం సముపార్జించడమంటే, వేదవేదాంగాలను మించిన పనిగా ‘ముండకోపనిషత్తు’ప్రకటించింది.

ఉపనిషత్తుల అధ్యయనం అనేది జిజ్ఞాసిని, చరాచర ప్రపం చాన్ని సృష్టించి, తనలోనే నిలుపు కున్న ఆ అనంత విశ్వాంత రాళాల లోకి తీసుకెళ్తుంది. ఆత్మతత్త్వాన్ని దొరకబుచ్చుకున్న సాధకుడిని ఆ తాత్త్వికత ఓ అద్భుతమైన వర్ణనాతీ తమైన ఆనంద డోలికల్లో ఓలలాడింప జేస్తుంది. ఆత్మసాక్షాత్కారం సాధకుడిని ’అహం బ్రహ్మాస్మి’ గా మార్చివేస్తుంది. అతనిలో భేదభావం నశించిపోతుంది. దీనివల్ల అలాంటి వారు ‘సర్వాంతర్యామి’ని తనలోనే అనుభస్తారు. తను చూసే దృశ్యమాన ప్రపంచం అంతా తానుగానే గ్రహిస్తారు. అదో అవ్యాజమైన, అనిర్వచనీయమైన ఆనందస్థితి. ‘కేనోపనిషత్తు’లో ప్రకటించినట్లుగా ప్రతి చైతన్యస్థితిలోనూ ఆత్మ ను గ్రహించే వ్యక్తే జ్ఞాని. అతనికి చర, అచరాల నడుమ భేదమేమీ కని పించదు. ఆత్మనుండి శక్తి లభించినట్లుగా, జ్ఞానం నుండే అమరత్వకరమూ లభిస్తుంది. అతనే జ్ఞానరూపంలో ఆత్మయై నిత్యమూ విరాజిల్లుతాడు.

రావుల నిరంజనాచారి 🙏

Bhagavad Gita: Chapter 2, Verse 19

य एनं वेत्ति हन्तारं यश्चैनं मन्यते हतम् |
उभौ तौ न विजानीतो नायं हन्ति न हन्यते || 19||

ya enaṁ vetti hantāraṁ yaśh chainaṁ manyate hatam
ubhau tau na vijānīto nāyaṁ hanti na hanyate

yaḥ— one who ; enam — this ; vetti
— knows ; hantāram — the slayer ;
yaḥ— one who ; cha — and ; enam
— this ; manyate — thinks ; hatam
— slain ; ubhau — both ; tau— they ;
na — not ; vijānītaḥ — in knowledge ; na— neither ; ayam —
this ; hanti— slays ; na — nor ;
hanyate — is killed

Translation

BG 2.19 : Neither of them is in knowledge—the one who thinks the soul can slay and the one who thinks the soul can be slain. For truly, the soul neither kills nor can it be killed.

Commentary

The illusion of death is created because we identify ourselves with the body. The Ramayan explains this as follows:

jauṅ sapaneṅ sira kāṭai koī, binu jāgeṅ na dūri dukh hoī. [v23]

“If we dream of our head getting cut, we will perceive its pain until we wake up.” The incident in the dream is an illusion, but the experience of the pain continues to torment until we wake up and dispel the illusion. Similarly, in the illusion that we are the body, we fear the experience of death. For the enlightened soul whose illusion has been dispelled, this fear of death vanishes.

One may ask that if nobody can kill anyone, then why is murder considered a punishable offense? The answer is that the body is the vehicle of the soul, and destroying any living being’s vehicle is violence, which is forbidden. The Vedas clearly instruct: mā hinsyāt sarvabhūtāni [v24] “Do not commit violence toward anyone.” In fact, the Vedas even consider killing of animals as a crime. However, there are occasions where the rules change and even violence becomes necessary. For example, in cases where a snake is approaching to bite, or if one is attacked with lethal weapons, or one’s life sustenance is being snatched away, then violence is permitted for self-protection. In the present situation, what is appropriate for Arjun, violence or non-violence, and why? Shree Krishna will explain this to him in great detail, as the dialogue of the
Bhagavad Gita progresses. And in the course of the explanation, priceless divine knowledge will be revealed to shed light on the subject.

విష్ణుదత్తుడు చేసిన దత్త స్తుతి

దత్తాత్రేయుని పిత్రు స్థానమున కుర్చోబెట్టి  శాస్త్రోక్తముగా శ్రాద్ధము పెట్టిన తరువాత, స్వామి తృప్తి చెందారు. 
నీకు నాశనము లేని ఫలము కలిగినదని స్వామి చెప్పగా, సాష్టాంగనమస్కారములు చేసి విష్ణుదత్తుడు ఈ విధముగా స్తుతించారు🙏...

1.🔸దత్తాత్రేయం హరిం కృష్ణం! ఉన్మాదం ప్రణతోస్మ్యహమ్!
ఆనందదాయకం దేవం! మునిబాలం దిగంబరమ్॥🙏
భావము :: దత్త దేవుడు, అత్రిపుత్రుడు, విష్ణువు, కృష్ణుడు, అనందము చే ఉన్మత్తుడు, ఆనందమును ఇచ్చె వాడు, ప్రణవస్వరూపుడు,మునిబాలుడు, దిగంబరుడు అయిన దత్తాత్రేయునికి నమస్కారించు చున్నాను.

2.🔸పిశాచరూపిణం విష్ణుం! వందేహం జ్ఞానసాగరం!
యోగినం భోగినం నగ్నం!అనషూయాత్మజం కవిమ్ ॥🙏

భావము:: పిశాచరూపుడు, సర్వవ్యాపకుడు,జ్ఞానసముద్రుడు, యోగి, భోగి, దిగంబరుడు, అనసూయా పుత్రుడు, సర్వజ్ఞుడు అయిన స్వామికి నమస్కారము.

3.🔸భోగ మోక్షప్రదం వందే! సర్వదేవ స్వరూపిణం!
ఉరుక్రమం విశాలాక్షం! పరమానంద విగ్రహం ॥🙏
భావము:: భోగమోక్షములను ఇచ్చువాడు, సర్వ దేవస్వరూపుడు, గొప్ప పరాక్రమము కలవాడు, విశాలమైన కన్నులు కలవాడు, పరమానందమే శరీరముగా కలవాడవు అగు నీకు నమస్కారము.

4.🔸వరదందేవదేవేశం వందే! కార్తవీర్యవరప్రదం !
నానారూపధరం హృద్యం! భక్త చింతామణిం గురుమ్ ॥🙏
భావము :: దేవదేవులకు ప్రభువైన వాడవు, వరములిచ్చువాడవు, కార్తవీర్యునికి అనేక వరములు ఇచ్చినవాడవు, నానారూపములు ధరించెడి వాడవు, హృదయమునకు ఇష్టుడైనవాడవు, భక్తులకు చింతామణి లాంటి వాడవు, గురువైన నీకు నమస్కారము.

5.🔸విశ్వవంద్యపదాంబోజం! యోగి హృత్పద్మవాసినమ్!
ప్రణతార్తిహరం గూఢం! కుత్సితాచార చేష్టితమ్॥🙏
భావము:: విశ్వములోని జనులందరిచే నమస్కరింపదగిన పాదపద్మాలు కలవాడవు, యోగుల హృదయములందు నివశించెడివాడవు,నమస్కారించు వారి బాధలను పోగొట్టేవాడవు, రహస్యంగా వుండెడి వాడవు, విచిత్రమైన ఆచారము, చేష్టలు కలవాడవు అయిన దత్తాత్రేయునికి నమస్కారములు.

6.🔸 మితాచారం మితాహారం! భక్ష్యా భక్ష్య వివర్జితమ్!
ప్రమాణం ప్రాణనిలయం! సర్వాధారం నతోస్మ్యహం ॥🙏
భావము:: మితమైన ఆచారము, ఆహారం కలిగినవాడు, తినతగిన ,తినకూడని ఆహారము అనే దంద్వమును విడిచిన వాడవు ( ఆహారం మీద ఇష్టం, అయిష్టం లేని వాడు), అన్నిటికీ ప్రమాణం అయిన వాడు, అందరిలో ప్రాణముల రూపంలో నివశించుచూ, సర్వమునకు ఆధారమైనవాడవగు ఓ దత్త ప్రభో! నీకు నమస్కారము.

7.🔸సిద్ధసాథక సంసేవ్యం! కపిలం కృష్ణ పింగళం!
విప్రవర్యం వేదవిదం! వేదవేద్యం వియత్సమమ్॥🙏
భావము:: సిద్ధులు, సాథ్యులు, భక్తులు అందరిచే సేవించబడేవాడు , చిత్రమైన వర్ణములు కలిగినవాడవు, నల్లని, పచ్చని రూపములు కలిగిన వాడు, విప్రులలో శ్రేష్ఠమైనవాడవు, వేదములు తెలిసినవాడవు, వేదములచే తెలియతగిన వాడవు, ఆకాశముతో సమానమైన వాడవు అగు నీకు నమస్కారము.

8.🔸పరాశక్తి పదాశ్లిష్టం! రాజరాజ్యప్రదం శివమ్!
శుభదం సుందరగ్రీవం! సుశీలం శాన్త విగ్రహమ్॥🙏
భావము:: పరాశక్తితో కూడిన వాడు,రాజరాజ్యములను ఇచ్చువాడు, మంగళ స్వరూపుడు,,శుభములు ఇచ్చువాడు,సుందరమైన కంఠం కలవాడు, మంచి స్వభావం కలిగిన వాడు, శాంతస్వరూపుడు అయిన దత్తాత్రేయునికి నమస్కారించు చున్నాను.

9.🔸 యోగినం రామయాస్పృష్టం! రామా రామం రమాప్రియం!
ప్రణతోస్మి మహాదేవం! శరణ్యం భక్తవత్సలం ॥🙏
భావము:: యోగిఅయిన వాడు, లక్ష్మిదేవి తో కూడిన వాడు, లక్ష్మీ ప్రియుడు, మహాదేవుడు, రక్షకుడు, భక్తులయందు వాత్సల్యము కలిగిన వాడవైన నీకు నమస్కారము.

10.🔸వీరం వరేణ్య
మృషభం! వృషాచారం వృషప్రియమ్!
అలిప్తమనఘం మేధ్యం! అనాదిమగుణం పరమ్ ॥🙏
భావము:: వీరుడు, ప్రార్ధనీయుడు,శ్రేష్ఠమైనవాడు, శ్రేష్ఠమైన ఆచారము కలవాడు, వృషప్రియుడు, దేనితో సంబంధము లేనివాడు, పాపములేనివాడు, ఆది లేనివాడు, నిర్గుణుడు అయిన స్వామికి నమస్కారము.

11.🔸అనేకమేక మీశానం! అనంతమనికేతనమ్ !
అధ్యక్ష మసురారాతిం ! శమం శాంతం సనాతనమ్॥🙏
భావము:: అనేక రూపములలో వున్న ఏక స్వరూపుడు, ఈశానుడు, నాశనము లేనివాడు, అందరికీ ప్రభువు, రాక్షసులకు శత్రువు, అనంతుడు, శమస్వరూపుడు, శాంతుడు, సనాతనుడు అయిన స్వామికి నమస్కారము.

12.🔸గుహ్యం గభీరం గహనం! గుణజ్ఞం గహ్వరప్రియమ్!
శ్రీదం శ్రీశం శ్రీనివాసం! శ్రీవత్సాంకం పరాయణమ్॥🙏
భావము:: రహస్యమైనవాడు, లోతైన భావములు కలవాడు, దొరకనివాడు,గుహయందు ఇష్టము కలవాడు, లక్ష్మి ని ఇచ్చువాడు, లక్ష్మి నివాసుడు, శ్రీవత్సమను పుట్టుమచ్చ కలిగినవాడు, పరబ్రహ్మమే గతిగా కలిగిన స్వామికి నమస్కారము.

13.🔸జపంతం జపతాం వంద్యం! జయంతం విజయప్రదమ్!
జీవనం జగతః సేతుం! జానానమ్ జాతవేదసమ్॥🙏
భావము:: జపించువారిలో జపించువాడును,జపస్వరూపుడు, నమస్కారింపతగిన వాడు,జయ స్వరూపుడు, విజయాలను ఇచ్చువాడు, జగత్తుకు జీవనం అయిన వాడు, అన్నిటి ఎరుక కలవాడు, జగత్తు కు సేతువైనవాడు, అగ్ని అయిన వాడు అయిన స్వామికి నమస్కారము.

14.🔸యజ్ఞమిజ్యం యజ్ఞభుజం! యజ్ఞేసం యాజకం యజుః!
యష్టారం ఫలదం వందే! సాష్టాంగం పరయా ముదా॥🙏
భావము:: యజ్ఞస్వరూపుడు,యజ్ఞమున ప్రార్థింపతగినవాడు, యజ్ఞమున హవిస్సులను తినువాడు, యజ్ఞములకు ప్రభువైన వాడు, యజుర్వేద స్వరూపుడైనవాడు, సోమయాజి అయిన వాడు, యజ్ఞ ఫలములను ప్రసాదించు వాడు, అయిన దత్తాత్రేయునికి పరమ సంతోషంతో సాష్టాంగ పడి నమస్కారించున్నాను🙏🙏🙏

         *_🍁శుభమస్తు🍁_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏

జ్ఞాన సౌందర్యం


 🌷 ధనం గురించి ,అది లభించే మార్గాల గురించి , ఎంతసేపు ఆలోచించినా కోటీశ్వరుల భజన చేసినా  ఒక్క రూపాయి కూడా లభించదు.
      
 🌷జ్ఞానం గురించి మాట్లాడుతూ,  చర్చిస్తూ, ఆలోచిస్తూ, జ్ఞానుల సాంగత్యం లో ఉంటేనే , జ్ఞానుల ని ఆరాధిస్తే  వారి  నుండి జ్ఞానం మన లోకి  ప్రవహిస్తుంది.
      
 🌷జ్ఞానం ఒక అగ్ని,  మనలోని సమస్త మాలిన్యాలని దహిస్తుంది. అహంకారం కరిగి పోతుంది.

 🌷జ్ఞానం ఒక ఐశ్వర్యం.  క్రమంగా పెరుగుతూ  జన్మ జన్మ కి వెంట వస్తుంది.
  
🌷జ్ఞానం  ఒక ప్రేమ స్వరూపం.  జ్ఞానం ఉన్నవారే
తమని ప్రేమించే వారి  హృదయాన్ని. గుర్తించగలరు. స్వయంగా అందించగలరు.

  🌷జ్ఞానం  ఒక సౌందర్యం.    జ్ఞానం పొందిన వారి
మాటల్లో. ,ప్రవర్తన లో ,  వ్యక్తిత్వం లో,  విశ్వాసాల్లో, కోరికల్లో,   వారి  ప్రతి అణువు లో  జ్ఞానమే కనిపిస్తుంది..

       ఈ కారణం గానే  శ్రీ కృష్ణుడు భగవద్గీత లో 
". *నహి జ్ఞానేన సదృశం "*  అన్నాడు.
.🙏🙏🙏💐💐💐